అన్వేషించండి

Manchu Lakshmi On IndiGo Staff: విమానాశ్రయంలో మంచు లక్ష్మిని అడ్డుకున్న విమాన సిబ్బంది - ఇదేం సర్వీస్ అంటూ ఫైర్

ఇటీవల మంచు లక్ష్మి తిరుపతి నుంచి హైదరాబాద్ కు విమానంలో వచ్చింది. ఆ సమయంలో ఆమె విమాన సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మంచు లక్ష్మి ఆ విమాన సంస్థ పై ఫైర్ అయింది. ఈ మేరకు జరిగిన విషయాన్ని ట్వీట్ చేసింది.

సినీ నటుడు మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మికి ఓ విమానయాన సంస్థ నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఆ వార్త కాస్తా నెట్టింట వైరల్ అయింది. దీనిపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. 

అసలేం జరిగిందంటే..

ఇటీవల మంచు లక్ష్మి తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చింది. అయితే విమానం దిగిన తర్వాత అందులో బ్యాగ్ మరచిపోయిన విషయం గుర్తొచ్చింది. వెంటనే వెళ్లి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే ఈ లోపు విమాన సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. బ్యాగ్ మరచిపోయాను తెచ్చుకోవాలి అని చెప్పినా వినలేదు. దీంతో చేసేదేమీ లేక ఆమె అక్కడే కూర్చోవాల్సి వచ్చింది. దాదాపు గంటకు పైగా ఆమె వెయిట్ చేసినట్టు తెలిపింది. ఆ సమయంలో తాను 103 డిగ్రీల ఫీవర్ తో ఉన్నానని, అయినా కూడా విమాన సిబ్బంది పట్టించుకోలేదని వాపోయింది. ఆరోగ్యం బాగోకపోయినా కూడా విమాన సిబ్బంది అలా ప్రవర్తించడం పట్ల అసహనం వ్యక్తం చేసింది. జరిగిదంతా తన సోషల్ మీడియా ఖాతాలో రాసి షేర్ చేసింది మంచు డాటర్. 

కనీసం కస్టమర్ సర్వీస్ కూడా లేదు: మంచు లక్ష్మి

తాను తిరుపతి నుంచి హైదరాబాద్ కు రావడానికి కూడా అంత సమయం పట్టలేదు అంటూ దుయ్యబట్టింది లక్ష్మి. గంటకు పైగా ఎదురు చూశానని, ఎవ్వరూ కూడా తన బ్యాగ్ తెచ్చి ఇవ్వలేదని విమర్శించింది. గ్రౌండ్ డ్యూటీ స్టాఫ్ ఒక్కరు కూడా కనిపించలేదని, కస్టమర్ సర్వీస్ లేకుండా సంస్థ ఎలా నడుస్తుందో అంటూ చురకలంటించింది. ‘బ్యాన్ ఇండిగో’ అని హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేసి తన నిరసనను వ్యక్తం చేసింది లక్ష్మి. దీంతో ఈ వార్త చర్చనీయాంశమైంది.

స్పందించిన ఇండిగో..

మంచు లక్ష్మి చేసిన ట్వీట్ పై ఇండిగో విమాన సంస్థ స్పందించింది. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం అని పేర్కొంది. తమ సిబ్బందితో మాట్లాడామని, వారు మీతో మాట్లాడతారు అని ట్వీట్ చేసింది. మీరు బ్యాగ్ ను కలెక్ట్ చేసుకొని ఉంటారని భావిస్తున్నాం, తిరిగి మా విమానంలో ప్రయాణిస్తారని ఆశిస్తున్నాం అని ఇండిగో పేర్కొంది. 

అయితే విమానాల్లో లేదా విమానాశ్రయాల్లో అప్పుడప్పుడూ ఇలాంటి ఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రెటీలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. గతంలోనూ పలువురు ప్రముఖులు విమాన సిబ్బంది పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు కూడా. అయితే మంచు లక్ష్మి ట్వీట్ పై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం అంత జ్వరంలో ప్రయాణాలు చేయడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. 

Also Read : 'కెజియఫ్' మీద కామెంట్స్‌పై వెనక్కి తగ్గని వెంకటేష్ మహా - మంట మీద పెట్రోల్ పోశారా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Singer Chinmayi Sripada : పవన్‌ కల్యాణ్‌కు అతని గురించి ఏమీ తెలియదు - సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్
పవన్‌ కల్యాణ్‌కు అతని గురించి ఏమీ తెలియదు - సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్
Chinmayi Sripada: మన మగాళ్ళ డీఎన్ఏలో రేప్ కల్చర్ ఉంది... వైరముత్తు & త్రిష ఇష్యూలో చిన్మయి సంచలన వ్యాఖ్యలు
మన మగాళ్ళ డీఎన్ఏలో రేప్ కల్చర్ ఉంది... వైరముత్తు & త్రిష ఇష్యూలో చిన్మయి సంచలన వ్యాఖ్యలు
Suyodhana Teaser Review : హీరో ఒక్కడికే వినిపిస్తే... అతనికే కనిపిస్తే... ఎవరీ సుయోధన?
హీరో ఒక్కడికే వినిపిస్తే... అతనికే కనిపిస్తే... ఎవరీ సుయోధన?
Actress Poorna : పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ పూర్ణ - భర్తతో కలిసి బెస్ట్ మూమెంట్
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ పూర్ణ - భర్తతో కలిసి బెస్ట్ మూమెంట్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget