అన్వేషించండి

Kriti Sanon: కొత్త వ్యాపారం మొదలు పెట్టిన ‘ఆదిపురుష్’ జానకి

అందాల తారు కృతి సనన్ కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టింది. తన సోదరి నుపురు సనన్ తో కలిసి ఈ బిజినెస్ ప్రారంభించింది. సోషల్ మీడియా వేదికగా తన కొత్త బిజినెస్ కు సంబంధించిన లోగోను ఆవిష్కరించింది.

‘ఆదిపురుష్’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా, జానకి పాత్రలో కృతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక నటిగా బాలీవుడ్‌లో దాదాపు దశాబ్దం పూర్తి చేసుకున్న కృతి సనన్, ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించింది. బీ టౌన్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ పలు సినిమాల్లో కనిపించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సరికొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టింది. చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు లోగో సహా పలు వివరాలను సోషల్ మీడియా వేదికగా ఆవిష్కరించింది.  

సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన కృతి సనన్

తాజాగా ఇన్ స్టా వేదికగా కృతి సనన్ తన ప్రొడక్షన్ హౌస్ లోగోతో పాటు చిన్న క్లిప్‌ ను షేర్ చేసింది.  తన నిర్మాణ సంస్థకు ‘బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్స్’ అనే పేరు కూడా కన్ఫామ్ చేసింది.  కొత్త వ్యాపారంలోకి అడుగు పెడుతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉన్నట్లు ప్రకటించింది. తన కెరీర్  గేర్ మార్చడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.  “గేర్ మార్చే సమయం వచ్చింది. నేను 9 సంవత్సరాలుగా ఈ కల కోసం ఎదురు చూస్తున్నాను. సినిమా పరిశ్రమలో ఎన్నో కలలు కంటూ వస్తున్నాను. బేబీ స్టెప్స్ వేశాను. నేర్చుకున్నాను. పరిణామం చెందాను. ఈ రోజు నటిగా ఎదిగాను.  ఫిల్మ్ మేకింగ్‌లోని ప్రతి  అంశాన్ని నేను పరిశీలించాను. ఇప్పుడు నేను మీకో విషయాన్ని చెప్తాను. ఇకనై నా హృదయాన్ని తాకే,  మీ గురించి ఆశాజనకంగా ఉండే మరిన్ని కథలను చెప్పడానికి, మరింత చేయడానికి సమయం ఆసన్నమైంది.   నిండు హృదయంతో, పెద్ద కలలతో ‘బ్లూ బటర్ ప్లై ఫిల్మ్స్’ సంస్థను ప్రారంభిస్తున్నాను. ఈ విషయాన్ని మీతో పంచుకునేందుకు సంతోషిస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.    

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kriti (@kritisanon)

వరుస సినిమాలో కృతి ఫుల్ బిజీ

కృతి సనన్ చివరిగా ఓం రౌత్  ‘ఆదిపురుష్‌’ చిత్రంలో ప్రభాస్ సరసన జానకి పాత్రలో కనిపించింది. ప్రేక్షకులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. పలు వివాదాలకు కారణం అయ్యింది. ఇక కరీనా కపూర్, టబు కలిసి నటించిన ‘క్రూ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అటు షాహిద్ కపూర్‌తో కలిసి ఒక చిత్రం చేస్తోంది. అమితాబ్ బచ్చన్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘గణపత్’ చిత్రం ఆమె లైనప్ లో ఉంది. ‘గణపత్’ మూవీ ఈ ఏడాది అక్టోబర్ 20న థియేటర్లలోకి రానుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kriti (@kritisanon)

Read Also: ఈ బార్బీ ఇంట్లో మీరూ స్టే చేయొచ్చు, ఈ ఫొటోలు చూస్తే ఆశ్చరపోతారు!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget