అన్వేషించండి

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన

Andhra News: గిరిజన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు.

Pawan Kalyan Visited Manyam District: గత వైసీపీ హయాంలో రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టారు కానీ.. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో రోడ్లు మాత్రం వేయలేకపోయారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా (Manyam District) సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ బాగుజోల గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతన రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. 'కూటమి ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో సుమారు రూ.38.71 కోట్ల వ్యయంతో, 39.32 కి.మీ మేర నూతన రోడ్ల నిర్మాణం చేపడుతోంది. తద్వారా 55 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కలుగుతుంది. రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలని తిరుపతి కొండ ఎక్కినప్పుడు మొక్కుకున్నాను. 2017 పోరాట యాత్ర సమయంలో గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కొన్ని సమస్యలు చూశాను. తాగునీరు, రహదారులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు నిర్మిస్తున్నాం. సుందర జలపాతాలున్న ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసుకోవాలి.' అని పవన్ పేర్కొన్నారు.
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన

'3 దశల్లో రోడ్ల అభివృద్ధి'
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన

రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో 3 దశల్లో రోడ్లను అభివృద్ధి చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సాలూరు నియోజకవర్గంలో బాగుజోల – సిరివర రోడ్డుకు శంకుస్థాపన చేసిన అనంతరం గిరిజనులతో ఆయన మాట్లాడారు. 'దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లైనా ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో సరైన రోడ్లు లేక సకాలంలో వైద్య సదుపాయం అందక అడవి బిడ్డలు మృత్యువాత పడడం కలిచివేసే విషయం. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ నిరక్ష్యరాస్యత, పేదరికం, ఆకలికేకలు, అనారోగ్యం పట్టిపీడుస్తున్నాయి. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో 2 నెలలకు ఓసారి కచ్చితంగా పర్యటించి సమస్యలు తెలుసుకుంటాను.' అని పవన్ స్పష్టం చేశారు.
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన

గిరిజనులతో మాటామంతీ.. 

అనంతరం పంచాయతీరాజ్ శాఖ ఉపాధి హామీ నిధులతో ఏజెన్సీ ప్రాంతంలో నిర్మించబోయే రోడ్లకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పవన్ తిలకించారు. శంకుస్థాపన చేసిన ప్రదేశం నుంచి సిరివర వెళ్లే కొండ ప్రాంతం మీదకు ఉన్న కచ్చా రోడ్డును పరిశీలించేందుకు కాలినడకన వెళ్లారు. స్వయంగా గిరిజన నివాస ప్రాంతాలకు వెళ్లి వారితో మాట్లాడారు. అనంతరం బాగుజోల గిరిజనులతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. 'రాష్ట్ర విభజన చట్టంలో వెనుకబడిన గ్రామాలకు సంబంధించి తీసుకొచ్చిన రూ. 690 కోట్లు ఎక్కడికి వెళ్లాయో తెలియదు. గత పాలకులు గిరిజనుల బతుకులు, వారి వెతలు తెలుసుకున్నదే లేదు. నేను వెంటనే అద్భుతాలు చేస్తానని చెప్పటం లేదు. ఒక సంవత్సరంలో గిరిజన ప్రాంతాల్లో మార్పు అనేది కచ్చితంగా చూపిస్తాను. గిరిజన ప్రజల కోసం ఎండనకా... వాననకా పనిచేస్తాం' అని చెప్పారు. 
 
'పర్యాటక అభివృద్ధితో యువతకు ఉపాధి'
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
 
యువత ప్రతి అంశంలోనూ నైపుణ్యం పెంచుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. 'ఇక్కడి ప్రకృతి రమణీయత చూస్తే నాకే ఆశ్చర్యం కలుగుతోంది. ఇలాంటి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే యువతకు ఉపాధి కలుగుతుంది. పర్యాటకులు, ప్రకృతిపై అధ్యయనం చేసే వారు ఇటుగా వస్తే గిరిజనుల జీవన శైలి మెరుగవుతుంది. టూరిజం ద్వారా జీవన స్థితిగతులు మెరుగవుతాయి. దీని కోసం ఆలోచన చేస్తాం. ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని జీవనోపాధి కేంద్రంగా తయారు చేస్తాం. ఇక్కడి వనరులు, వ్యవసాయ ఫలాలు స్థానికులకు దక్కేలా ప్రయత్నం చేస్తాం. హోంస్టే ఏర్పాట్లతో పాటు ప్రకృతిని ఆస్వాదించే టూరిజానికి ప్రోత్సాహం అందించడం ద్వారా మరింత ముందుకు వెళ్లొచ్చు.' అని పేర్కొన్నారు.
 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Andhra Pradesh Latest News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget