అన్వేషించండి

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన

Andhra News: గిరిజన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు.

Pawan Kalyan Visited Manyam District: గత వైసీపీ హయాంలో రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టారు కానీ.. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో రోడ్లు మాత్రం వేయలేకపోయారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా (Manyam District) సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ బాగుజోల గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతన రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. 'కూటమి ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో సుమారు రూ.38.71 కోట్ల వ్యయంతో, 39.32 కి.మీ మేర నూతన రోడ్ల నిర్మాణం చేపడుతోంది. తద్వారా 55 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కలుగుతుంది. రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలని తిరుపతి కొండ ఎక్కినప్పుడు మొక్కుకున్నాను. 2017 పోరాట యాత్ర సమయంలో గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కొన్ని సమస్యలు చూశాను. తాగునీరు, రహదారులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు నిర్మిస్తున్నాం. సుందర జలపాతాలున్న ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసుకోవాలి.' అని పవన్ పేర్కొన్నారు.
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన

'3 దశల్లో రోడ్ల అభివృద్ధి'
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన

రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో 3 దశల్లో రోడ్లను అభివృద్ధి చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సాలూరు నియోజకవర్గంలో బాగుజోల – సిరివర రోడ్డుకు శంకుస్థాపన చేసిన అనంతరం గిరిజనులతో ఆయన మాట్లాడారు. 'దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లైనా ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో సరైన రోడ్లు లేక సకాలంలో వైద్య సదుపాయం అందక అడవి బిడ్డలు మృత్యువాత పడడం కలిచివేసే విషయం. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ నిరక్ష్యరాస్యత, పేదరికం, ఆకలికేకలు, అనారోగ్యం పట్టిపీడుస్తున్నాయి. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో 2 నెలలకు ఓసారి కచ్చితంగా పర్యటించి సమస్యలు తెలుసుకుంటాను.' అని పవన్ స్పష్టం చేశారు.
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన

గిరిజనులతో మాటామంతీ.. 

అనంతరం పంచాయతీరాజ్ శాఖ ఉపాధి హామీ నిధులతో ఏజెన్సీ ప్రాంతంలో నిర్మించబోయే రోడ్లకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పవన్ తిలకించారు. శంకుస్థాపన చేసిన ప్రదేశం నుంచి సిరివర వెళ్లే కొండ ప్రాంతం మీదకు ఉన్న కచ్చా రోడ్డును పరిశీలించేందుకు కాలినడకన వెళ్లారు. స్వయంగా గిరిజన నివాస ప్రాంతాలకు వెళ్లి వారితో మాట్లాడారు. అనంతరం బాగుజోల గిరిజనులతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. 'రాష్ట్ర విభజన చట్టంలో వెనుకబడిన గ్రామాలకు సంబంధించి తీసుకొచ్చిన రూ. 690 కోట్లు ఎక్కడికి వెళ్లాయో తెలియదు. గత పాలకులు గిరిజనుల బతుకులు, వారి వెతలు తెలుసుకున్నదే లేదు. నేను వెంటనే అద్భుతాలు చేస్తానని చెప్పటం లేదు. ఒక సంవత్సరంలో గిరిజన ప్రాంతాల్లో మార్పు అనేది కచ్చితంగా చూపిస్తాను. గిరిజన ప్రజల కోసం ఎండనకా... వాననకా పనిచేస్తాం' అని చెప్పారు. 
 
'పర్యాటక అభివృద్ధితో యువతకు ఉపాధి'
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
 
యువత ప్రతి అంశంలోనూ నైపుణ్యం పెంచుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. 'ఇక్కడి ప్రకృతి రమణీయత చూస్తే నాకే ఆశ్చర్యం కలుగుతోంది. ఇలాంటి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే యువతకు ఉపాధి కలుగుతుంది. పర్యాటకులు, ప్రకృతిపై అధ్యయనం చేసే వారు ఇటుగా వస్తే గిరిజనుల జీవన శైలి మెరుగవుతుంది. టూరిజం ద్వారా జీవన స్థితిగతులు మెరుగవుతాయి. దీని కోసం ఆలోచన చేస్తాం. ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని జీవనోపాధి కేంద్రంగా తయారు చేస్తాం. ఇక్కడి వనరులు, వ్యవసాయ ఫలాలు స్థానికులకు దక్కేలా ప్రయత్నం చేస్తాం. హోంస్టే ఏర్పాట్లతో పాటు ప్రకృతిని ఆస్వాదించే టూరిజానికి ప్రోత్సాహం అందించడం ద్వారా మరింత ముందుకు వెళ్లొచ్చు.' అని పేర్కొన్నారు.
 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget