అన్వేషించండి

Niranjan Reddy: ఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల

Who Is S Niranjan Reddy?: ప్రముఖ న్యాయవాదిగా, 'ఆచార్య' నిర్మాతగా, వైసీపీ తరఫున రాజ్యసభ్యకు వెళ్లిన ఎంపీగా తెలుగు ప్రజలకు ఎస్ నిరంజన్ రెడ్డి తెలుసు. ఆయన మనీ సినిమాకు దర్శకత్వ శాఖలో పని చేశారని తెలుసా?

Rajya Sabha member Niranjan Reddy film journey: ఎస్ నిరంజన్ రెడ్డి... సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి... ఆయన గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు, రాజకీయాలు ఫాలో అయ్యే ప్రజలకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా 'ఆచార్య' ప్రొడ్యూస్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తరఫున సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసును వాదించినది ఆయనే. రాజకీయాలకు వెళితే... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసులను న్యాయవాది కూడా ఆయనే. నిరంజన్ రెడ్డి రాజ్యసభ ఎంపీ కూడా. వైసీపీ ఆయన్ను పెద్దల సభకు పంపింది. అయితే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయన ప్రయాణం ఎప్పుడు మొదలైందో తెలుసా?

నిరంజన్ రెడ్డి కోసం వర్మ రికమండేషన్!
'శివ' సినిమాతో రామ్ గోపాల్ వర్మ ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆ తర్వాత ఆయన కేవలం దర్శకత్వానికి పరిమితం కాలేదు. నిర్మాతగానూ సినిమాలు చేశారు. అందులో 'శివ'కు కో డైరెక్టర్ అయినటువంటి శివ నాగేశ్వర రావును దర్శకునిగా పరిచయం చేస్తూ నిర్మించిన 'మనీ' ఒకటి. 

'మనీ' చిత్రానికి దర్శకత్వ శాఖలో ఎస్ నిరంజన్ రెడ్డి పని చేశారు. ఆ మూవీ టైటిల్ కార్డ్స్ చూస్తే... అసోసియేట్ దర్శకులుగా ఉత్తేజ్, రమణ - అసిస్టెంట్ దర్శకులుగా శ్రీనివాస్, నిరంజన్ పేర్లు కనిపిస్తాయి. ఆ నిరంజన్, ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్న 'ఆచార్య' నిర్మాత ఎస్ నిరంజన్ రెడ్డి ఒక్కరే. 'మనీ' సినిమా దర్శకత్వ శాఖలో ఆయనను తీసుకోమని రికమండ్ చేసింది రామ్ గోపాల్ వర్మే. నిర్మాత చెబితే కాదని ఎవరైనా అంటారా? అప్రెంటిస్‌గా పెట్టుకోమని పంపించిన కుర్రాడు నిరంజన్ రెడ్డికి ఎడిటింగ్ రిపోర్ట్ రాసే పని అప్పగించారు. అతడిని ఉత్తేజ్ గైడ్ చేసేవారు. 'మనీ' తర్వాత ఇండస్ట్రీలో నిరంజన్ రెడ్డి కనిపించలేదని, కొన్నాళ్ళకు 'మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్' సంస్థ స్థాపించి నిర్మాతగా ఇండస్ట్రీలోకి వచ్చారని ప్రముఖ జర్నలిస్ట్ - నంది పురస్కార గ్రహీత - పీఆర్వో పులగం చిన్నారాయణ పేర్కొన్నారు. తన ఫేస్ బుక్ పేజీలో ఈ వివరాలు తెలిపారు.

Also Read: 'కాంతార'లో ఆ రోల్ మేకప్‌కు 6 గంటలు... మాయావి కాదు... రిషబ్ శెట్టే - మరో నేషనల్ అవార్డు గ్యారెంటీ!

నిరంజన్ రెడ్డిని 'మనీ' వదల్లేదు!
'మనీ' తర్వాత ఇండస్ట్రీని వదిలేసి నిరంజన్ రెడ్డి వెళ్లారు. అయితే ఆయన్ను మనీ వదల్లేదు. ప్రముఖ న్యాయవాదిగా వేలు, లక్షల్లో ఫీజు తీసుకునే స్థాయికి తెచ్చింది. నిర్మాతగా మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించేలా చేసింది. కింగ్ అక్కినేని నాగార్జున 'గగనం', అడివి శేష్ 'క్షణం', రానా దగ్గుబాటి 'ఘాజీ', నాగార్జున 'వైల్డ్ డాగ్', చిరంజీవి - రామ్ చరణ్ 'ఆచార్య' సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. పీవీపీ, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతలతో కలిసి ఆయన సినిమాలు చేశారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణానికి నిరంజన్ రెడ్డి విరామం ఇచ్చారు. భవిష్యత్తులో మళ్ళీ సినిమాలు చేసే అవకాశం ఉంది.

Also Read: హీరోగా మారుతున్న కమెడియన్ సత్య... దర్శకుడు ఎవరో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana private colleges strike ends:  ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
US Visa: డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
CM warns private colleges: విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
India vs Australia: గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
Advertisement

వీడియోలు

Harman Preet Kaur Smriti Mandhana | చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి | ABP Desam
గంభీర్ భాయ్.. నీకో దండం! బ్యాటింగ్‌ పొజిషన్ ఇలా సెలక్ట్ చేస్తున్నావా?
చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి
పీఎం మోదీని కలిసినప్పుడు అలా ఎందుకు చేసానంటే..!
అల్లటప్పా ఆటగాడనుకున్నారా.. రీప్లేస్ చేయాలంటే బాబులు దిగిరావాల!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana private colleges strike ends:  ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
US Visa: డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
CM warns private colleges: విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
India vs Australia: గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
Remove stray dogs: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - ఆ ప్రాంతాల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశం
వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - ఆ ప్రాంతాల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశం
Hyundai Venue : హ్యుందాయ్ వెన్యూకి పోటీగా వస్తున్న 5 కొత్త SUVలు, మరింత అడ్వాన్స్డ్‌గా ఫీచర్స్‌!
హ్యుందాయ్ వెన్యూకి పోటీగా వస్తున్న 5 కొత్త SUVలు, మరింత అడ్వాన్స్డ్‌గా ఫీచర్స్‌!
Airport operations disrupt: ఢిల్లీలోనే కాదు ముంబై ఎయిర్ పోర్టులోనూ గందరగోళం - వందల విమానాల రద్దు - అసలేం జరుగుతోంది?
ఢిల్లీలోనే కాదు ముంబై ఎయిర్ పోర్టులోనూ గందరగోళం - వందల విమానాల రద్దు - అసలేం జరుగుతోంది?
Bandi Sanjay : గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Embed widget