Rukmini Vasanth: బికినీ వీడియోపై రుక్మిణీ వసంత్ రియాక్షన్... లీగల్ యాక్షన్కు రెడీ
Rukmini Vasanth Viral Video Bikini: ఎన్టీఆర్ 'డ్రాగన్' హీరోయిన్ రుక్మిణీ వసంత్ డీప్ ఫేక్ వైరల్ బికినీ వీడియో మీద రియాక్ట్ అయ్యారు. ఆ వీడియోలు జనరేట్ చేసిన వాళ్లపై లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు.

రుక్మిణీ వసంత్ బికినీ వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. ఎక్స (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా సైట్లలో ఆమె బికినీ లుక్ వైరల్ అవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ఆ వీడియో అండ్ ఫోటోలు క్రియేట్ చేశారని రుక్మిణీ వసంత్ తెలిపారు. డీప్ఫేక్ బికీనీ ఫోటోలపై ఆమె తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అవి జనరేట్ చేసిన వాళ్లకు వార్నింగ్ కూడా ఇచ్చారు. రుక్మిణీ వసంత్ ఏమన్నారు? ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...
ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు...
లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాం!
Rukmini Vasanth Bikini Shoot Latest News: ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న బికినీ వీడియో గమనిస్తే... గ్రీన్ కలర్ బికినీతో స్విమ్మింగ్ పూల్లోకి దిగుతున్నట్లు ఉంది. కెమెరా మ్యాన్, లైటింగ్ గట్రా చూస్తే... ప్రొఫెషనల్ ఫోటో షూట్ అర్థం అవుతోంది. దాంతో చాలా మంది అది నిజమైన వీడియో అనుకున్నారు. అయితే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రుక్మిణీ వసంత్ ఓ పోస్ట్ చేశారు.
"ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతున్న ఇమేజెస్, వీడియో వ్యవహారం మా దృష్టికి నాతో పాటు మా టీం దృష్టికి వచ్చింది. నెట్టింట చలామణి అవుతున్నవి ఏఐ జనరేటెడ్ ఫోటోలు. అవి నిజం కాదు... పూర్తిగా అవాస్తవం. ఇటువంటి తప్పుడు కంటెంట్ను క్రియేట్ చేయడం, సర్క్యులేట్ చేయడం బాధ్యతారాహిత్యమైన పని. ఓ వ్యక్తి ప్రైవసీగా భంగం కలిగించడమే'' అని రుక్మిణీ వసంత్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు నటి, యాంకర్ అనసూయ సైతం ఏఐ జనరేటెడ్ ఫోటోలపై సైబర్ కంప్లైంట్ చేశారు. ఇటువంటివి అడ్డుకోవాలని ఆవిడ కోరారు.

డీప్ ఫేక్ వీడియో, ఫోటోలు క్రియేట్ చేయడాన్ని తాను సీరియస్గా తీసుకున్నానని రుక్మిణీ వసంత్ స్పష్టం చేశారు. ఇంకా ''ఫేక్ ఫోటోలు సృష్టించిన వారిపై, అదే విధంగా వాటిని వైరల్ / సర్క్యులేట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ చేశాం'' అని ఫేక్ రాయుళ్ళకు రుక్మిణీ వసంత్ వార్నింగ్ ఇచ్చారు. ప్రేక్షకులు ఆ కంటెంట్ను షేర్ చేయవద్దని ఆమె రిక్వెస్ట్ చేశారు.
Rukmini Vasanth Upcoming Movies: ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాలో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తున్నారు. ఆ సినిమా కంటే యశ్ 'టాక్సిక్'తో థియేటర్లలోకి రానున్నారు. కన్నడ సినిమా 'బీర్బల్ ట్రయాలజీ'తో కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమెకు... 'సప్త సాగరాలు దాటి' మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత రిషబ్ శెట్టి 'కాంతార: చాప్టర్ 1' పాన్ ఇండియా సక్సెస్ అందించింది.
Also Read: iBomma : iBOMMA, Bappamలో కొత్త మూవీస్ - పోలీసుల వార్నింగ్
Before You Go
Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు






















