Rajinikanth : విజయ్ జన నాయగన్ రిలీజ్ ఆలస్యంపై క్వశ్చన్ - తలైవా ఏం చెప్పారంటే?
Rajnikanth Reaction : విజయ్ జన నాయగన్ మూవీ రిలీజ్ ఆలస్యం కావడంపై తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ రియాక్ట్ అయ్యారు. జైలర్ 2 మూవీ షూటింగ్పై అప్డేట్ ఇచ్చారు.

Rajinikanth Reaction About Jailer 2 Shooting Update : తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. జైలర్ 2తో పాటు, కమల్ హాసన్తో మూవీ KHxRK మూవీస్ ట్రాక్లో ఉన్నాయి. తాజాగా ఆయన 'జైలర్ 2' షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని బుధవారం చెన్నై రీచ్ అయ్యారు. ఎయిర్ పోర్టు వద్ద మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
జన నాయగన్ ఆలస్యంపై...
ఇళయ దళపతి విజయ్ జన నాయగన్ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఇప్పటికీ సెన్సార్ సర్టిఫికెట్పై ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా ఈ మూవీ రిలీజ్ ఆలస్యంపై మీ స్పందనేంటి? అని అడగ్గా... 'సారీ... నో కామెంట్స్' అంటూ సమాధానం దాటవేశారు.
'జైలర్ 2 షూటింగ్ మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. సినిమా రిలీజ్ డేట్ను నిర్మాణ సంస్థ త్వరలోనే వెల్లడిస్తుంది. ఆగస్ట్ నుంచి కమల్ హాసన్తో మూవీ KHxRK షూటింగ్ ప్రారంభిస్తాం. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తైంది.' అని చెప్పారు.
విజయ్ జన నాయగన్ రిలీజ్పై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. రీసెంట్గా సెన్సార్ రివ్యూ చేస్తారంటూ ప్రచారం జరిగినా దానిపై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ క్రమంలో జులైలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక జైలర్ 2 విషయానికొస్తే... నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 2023లో రిలీజైన జైలర్ బ్లాక్ బస్టర్ వద్ద సంచలన విజయం సాధించింది. మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, సునీల్, మిర్నా మేనన్, వినాయకన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించారు. ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కుటుంబం విగ్రహాల చోరీ ముఠా వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? తన కుటుంబాన్ని అంతం చేయాలని చూసిన ముఠాను పోలీస్ ఆఫీసర్ ఎలా మట్టుబెట్టాడు? అనేది ఫస్ట్ పార్టులో చూపించగా... మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో సీక్వెల్ తెరకెక్కుతోంది. జూన్ 12న జైలర్ 2 రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
46 ఏళ్ల తర్వాత...
మరోవైపు, జైలర్ 2 తర్వాత కమల్, రజనీ కాంత్ మూవీ ట్రాక్ ఎక్కనుంది. ఇప్పటికే అనౌన్స్మెంట్ వీడియో కూడా వచ్చేసింది. ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా... 46 ఏళ్ల తర్వాత ఇద్దరు మల్టీ స్టారర్స్ సిల్వర్ స్క్రీన్పై సందడి చేయబోతున్నారు. ఫస్ట్ వీడియోతోనే బిగ్ హైప్ క్రియేట్ కాగా... ఫ్యాన్స్కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ కాగా... ఆగస్ట్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. త్వరలోనే మిగిలిన అప్డేట్స్ రానున్నాయి.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















