Pooja Hegde: బ్యాడ్ టైమ్లో పూజా హెగ్డేకు గుడ్ న్యూస్, బుట్ట బొమ్మకు అరుదైన ఆహ్వానం
బుట్ట బొమ్మ పూజా హెగ్డేకు అరుదైన అవకాశం లభించింది. ప్రపంచంలోని టాప్ స్టార్లు అందరితో కలిసి ఒకే వేదికను పంచుకోనుంది.
‘రాధేశ్యామ్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’.. ఇలా వరుస ఫ్లాప్లతో హ్యాట్రిక్ కొట్టిన పూజా హెగ్డేతో ప్రస్తుతం అవకాశాలు దోబూచులాడుతున్నాయి. త్వరలో విడుదల కానున్న ‘F3’ సినిమాలో పూజా స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమెకు తెలుగు త్రివిక్రమ్ సినిమా ఒక్కటే ఉంది. హిందీలో సల్మాన్ ఖాన్తో ‘కబీ ఈద్ కబీ దీవాళీ’, రణ్వీర్తో ‘సర్కస్’ చిత్రంలో నటిస్తోంది. ఇవి కూడా ఫ్లాప్ అయితే, పూజా దుకాణం సర్దేయాల్సిందేనని ఇండస్ట్రీలో టాక్. ఆ విషయాన్ని పక్కన పెడితే.. ఫ్లాప్ల బాధలో ఉన్న పూజా హెగ్డేకు ఊహించని గుడ్ న్యూస్ వచ్చింది. తొలిసారిగా ఆమెకు 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఆహ్వానం వచ్చింది. దీంతో ఇక అమ్మడి ఆనందానికి అవధుల్లేవు.
మే 17వ తేదీ నుంచి 28వ తేదీ నుంచి జరిగే ఈ వేడుకల్లో ఇండియా నుంచి ఇప్పటికే ఐశ్వర్యరాయ్ బచ్చన్, కంగన రనౌత్, సోనమ్ కపూర్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా తదితర సీనియర్ తారలు అక్కడికి చేరుకున్నారు. అయితే, పూజాకు కాస్త ఆలస్యంగానే ఈ ఆహ్వానం అందింది. అయితే, ఈ అరుదైన అవకాశం వస్తుందని ఆమె అస్సలు ఊహించలేదు. 17, 18 తేదీల్లో పూజా కేన్స్లో ప్రత్యక్షమవుతుంది. ఈ సందర్భంగా ఆమె 16వ తేదీన ఇండియా నుంచి పారీస్కు బయల్దేరనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ప్రపంచంలోని టాప్ స్టార్లతో కలిసి పూజా విందును ఆరగిస్తుంది.
Also Read: ఏపీ సీఎం వైఎస్ జగన్తో ఫోనులో మాట్లాడిన మహేష్
2021లో ‘అలా వైకుంఠపురం’ సినిమా పూజాకు మాంచి హైప్ ఇచ్చింది. ఆ తర్వాత ఆమెను అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ ఏడాది విడుదలైన ఏ సినిమా కూడా ఆమెకు కలిసిరాలేదు. మరి, త్వరలో విడుదలకానున్న సినిమాలైనా పూజాకు మళ్లీ లక్ తెచ్చిపెడతాయో లేదో చూడాలి. పూజా కేన్స్కు వెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.
Always an honour to represent India ❤️ #onwardsandupwards #Cannes2022 pic.twitter.com/BIxCRrd2mh
— Pooja Hegde (@hegdepooja) May 11, 2022
Also Read: 'మనీ హీస్ట్'లో మహేష్ బాబు ఏ రోల్ చేస్తారంటే?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets