అన్వేషించండి

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ

Sandhya Theatre Stampede Case | డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. సినిమా ప్రమోషన్ కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని స్పష్టం చేశారు.

Telangana DGP Jitender on Allu Arjun Case | కరీంనగర్: సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ హాస్పిటల్‌లో చికిత్స పొండుతున్నాడు. అల్లు అర్జున్ సినిమా హీరో అయి ఉండొచ్చు, కానీ ఓ పౌరుడిగా బాధ్యతాయుతంగా ఉండాలని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు. అల్లు అర్జున్‌కి మేం వ్యతిరేకం కాదు. కానీ ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే చట్టప్రకారం యాక్షన్ తీసుకుంటాం. థియేటర్ వద్ద ఆ రోజు జరిగిన సంఘటన దురదృష్టకరం అన్నారు.

నటీనటులు పరిస్థితులు అర్థం చేసుకోవాలి

కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని డీజీపీ జితేందర్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ఎవరికీ వ్యతిరేకం కాదు. పౌరుల రక్షణ, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. అల్లు అర్జున్ సినిమా హీరో కావొచ్చు. బయట మాత్రం ఆయన ఓ సాధారణ పౌరుడు. ప్రతి పౌరుడు తమ వంతుగా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ఎంతైనా అవసరం. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అర్థం చేసుకుని మసలుకోవాలి. సినిమా ప్రమోషన్లు, ఈవెంట్ల కంటే మాకు ప్రజల భద్రతే ముఖ్యం. ప్రజల ప్రాణాల కంటే సినిమా ఈవెంట్లు ముఖ్యమైన విషయం కాదు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరిపై అయినా చర్యలు తప్పవు. అల్లు అర్జున్‌కు తాము వ్యతిరేకం కాదని’ స్పష్టం చేశారు.

సినిమా నటులైనప్పటికీ బయట వీరు సాధారణ పౌరుల్లా వ్యవహరించాలి. సినీ నటుడు మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన విషయం కుటుంబ సమస్య కానీ, జర్నలిస్టుపై దాడితో మోహన్ బాబుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. పరిమితులకు లోబడి, పరిస్థితిని అర్థం చేసుకుని వ్యవహరిస్తే ఎవరికీ ఏ సమస్యా ఉండదు. లేనిపక్షంలో కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  - తెలంగాణ డీజీపీ  

మధ్యంతర బెయిల్ రావడంతో అల్లు అర్జున్ విడుదల

సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. కొన్ని రోజుల కిందటితో పోల్చితే బాలుడి పరిస్థితి కొంచెం మెరుగైందని హాస్పిటల్ శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. చిక్కడపల్లి పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి అల్లు అర్జున్ సహా కొందరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెండు వారాల రిమాండ్ విధించగా చంచల్ గూడ జైలుకు తరలించారు. హైకోర్టుకు వెళ్లడంతో నటుడికి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు.

ప్రైవేట్ బాడీ గార్డ్స్, బౌన్సర్లు హద్దుల్లో ఉండాలి..

బౌన్సర్లు, ప్రైవేట్ బాడీ గార్డ్స్ పేరుతో చట్టానికి వ్యతిరేకంగా ఎవరిపైనైనా దాడులు, బెదిరింపులు చేస్తే క్రిమినల్ కేసులతో జైలు ఊచలు లెక్కించాల్సి వస్తుందని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. బౌన్సర్లకైనా,ప్రైవేట్ బాడీ గార్డ్స్ కైనా పరిమితులు ఉంటాయని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు వెంటాడుతాయని స్పష్టం చేశారు.

Also Read: Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget