![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Naga Vamsi MAD Movie : 'జాతి రత్నాలు' కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వాపస్ - నిర్మాత ఆఫర్
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న 'మ్యాడ్' సినిమా ప్రెస్ మీట్ లో నిర్మాత నాగ వంశీ ఈ సినిమా చూసి జాతి రత్నాలు కంటే తక్కువ నవ్వానని ఎవరైనా చెప్తే టికెట్ డబ్బులు వాపస్ ఇచ్చేస్తానని ప్రామిస్ చేశారు.
![Naga Vamsi MAD Movie : 'జాతి రత్నాలు' కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వాపస్ - నిర్మాత ఆఫర్ MAD movie Producer Naga Vamsi exudes strong confidence in film compering with Jathi Ratnalu Naga Vamsi MAD Movie : 'జాతి రత్నాలు' కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వాపస్ - నిర్మాత ఆఫర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/27/64e3ea75098b99eba0e960bd89f695e31695795619141753_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ తాజాగా నిర్మించిన యూత్ ఫుల్ క్రేజీ ఎంటర్టైనర్ 'మ్యాడ్'(MAD) అక్టోబర్ 6న విడుదల కాబోతున్న తెలిసిందే. రామ్ నితిన్, సంగీత శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీ, ప్రియా రెడ్డి, ఆనంతిక సునీల్ కుమార్, గోపిక ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాతో కళ్యాణ్ శంకర్ వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా, చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సెప్టెంబర్ 26న 'నువ్వు నవ్వుకుంటూ' అంటూ సాగే మెలోడీ సాంగ్ విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో ఈ పాటకు సంగీతం అందించగా, కపిల్ కపిలన్ ఆలపించారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ లో నిర్మాత సూర్యదేవర నాగ వంశీ సినిమా పట్ల ఎంతో కాన్ఫిడెన్స్ గా ఉన్నట్లు అందరి ముందే ఓ ప్రామిస్ చేశారు.
ఈ ప్రెస్ మీట్ లో మూవీ టీంతో పాటు జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో అనుదీప్ మాట్లాడుతూ.." డైరెక్టర్ కళ్యాణ్ నాకు పదేళ్లుగా ఫ్రెండ్. కళ్యాణ్ లో చాలా ఎనర్జీ ఉంటుంది, హ్యూమర్ ఉంటుంది. ఎప్పుడూ మంచి, మంచి కథలు రాస్తుంటాడు. ఈ సినిమా చాలా ఎనర్జీ తో చాలా హ్యూమర్ తో ఉంటుంది. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నాగోవంశీ గారు మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. మీరందరూ అక్టోబర్ 6 థియేటర్లో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నట్లు" పేర్కొన్నారు. అయితే అనుదీప్ మాట్లాడిన సమయంలో నిర్మాత నాగ వంశీ కాసేపు యాంకర్ అవతారం ఎత్తారు." మీరు సినిమా చూశారు కదా, 'మ్యాడ్', 'జాతి రత్నాలు' ఈ రెండు సినిమాల్లో ఏది ఎక్కువ బావుంది" అని నాగ వంశీ అడగగా.." 'మ్యాడ్' సినిమానే ఎక్కువ బాగుంది. నాకు బాగా నచ్చిందని" అనుదీప్ సమాధానం ఇచ్చాడు.
Ace Producer #Nagavamsi says that "Viewers can claim refund if they don’t laugh for #MAD movie like they did for #Jathiratnalu"!!
— UniQ Inf0 (@UniQ_Inf0) September 26, 2023
Let us see how it happens ⏳.. pic.twitter.com/4U1zA0vNnq
ఆ తర్వాత నాగ వంశీ మాట్లాడుతూ.." మ్యాడ్ సినిమా చూసి జాతి రత్నాలు కంటే ఒక్కసారి అయినా తక్కువ నవ్వానని ఎవరైనా చెప్తే వాళ్ల టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం. అలా ఎవరు ట్విట్టర్లో నాకు రుజువు చేసిన యాంకర్ సుమ సాక్షిగా డబ్బులు తిరిగి ఇచ్చేస్తా. సినిమా పట్ల మాకు అంత నమ్మకం ఉంది. ఇది యూత్ ఫుల్ సినిమా అయినప్పటికీ కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్ ని గుర్తు చేయడానికి తీసిన సినిమా ఇది. లాజిక్స్, ట్విస్టులు ఏమి ఉండవు. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉంటారు. ఫ్యామిలీతో కలిసి అందరూ హ్యాపీగా చూసే సినిమా ఇది" అని అన్నారు.
Also Read : హీరో నానికి ఆ లెజెండరీ క్రికెటర్ ఫ్యాన్ - ఆయన ఎవరో తెలుసా?
నాగవంశీ ప్రామిస్ ఎంత మేరకు పనిచేస్తుందో సినిమా రిలీజ్ రోజు చూడాలి. రీసెంట్ టైమ్స్ లో యూత్ కు విపరీతంగా నచ్చే సినిమాలు పెద్దగా రాలేదు. 'మేం ఫేమస్', 'బాయ్స్ హాస్టల్' లాంటివి రిలీజ్ కి ముందు బాగా హడావిడి చేసినా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయాయి. మరి యూత్ ఫుల్ క్రేజీ ఎంటర్టైన్ గా వస్తున్న 'మ్యాడ్' ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
Also Read : ఇండియన్ భార్యాభర్తల మధ్యలో అమెరికన్ అమ్మాయి - నెలలో ఏమైంది మధు?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)