అన్వేషించండి

Nara Lokesh: 'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్

Visakha News: గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం విధ్వంసం సృష్టించిందని.. ఉన్న కంపెనీలను వెళ్లగొట్టిందని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు తీసుకొస్తామని చెప్పారు.

Minister Lokesh Comments In Visakha: ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర కోసం జగన్ చేసిందేమీ లేదని.. కనీసం రైల్వే జోన్‌కు భూమి కూడా ఇవ్వలేదని, ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేదని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ధ్వజమెత్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖ కలెక్టరేట్‌లో సమీక్ష అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. '2014 నుంచి ఎన్డీయే ప్రభుత్వ నినాదం ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని - అభివృద్ధి వికేంద్రీకరణ. ఇందులో భాగంగా దాదాపు 5 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇప్పటికే పూర్తైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. రైల్వే జోన్ అందరి కల. జోనల్ హెడ్ క్వార్టర్ విశాఖలో ఉండాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేసేందుకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇవే కాకుండా రైల్వేకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.' అని పేర్కొన్నారు.

'ఐటీ కేంద్రంగా విశాఖ..'

విశాఖను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతామని.. ప్రస్తుత పెట్టుబడుల ద్వారా దాదాపు లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని లోకేశ్ తెలిపారు. 'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. వైసీపీ ఫేక్ పార్టీ. ఉత్తరాంధ్రకు వైసీపీ ఐదేళ్లలో ఏం చేసింది?. ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేదు. ఉన్న కంపెనీలు వెళ్లిపోయాయి. టీసీఎస్ మేం తీసుకువచ్చాం. రుషికొండ తప్ప వైసీపీ హయాంలో ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదు. మేం డేటాసెంటర్ తీసుకువస్తే మహారాష్ట్రకు తరిమేశారు. లులూ తరిమేశారు. హెచ్ఎస్‌బీసీ మూతపడింది. హుద్ హుద్, తిత్లీ తుఫాను, విజయవాడ వరదల సమయంలో సాయం ప్రకటించిన జగన్ రెడ్డి.. ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలి. రాష్ట్ర సమగ్రాభివృద్ధి మా నినాదం.' అని అన్నారు. 

తాము అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో రూ.1000 పెన్షన్ పెంచామని లోకేశ్ అన్నారు. 'దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వడం లేదు. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. దీపం పథకం అమలు చేస్తున్నాం. తల్లికి వందనం డేట్స్ ఇచ్చాం. రైతులకు ఇవ్వాల్సింది కూడా తేదీలు ప్రకటించాం. మత్స్యకారులకు ఇస్తున్నాం. గత ప్రభుత్వ బకాయిలన్నీ మేం చెల్లిస్తున్నాం. ఎన్టీఆర్ వైద్యసేవకు రూ.1800 కోట్లు బకాయిలు పెడితే మేం చెల్లిస్తున్నాం. మేం పారిపోవడం లేదు. ప్రతి నెల రూ.4వేల కోట్ల డెఫిసిట్‌తో బడ్జెట్ నడుస్తోంది. జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. వైసీపీ విధ్వంసం వల్లే ఇదంతా. పారిశ్రామిక వేత్తలను వైసీపీ ఇబ్బందులు పెట్టడంతో వారు పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నారు.' అని చెప్పారు.

'గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి'

గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. 'అరకు కాఫీని రూ.300 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల బ్రాండ్‌కు తీసుకువెళ్తాం. గంజాయి నియంత్రణకు ప్రత్యేకంగా ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. అదనంగా నిధులు కూడా కేటాయిస్తున్నాం. ప్లాంటేషన్‌ను కట్టడి చేస్తాం. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో డ్రగ్స్ వద్దు బ్రో నినాదంతో ముందుకు వెళ్తున్నాం. బీసీల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎస్, డీజీపీ, టీటీడీ ఈవో బీసీ సామాజికవర్గాలకు అవకాశం కల్పించాం. మంత్రులందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. లోపాలు ఏవైనా ఉంటే ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నాం. వైసీపీది దుష్ప్రచారం మాత్రమే. మేం పరదాలు కట్టుకుని తిరగడం లేదు. జగన్ సెక్యూరిటీతో పోల్చుకుంటే చంద్రబాబు గారిది 30 శాతమే.' అని పేర్కొన్నారు.

Also Read: Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Narendra Modi Tenure: ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
Bengal Assembly elections 2026: రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?
రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget