అన్వేషించండి

Rashmika Mandanna: సామాన్యులు అటల్ సేతుపై ప్రయాణిస్తున్నారా? రష్మికాకు కాంగ్రెస్ కౌంటర్ - ట్విస్ట్ ఏమిటంటే?

ముంబై అటల్ సేతు బ్రిడ్జిపై ప్రశంసలు కురిపించిన నటి రష్మిక మందన్నకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ముంబై వాసులు ఈ బ్రిడ్జిని ఎంత మంది ఉపయోగిస్తున్నారో తెలుసా? అంటూ ప్రశ్నించింది.

Congress counter to Rashmika Mandanna: పార్లమెంట్ ఎన్నికల వేళ ముంబై అటల్ సేతు బ్రిడ్జి గురించి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న షేర్ చేసిన వీడియో రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా ముంబై అటల్ సేతు మీద ప్రయాణించిన రష్మిక,  బ్రిడ్జి అద్భుతం అంటూ కామెంట్ చేసింది. భారత్ గత 10 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చెందినదని, దానికి ఉదాహరణ అటల్ సేతు వంతెన అని వెల్లడించింది. ఈ బ్రిడ్జి ద్వారా 2 గంటల ప్రయాణం ఏకంగా 20 నిమిషాలకు తగ్గిందన్నారు. భారత్ అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతుందని వెల్లడించిన ఆమె, అభివృద్ధికి ఓటు వేయాలంటూ పిలుపునిచ్చింది.ట

రష్మికకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్

అటల్ సేతుపై ప్రశంసలు కురిపించిన రష్మిక మందన్నకు కేరళ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఇప్పటి వరకు పెయిడ్ యాడ్స్, సర్రోగేట్ యాడ్స్ మాత్రమే చూశామని, ఇప్పుడు ఈడీ డైరెక్షన్ లో వచ్చిన యాడ్ ను చూస్తున్నామంటూ ఎద్దేవా చేసింది. “మీరు షేర్ చేసిన వీడియోలో అటల్ సేతు ఖాళీగా ఉన్నట్లు గమనించాం. కేరళ నుంచి వచ్చాం కాబట్టి, ముంబైలో ట్రాఫిక్ తక్కువగా ఉందని భావించాం. ఇదే విషయాన్ని ముంబై కాంగ్రెస్ మిత్రులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. అటల్ సేతుతో పోల్చితే రాజీవ్ గాంధీ బాంద్రా-వర్లీ సీ లింక్‌ ను వాహనదారులు ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. కావాలంటే ఈ వీడియో చూడండి. వీడియో ఒక్కటే కాదు, కొంత డేటా కూడా పరిశీలించాం. రూ.1,634 కోట్ల వ్యయంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన 5.6 కి.మీ బాంద్రా-వర్లీ సీ లింక్‌ను 2009లో ప్రారంభించారు. ఎలాంటి షో ఆఫ్ లేకుండా ప్రారంభం అయిన ఈ సీ లింక్ ద్వారా ఎక్కువగా ప్రయాణించేందుకు వాహనదారులు ఆసక్తి చూపిస్తున్నారు. బాంద్రా-వర్లీ సీ లింక్ ను ఉపయోగించేందుకు ప్రతి కారుకు కేవలం రూ.85 వసూలు చేస్తున్నారు.

అటల్ సేతును రూ.17,840 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఒక్క ట్రిప్‌కు ఒక్కో కారుకు రూ. 250 టోల్ వసూళు చేస్తున్నారు. ఈ రేటు సామాన్య వాహనదారుడు భరించే పరిస్థితిలో లేదు. జనవరి 12న ఈ బ్రిడ్జి ప్రారంభం కాగా, ఏప్రిల్ 23 వరకు రూ.22.57 కోట్లు టోల్ వసూళు అయ్యింది. అంటే నెలకు రూ. 6.6 కోట్లు వసూళు అవుతుంది. ఈ రేటు ప్రకారం రూ. 17,840 కోట్ల పెట్టుబడిని తిరిగి పొందేందుకు 225 సంవత్సరాలు పడుతుంది. వడ్డీకి లెక్క లేదు. వాస్తవానికి అటల్ సేతు నుంచి నెలకు రూ. 30 కోట్లు వస్తుందని భావించారు. కానీ, ఇప్పుడు అంత రావడం లేదు. ముంబై వాసులు ఈ బ్రిడ్జిని ఎందుకు ఉపయోగించట్లేదో ఓ వీడియో చేస్తే బాగుంటుంది” అంటూ రాసుకొచ్చింది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. రష్మిక పోస్ట్‌పై మహారాష్ట్ర కాంగ్రెస్‌కు బదులుగా కేరళ కాంగ్రెస్ పార్టీ స్పందించడం. దీంతో ముంబయిలో లేని మీరు.. అక్కడి వంతెనపై కామెంట్స్ చెయ్యడం హాస్యస్పందమని నెటిజన్స్ కౌంటర్లు వేస్తున్నారు.

దేశంలో సముద్రంపై నిర్మించిన అతి పెద్ద బ్రిడ్జి  

అటల్ సేతు బ్రిడ్జిని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌ - ఎంటీహెచ్ఎల్‌ కలుపుతూ నిర్మించారు. 6 లేన్లుగా 21.8 కిలోమీటర్ల పొడవు ఈ వంతెన ఉంది. ఈ బ్రిడ్జి 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రంపైనే ఉంది. అంతేకాదు, భారత్ లో సముద్రంపై నిర్మించిన అతి పొడవైన సముద్ర వంతెనగా ఈ అటల్ సేతు బ్రిడ్జి గుర్తింపు తెచ్చుకుంది. ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు.

Read Also: పెద్ద హీరోల వల్లే తెలుగు సినిమాకు ఈ దుస్థితి: ‘ఏబీపీ దేశం’ ఇంటర్వ్యూలో న‌ట్టికుమార్ షాకింగ్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
S Janaki Death - Health Bulletin: జానకి మృతిపై అపోలో హాస్పిటల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ - ఎన్ని గంటలకు మరణించారు? రీజన్ ఏంటి?
జానకి మృతిపై అపోలో హాస్పిటల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ - ఎన్ని గంటలకు మరణించారు? రీజన్ ఏంటి?
S Janaki Death - Celebs Reaction: జానకమ్మ మృతిపై చిరంజీవి, బాలకృష్ణ సంతాపం... సెలబ్రిటీల రియాక్షన్
జానకమ్మ మృతిపై చిరంజీవి, బాలకృష్ణ సంతాపం... సెలబ్రిటీల రియాక్షన్
Singer Janaki Passed Away: దక్షిణాది గానకోకిల ఇకలేరు... సింగర్ ఎస్ జానకి కన్నుమూత
దక్షిణాది గానకోకిల ఇకలేరు... సింగర్ ఎస్ జానకి కన్నుమూత

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget