అన్వేషించండి

Rishab Shetty: మానవ ముఖంలో 'హనుమాన్' - కన్నడ స్టార్ రిషబ్ శెట్టి, దర్శక నిర్మాతలపై ఫిర్యాదు, వివాదంలో 'జై హనుమాన్' పోస్టర్

Jai Hanuman: హనుమాన్ సీక్వెల్ 'జై హనుమాన్'లో హనుమంతుడి పోస్టర్‌పై వివాదం నెలకొంది. హనుమంతున్ని మానవుడిగా చూపిస్తూ మనోభావాలు దెబ్బతీశారని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైంది.

Complaint Against Rishab Shetty And Jai Hanuman Movie Director And Producers: తేజా సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'హనుమాన్' సినిమా గతేడాది సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. దీనికి సీక్వెల్‌గా 'జైహనుమాన్' (Jai Hanuman) రూపొందుతుండగా.. ఇది 'హనుమాన్'కు మించి ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపాడు. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని ఐమ్యాక్స్ త్రీడీ ఫార్మాట్‌లో తీసుకురానుండగా.. 'హనుమాన్'లో హనుమంతుగా కనిపించిన తేజ కొత్త సినిమాలోనూ అదే పాత్ర పోషించనున్నారు. ఇక, ఆంజనేయ స్వామి పాత్రను కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) పోషించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. రాముడి విగ్రహాన్ని పట్టుకుని కూర్చున్నట్లుగా రిషబ్ శెట్టి ఫోటో ఉండగా ఇది సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.

కొత్త వివాదం

ఈ పోస్టర్‌పైనే కొత్తగా వివాదం నెలకొంది. హనుమంతుడి పాత్రను ఇంతకుముందు భారతీయ సినిమాలో నిర్మించిన అన్ని పౌరాణిక చిత్రాల కంటే భిన్నంగా చూపించారని కొందరు విమర్శిస్తున్నారు. 'జై హనుమాన్' సినిమాలో హనుమంతుడి రూపురేఖలే మారిపోయాయని.. ఆయన ముఖాన్ని సామాన్యుడి ముఖంగా చూపించారని పేర్కొంటున్నారు. హనుమంతుడిని కోతి రూపంలో చూపించలేదని.. ముఖం మార్చడం ద్వారా పాత్రను మార్చారని హైకోర్టు న్యాయవాది తిరుమలరావు అనే న్యాయవాది నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. పాత్రధారి రిషబ్ శెట్టి, చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా హనుమంతుడి ఫోటో ఉందని.. పోస్టర్, టీజర్‌లు ఉపసంహరించుకునేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. 'హనుమంతున్ని ఇలా చూపించడాన్ని అంగీకరిస్తే ఇతర చిత్ర నిర్మాతలు దేవుళ్లను చిత్రీకరించడంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తారు.' అని పేర్కొన్నారు.

కాగా, పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసుపై మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవలే పాక్షికంగా ఉపశమనం పొందింది. ఈ కేసులో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు బెయిల్ ఇవ్వగా.. ఈ వ్యవహారంలో నిర్మాతలను అరెస్ట్ చేయవద్దని పోలీసులకు ఆదేశాలు అందాయి. తాజాగా, ఇప్పుడు 'జై హనుమాన్' పోస్టర్‌పైనా ఫిర్యాదు అందడం సంచలనంగా మారింది. మరి ఈ వివాదంపై చిత్ర నిర్మాణ సంస్థ, దర్శక, నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

మరోవైపు, 'జై హనుమాన్' సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. హనుమాన్, జై హనుమాన్ రెండు చిత్రాలు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్'లో భాగమే. కాగా, హనుమాన్ సినిమా తనకు విజయాన్ని మాత్రమే కాకుండా నమ్మకాన్ని సైతం ఇచ్చిందని ప్రశాంత్ వర్మ అన్నారు. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటన్నదే 'జై హనుమాన్' సీక్వెల్‌లో కీలక అంశంగా తెలుస్తోంది.

Also Read: Preminchoddu OTT: రెండు ఓటీటీల్లో ‘బేబి’ దర్శకుడిపై క్రిమినల్ కేసు పెట్టిన దర్శకనిర్మాత సినిమా... డోంట్ మిస్ ఇట్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News: సంక్రాంతి వేళ రాజకీయ గోల- భోగి మంటల్లో జీవోలు దహనం చేసిన వైసీపీ- జగన్ బొమ్మ పాస్ బుక్స్‌ తగలబెట్టిన టీడీపీ 
సంక్రాంతి వేళ రాజకీయ గోల- భోగి మంటల్లో జీవోలు దహనం చేసిన వైసీపీ- జగన్ బొమ్మ పాస్ బుక్స్‌ తగలబెట్టిన టీడీపీ 
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్‌ సెస్‌
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్‌ సెస్‌
Hyderabad Crime News: భర్త కోసం దొంగగా మారిన సాఫ్ట్‌వేర్ భార్య! రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
భర్త కోసం దొంగగా మారిన సాఫ్ట్‌వేర్ భార్య! రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
Anaganaga Oka Raju OTT : ఆ ఓటీటీలోకి 'అనగనగా ఒక రాజు' - నవీన్ పోలిశెట్టి కామెడీ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి రావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి 'అనగనగా ఒక రాజు' - నవీన్ పోలిశెట్టి కామెడీ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి రావొచ్చంటే?

వీడియోలు

Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP
Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News: సంక్రాంతి వేళ రాజకీయ గోల- భోగి మంటల్లో జీవోలు దహనం చేసిన వైసీపీ- జగన్ బొమ్మ పాస్ బుక్స్‌ తగలబెట్టిన టీడీపీ 
సంక్రాంతి వేళ రాజకీయ గోల- భోగి మంటల్లో జీవోలు దహనం చేసిన వైసీపీ- జగన్ బొమ్మ పాస్ బుక్స్‌ తగలబెట్టిన టీడీపీ 
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్‌ సెస్‌
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్‌ సెస్‌
Hyderabad Crime News: భర్త కోసం దొంగగా మారిన సాఫ్ట్‌వేర్ భార్య! రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
భర్త కోసం దొంగగా మారిన సాఫ్ట్‌వేర్ భార్య! రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
Anaganaga Oka Raju OTT : ఆ ఓటీటీలోకి 'అనగనగా ఒక రాజు' - నవీన్ పోలిశెట్టి కామెడీ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి రావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి 'అనగనగా ఒక రాజు' - నవీన్ పోలిశెట్టి కామెడీ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి రావొచ్చంటే?
PM Kisan 22nd Installment : పీఎం కిసాన్ యోజన 22వ విడత ఫిబ్రవరిలో! జాబితాలో మీ పేరు ఉందో లేదే ఇలా చెక్ చేయండి!
పీఎం కిసాన్ యోజన 22వ విడత ఫిబ్రవరిలో! జాబితాలో మీ పేరు ఉందో లేదే ఇలా చెక్ చేయండి!
Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
Anaganaga Oka Raju Twitter Review - 'అనగనగా ఒక రాజు' ట్విట్టర్ రివ్యూ: నవీన్ పోలిశెట్టి అదరగొట్టాడా? లేదా? అమెరికా ప్రీమియర్స్‌, సోషల్ మీడియా టాకేంటి?
'అనగనగా ఒక రాజు' ట్విట్టర్ రివ్యూ: నవీన్ పోలిశెట్టి అదరగొట్టాడా? లేదా? అమెరికా ప్రీమియర్స్‌, సోషల్ మీడియా టాకేంటి?
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Embed widget