Shanmukh Jaswanth: శోభన్ బాబు, నాగార్జున రూటులో షణ్ముఖ్ - రీసెంట్గా ఏం చేశాడో తెలుసా?
శోభన్ బాబు రూటులో ఫేమస్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ వెళుతున్నాడా? ఆయన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చూస్తే అలాగే ఉన్నాయి.

ఒకప్పటి కథానాయకుడు శోభన్ బాబు, సీనియర్ హీరో - నటుడు మురళీమోహన్, కింగ్ నాగార్జునలో ఒక కామన్ థింగ్ ఉంది. అదేంటో తెలుసా? ఈ ముగ్గురూ భూమిని నమ్మారు. హైదరాబాద్ నగర శివార్లలో మురళీమోహన్ చాలా భూములు కొన్నారు. ఆయనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. నాగార్జున కూడా భూములు కొనడం, అమ్మడం వంటివి చేస్తుంటారని ఇండస్ట్రీలో జనాలు చెబుతుంటారు.
హీరోల్లో భూమి మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టిన మొదటి హీరో శోభన్ అని అంటారు. ఇప్పుడు ఫేమస్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ వీళ్ళ రూటులో వెళ్తున్నాడా? అంటే... వెళ్తున్నాడని అనుకోవచ్చు.
మొన్నా మధ్య హైదరాబాద్ సిటీలో షణ్ముఖ్ జస్వంత్ ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు. గృహ ప్రవేశం కూడా చేశారు. అప్పట్లో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఆయన ల్యాండ్ కొన్నారు. హైదరాబాద్కు దగ్గరలోని షాద్ నగర్లో షణ్ముఖ్ కొంత భూమి కొన్నారు. రీసెంట్గా రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయ్యింది.
Also Read: 'ఆచార్య'లో కనిపించని కాజల్ అగర్వాల్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
ఈ సందర్భంగా అతడి తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చారు. వాళ్ళతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షణ్ముఖ్ పోస్ట్ చేశారు. అదీ సంగతి!
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
ట్రెండింగ్ వార్తలు





















