అన్వేషించండి

Bigg Boss 5 Telugu: టాస్క్ లో కొట్టుకున్న జెస్సీ, శ్రీరామ్.. దొంగ బుద్ధులెందుకు అంటూ విశ్వ ఫైర్.. 

టాస్క్ లో మానస్, విశ్వ ఒకరిపై మరొకరు పడుతూ ఫిజికల్ అయ్యారు. మరోపక్క శ్రీరామ్, జెస్సీలు కొట్టుకునే స్టేజ్ కి వెళ్లిపోయారు. ఈ క్రమంలో జెస్సీ, శ్రీరామ్ లకు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి.

ఈ వారం 'రాజ్యానికి ఒక్కడే రాజు' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో రవి, సన్నీలు రాకుమారులుగా మారి.. సింహాసనం గెలుచుకోవాలి. హౌస్ మేట్స్ అందరూ ప్రజలుగా ఉంటారు. ఏ రాకుమారుడికైతే ప్రజల మద్దతు దొరుకుతుందో వారే రాజుగా ఎంపికవుతారు. నిన్నటి నుంచి హౌస్ లో ఈ టాస్క్ జరుగుతోంది. ఈరోజు ఎపిసోడ్ లో కూడా టాస్క్ కంటిన్యూ అయింది. 'మట్టిలో మహాయుద్ధం..' అనే గేమ్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో రాకుమారులకు(రవి, సన్నీ) సంబంధించిన వ్యక్తులు మట్టిలో మల్లయుద్ధం చేయాల్సి ఉంటుంది. 

ఈ టాస్క్ లో రవి రాజ్యం నుంచి విశ్వ, యానీ మాస్టర్, శ్వేతాలు పార్టిసిపేట్ చేయగా.. సన్నీ టీమ్ నుంచి మానస్, జెస్సీ, పింకీ లు పోటీ చేస్తారని చెప్పారు. ముందుగా మానస్, విశ్వలు ఒకరితో ఒకరు పోటీకి దిగారు. ఇందులో విశ్వ గెలిచాడు. 

Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. ఘన చరిత్రకు గ్రహణం పట్టిస్తున్న విభేదాలు

ఆ తరువాత 'ఇక్కడ ఏం స్ట్రాటజీ అయిందనేది నాకు క్లారిటీ ఉంది..ఇద్దరు మగాళ్లను పంపించకుండా ఆడవాళ్లను పంపించారు. అది నేను ఒప్పుకోను.. రండి నేను ఫైట్ చేస్తా.. నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నా.. మళ్లీ వేరేవాళ్లను పంపమని అడగొద్దు' అంటూ రవి టీమ్ పై అరిచాడు సన్నీ. ఆ తరువాత మానస్ మాట్లాడుతూ.. 'ప్రతీసారి మా విషయంలో అన్ ఫెయిర్ డెసిషన్ ఉంటుంది.. ప్రతీసారి మేమే కాంప్రమైజ్ అవుతున్నాం..' అంటూ ఫైర్ అవుతుండగా.. యానీ మాస్టర్ కలుగజేసుకొని.. 'నో కాంప్రమైజ్.. రండి' అంటూ జెస్సీతో మట్టిలో మల్లయుద్ధానికి దిగింది. ఈ టాస్క్ లో జెస్సీ గెలిచాడు. 

'దమ్ముంటే ముంగటకి వచ్చి ఆడుకోవాలే..'   
హౌస్ మేట్స్ కొందరు కాయిన్స్ దొంగతనం చేయడంతో 'దమ్ముంటే ముంగటకి వచ్చి ఆడుకోవాలే.. నక్కల్లా ఆడడం కాదు.. ఆ దొంగ బుద్ధులెందుకు' అంటూ విశ్వ హౌస్ మేట్స్ పై ఫైర్ అయ్యాడు. ఈ విషయంలో మానస్ 'పేరు తీసి మాట్లాడు.. అందరినీ ఎందుకు అంటున్నావ్' అని గొడవకు దిగాడు. దీంతో ఇద్దరూ అరుచుకుంటూ మాట్లాడారు. ఆ తరువాత ప్రియాంక, శ్వేతా పోటీ పడగా.. శ్వేతా గెలిచింది. 
ప్రతీసారీ సంచాలక్(శ్రీరామ్) మాకు వ్యతిరేకంగా డెసిషన్ చెప్తున్నాడు అంటూ కాజల్ తో డిస్కషన్ పెట్టాడు మానస్. టాస్క్ లో తనతో మాట్లాడడం లేదంటూ శ్రీరామ్ పై కంప్లైంట్ చేసింది కాజల్. ఇక తెల్లవారుజామున 5:30కి శ్రీరామ్ ని హగ్ చేసుకుంది హమీద. ఆ తరువాత ఫ్లైయింగ్ కిసెస్ ఇస్తూ అతడికి గుడ్ నైట్ చెప్పింది. 

''నీ సీరియల్ యాక్టింగ్‌లు ఈడ చేయకు''
సిరి-కాజల్ కూర్చొని ఎవరివైపు ఉండాలనే విషయంపై చర్చలు జరిపారు. ఎక్కువ మంది రవిని సపోర్ట్ చేస్తుండడంతో .. 'నువ్వు నేను సన్నీ వైపు వెళ్తే అతడు గెలుస్తాడు' అంటూ కాజల్.. సిరికి చెప్పింది. సిరి సపోర్ట్ కోరడానికి వెళ్లిన రవి.. 'నీ సపోర్ట్ ఉంటే షణ్ముఖ్ ని కెప్టెన్సీ టాస్క్ కంటెండర్ గా చేస్తా.. ఇదే నా ప్రామిస్' అని చెబుతుండగా.. సిరి వెటకారంగా నవ్వింది. అది చూసిన రవి ''నీ సీరియల్ యాక్టింగ్‌లు ఈడ చేయకు' అని కామెంట్ చేశాడు. 

కొట్టుకున్న శ్రీరామ్, జెస్సీ.. 
ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి మరో టాస్క్ ఇచ్చారు. అదే 'రాజు గారి గోడ'. ఈ టాస్క్ లో రవి, సన్నీ పేర్లతో రెండు గోడలు ఉంటాయి. వాటిపై రవి, ఫోటోలను అతికించాలి. ఎండ్ బజర్ పూర్తయ్యేసమయానికి ఎవరి ఫోటోలు ఎక్కువ ఉంటాయో వారే విజేత. ఈ టాస్క్ లో మానస్, విశ్వ ఒకరిపై మరొకరు పడుతూ ఫిజికల్ అయ్యారు. మరోపక్క శ్రీరామ్, జెస్సీలు కొట్టుకునే స్టేజ్ కి వెళ్లిపోయారు. ఈ క్రమంలో జెస్సీ, శ్రీరామ్ లకు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ఈ టాస్క్ లో సన్నీ టీమ్ గెలిచింది. 

లాక్కోలాక్కో తాడు.. 
ఈ టాస్క్ లో రెండు టీమ్స్ పోటీ పడగా.. సన్నీ టీమ్ గెలిచింది. 

Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!

Also Read: ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
AP handloom weavers: ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
AP handloom weavers: ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Manisharma : హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
Embed widget