అన్వేషించండి

Acharya Update: సిద్ధాగా రామ్ చరణ్ తేజ్.. అప్‌డేట్ కోసం అభిమానులు వెయిటింగ్..

ఆచార్య సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. చిరంజీవితో కలిసి నటిస్తున్న రామ్ చరణ్ ఇందులో సిద్ధగా ఆకట్టుకోనున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆచార్య. . చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్దే ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2022, ఫిబ్రవరి 4వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఒక టీజర్.. పాటలు మాత్రమే విడుదలయ్యాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ‘లాహే లాహే’, ‘నీలాంభరి’ పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. ‘ఆచార్య’ చిత్రం యూనిట్‌ తాజాగా మరో అప్‌డేట్‌ను వదిలనుంది. ఇందులో రామ్ చరణ్ సిద్ధా పాత్రను పరిచయం చేయనున్నట్లు తెలిసింది. ఈ అప్‌డేట్‌ను బుధవారం ఉదయం 10.08 గంటలకే విడుదల చేస్తామని చెప్పారు. అయితే, అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతుందని ప్రకటించారు. దీంతో అభిమానులు అప్‌డేట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 

వాస్తవానికి ‘ఆచార్య’ మే నెలలో విడుదల కావాలి. కానీ కరోనా వైరస్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది. దీంతో చిత్రం రిలీజ్ డేట్‌పై రకరకాల వార్తలు షికారు చేశాయి. 2022 జనవరి ఏడో తేదీన సినిమా విడుదల అవుతుంది.. ప్రకటన రావడమే తరువాయి అనే రేంజ్‌లో లీకులు వచ్చాయి. ఇంతలో ఆ డేట్‌ను ఆర్ఆర్ఆర్ తీసేసుకుంది. దీంతో ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన వస్తుందని, పుష్ప వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పుష్ప, ఆచార్య పోటీ పడతాయని.. రెండూ ఒకేరోజు విడుదల అవుతాయని.. ఇలా రకరకాల పుకార్లు వినిపించాయి. ఇప్పుడు ఈ అధికారిక ప్రకటనతో పుకార్లన్నిటికీ తెర పడింది.

2018లో భరత్ అనే నేను విడుదల అయ్యాక.. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అయితే మెగాస్టార్ చిరంజీవి సైరా షూటింగ్‌లో బిజీ కావడం, ద్వితీయార్థంలో వచ్చే ముఖ్యమైన పాత్రకు ఏ హీరోను తీసుకోవాలో అనే విషయంలో తర్జనభర్జనల కారణంగా మరింత ఆలస్యం అయింది. ఈ పాత్ర నిడివి 15 నిమిషాలు మాత్రమేనని, మహేష్ బాబు ఈ పాత్ర చేస్తాడని వార్తలు వచ్చాయి. తర్వాత రామ్ చరణ్‌ను తీసుకున్నాక పాత్ర నిడివి కూడా పెరిగిందని, కొరటాల ఒక సందర్భంలో చెప్పారు. సెకండాఫ్ పూర్తిగా సిద్ధ పాత్ర ఉంటుందని తెలిపాడు.

కరోనావైరస్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండటంతో టాలీవుడ్ పెద్ద సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. తెలుగులో మొదట విడుదల కానున్న పెద్ద చిత్రం ‘పుష్ప’. ఇది డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. జనవరి 7వ తేదీన ‘ఆర్ఆర్ఆర్’, 14వ తేదీన ‘రాధేశ్యామ్’ విడుదల కానుంది. జనవరి 12వ తేదీన ‘భీమ్లా నాయక్’, 13వ తేదీన సర్కారు వారి పాట విడుదల కావాల్సి ఉండగా.. ‘ఆర్ఆర్ఆర్’ ఎంట్రీతో ఇవి రెండూ వేరే తేదీకి షిఫ్ట్ అవ్వనున్నాయని సమాచారం. 

 


మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

ABP C Voter Opinion Poll Andhra pradesh | లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో సత్తా చాటే పార్టీ ఏది? | ABPNirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Embed widget