అన్వేషించండి

Siddham Meeting: నేడు ఏలూరులో వైసీసీ సిద్ధం రెండో సభ.. 110 ఎకరాల్లో నిర్వహణ

Eluru Meeting: రానున్న ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తపరిచే ఉద్ధేశంతో వైసీపీ సిద్ధం పేరుతో బహిరంగ సభలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండో సభను ఏలూరు - దెందులూరు మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

Jagan Will Participate Eluru Siddham Meeting : రానున్న ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తపరిచే ఉద్ధేశంతో అధికార వైసీపీ(YSRCP) సిద్ధం(Siddham) పేరుతో బహిరంగ సభలను నిర్వహిస్తోంది. తొలి సభను విశాఖ(Vizag) జిల్లాలలోని సంగివలసలో నిర్వహించిన వైసీపీ.. కేడర్‌ భారీగా తరలిరావడంతో ఉత్సాహంగా ఉంది. ఈ ఉత్సాహాన్ని కొనసాగించే ఉద్ధేశంతో మరిన్ని సభలు నిర్వహణకు అధికార పార్టీ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే రెండో సభను ఏలూరు - దెందులూరు(Denduluru) మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

శనివారం సాయంత్రం ప్రారంభం కానున్న ఈ సభలో సీఎం జగన్మోహన్‌రెడ్డి (CM Jagan)పాల్గొని కేడర్‌కు దిశా, నిర్ధేశం చేయనున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏలూరు-దెందులూరు మద్య నిర్వహిస్తున్న ఈ సభకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లా పరిధిలోని 50 నియోజకవర్గాలు నుంచి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. 

110 ఎకరాల్లో సభా ప్రాంగణం

తొలి సభ విజయవంతం కావడంతో రెండో సభను అంతకుమించి నిర్వహించేలా వైసీపీ ఏర్పాట్లు చేసింది. ఏలూరు నగర శివారు ఆటోనగర్‌ సమీపంలో, దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు కనీసం మూడు లక్షల మంది హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సభా ప్రాంగణాన్ని 110 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఎనిమిది ప్రాంతాల్లో 150 ఎకరాల్లో సభకు వచ్చే వాహనాలు పార్కింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభలో పాల్గొనేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి మూడు గంటలకు రానున్నారు. సభ ఏర్పాట్లను అత్యంత వేగంగా పూర్తి చేశారు. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లను వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్‌ కో-ఆర్డినేటర్‌, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్యేలు కొఠారు అబ్బయ్య చౌదరి, మేకా వెంటక ప్రతాప్‌ అప్పారావు, పుప్పాల వాసుబాబు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌, జెడ్పీ చైర్మన్‌ ఘంటా పద్మ శ్రీ తదితరులు ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 

చేసిన అభివృద్ధి చెప్పుకునేలా

సభకు హాజరుకానున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కేడర్‌కు దిశా, నిర్ధేశం చేయనున్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని కేడర్‌కు సూచించనున్నారు. సుమారు మూడు లక్షల మంది సభకు హాజరవుతారని పార్టీ నాయకులలు అంచనా వేస్తున్నారు. ఐదు లక్షల మందిని సమీకరించేలా పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 50 నియోజకవర్గాలు పరిధిలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 20 వేల మందిని సభకు తీసుకువచ్చేలా ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకు పార్టీ నుంచి ఆదేశాలు ఉన్నాయి. కనీసం పది వేలు మందిని తరలించినా ఐదు లక్షల మంది అవుతారని ఆ పార్టీలు వర్గాలు చెబుతున్నాయి.

Also Read: కాకినాడ ఎంపిగా జనసేనాని- సంచలనం రేపుతున్న పవన్ కల్యాణ్‌ నిర్ణయం!

Also Read: వైసీపీ 6వ జాబితా విడుదల, ఇంఛార్జ్‌లుగా 10 మందికి అవకాశం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
Embed widget