అన్వేషించండి

Andhra Pradesh News: ఏపీలో నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు- పులివెందులలో సీఎం జగన్‌ నామినేషన్‌!

Pulivendulu News: ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గురువారం ఉదయం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఇవాళ్టితో నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తి కానుంది.

CM Jagan File His Nomination Today : ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గురువారం ఉదయం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. తన సొంత నియోకవర్గమైన పులివెందులలో ఆయన నామినేషన్‌ వేయనున్నారు. ఇందుకు ఆ పార్టీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. నామినేషన్‌కు ముందు సీఎం జగన్‌ పులివెందులలో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. అనంతరం పులివెందుల వైఎస్‌ఆర్‌ సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌లోని ఆర్‌వో కార్యాలయంలో జగన్‌ నామినేషన్‌ వేయనున్నారు. భారీ జన సందోహం మధ్య నామినేషన్‌ దాఖలు చేయడానికి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. 

నేటితో ముగియనున్న గడవు

రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ స్తానాలకు నామినేషన్ల ప్రక్రియ గడువు గురువారంతో ముగియనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలోని 25 పార్లమెంట్‌, 175 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటి వరకు వేలాది నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలకు 3,644 మంది అభ్యర్థులు, లోక్‌సభకు 654 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. చివరి రోజైన గురువారం మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది. బుధవారం ఒక్కరోజే అసెంబ్లీ స్థానాలకు 1294, లోక్‌సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. లోక్‌సభకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ముఖ్య నాయకులు ఉన్నారు. వీరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన తరపున వల్లభనేని బాలశైరి, ఉదయ్‌ శ్రీనివాస్‌, సీఎం రమేష్‌ తదితరులు ఉన్నారు. 

ఇవీ నామినేషన్ల దాఖలైన తీరు

25 పార్లమెంట్‌ సెగ్మెంట్లకు 555 మంది అభ్యర్థులు 653 సెట్ల నామినేషన్లను గడిచిన ఆరు రోజుల్లో దాఖలు చేశారు. తొలిరోజు 43 సెట్ల నామినేషన్లు దాఖలు కాగా, రెండోరోజు 68 సెట్లు, మూడో రోజు 40 సెట్లు, నాలుగో రోజు 112 సెట్ల, ఐదో రోజు 124 సెట్లు, ఆరో రోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. అసెంబ్లీ స్థానాలకు గడిచిన ఆరు రోజజుల్లో 3057 మంది అభ్యర్థులు 3701 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. తొలిరోజు 236 సెట్ల, రెండో రోజు 413, మూడో రోజు 263 సెట్లు, నాలుగో రోజు 610 సెట్లు, ఐదో రోజు 702 సెట్లు, ఆరో రోజు 1344 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఆఖరి రోజైన గురువారం మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget