అన్వేషించండి

Telangana Elections 2023: బీజేపీ, జనసేన పొత్తు టీడీపీ ఓట్ల కోసమేనా ? సీట్లు కేటాయించింది కూడా ఆ స్థానాల్లోనేనా!

Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ప్రచారం ఊపందుకుంది. పార్టీలు విరామం లేకుండా ప్రచారం చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి.

Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ప్రచారం ఊపందుకుంది. పార్టీలు విరామం లేకుండా ప్రచారం చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి గులాబీ పార్టీ పావులు కదుపుతుంటే... కారుకు బ్రేకులు వేయాలని హస్తం పార్టీ ఎత్తులు వేస్తోంది. తెలంగాణ విజయం సాధించి..దక్షిణాదిన కాషాయ జెండాను రెపరెపలాండించాలని బీజేపీ పైఎత్తులు వేస్తోంది. కమలం పార్టీ, జనసేన పొత్తుపై తెలంగాణలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జస్ట్ ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది. హిందూత్వవాది రాజాసింగ్ గోషామహల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో దుబ్బాకలో రఘునందన్ రావు, హుజురాబాద్ లో ఈటల రాజేందర్ విజయం సాధించారు. దీంతో బీజేపీ బలం మూడుకు చేరుకుంది.

జనసేనకు 9 సీట్లు కేటాయింపు
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కలిసి వస్తుందని భావించినా అది జరగలేదు. శాసనసభ ఎన్నికల్లో జనసేనకు తొమ్మిది సీట్లను కేటాయించింది. మొదట జనసేన 11 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించింది. ఇరు పార్టీల నేతల చర్చల 9 స్థానాలకు అంగీకారం కుదిరింది. కూకట్‌పల్లితోపాటు మరో ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, మధిర, వైరా, నాగర్‌కర్నూల్‌, కోదాడ, కూకట్‌పల్లి స్థానాలు కేటాయించినట్టు సమాచారం. శేరిలింగంపల్లి స్థానంపై ఇంకా పీటముడి వీడలేదు. శేరిలింగంపల్లి కోసం జనసేన పట్టుబడుతోంది. బీజేపీలోనూ శేరిలింగంపల్లి స్థానంపై తీవ్ర పోటీ నెలకొంది. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన తర్వాత శేరిలింగంపల్లి సీటుపై క్లారిటీ వచ్చే అవకాశముంది. 

టీడీపీ ఓట్ల కోసం బీజేపీ, జనసేన పొత్తు
బీజేపీ, జనసేన పొత్తుపై తెలంగాణలో జోరుగా చర్చ సాగుతోంది. 2018లో రెండు సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంది. దీనిపై అనేక రకాలుగా విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల రీత్యా సైలెంట్ అయింది. పది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోయినా, ప్రతి జిల్లాలో, నియోజకవర్గాల్లో ఇప్పటికి చెక్కుచెదరని ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంక్ ను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ, జనసేన కలిసి బరిలోకి దిగాయి. తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓటు ఈ కూటమి వైపు మళ్లితే మెజార్టీ సీట్లు సాధించవచ్చన్న ధీమాలో బీజేపీ, జనసేన నేతలు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో సీమాంధ్ర ఓటర్లు భారీగా ఉన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో పాటు తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో టీడీపీకి ఓటర్లు ఉన్నారు. ఇవన్నీ సాలిడ్ గా కూటమికి పడతాయన్న లక్ష్యంతోనే పొత్తు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

మంగళవారం హైదరాబాద్ కు మోడీ
119 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 88 చోట్ల అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మిగిలిన 31 స్థానాలకు 9 చోట్ల జనసేన బరిలోకి దిగనుంది. 22 స్థానాలకు కాషాయ పార్టీ అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటించనుంది. ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి సమష్టిగా పని చేయాలని రెండు పార్టీల నేతలు నిర్ణయించారు. ప్రధాని మోడీ మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో పాల్గొనే బీసీ ఆత్మగౌరవ సభకు పవన్‌కల్యాణ్‌ హాజరు కానున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
Rajyasabha election: తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మొత్తం 37 స్థానాలకు మార్చి 16న ఎన్నికలు
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మొత్తం 37 స్థానాలకు మార్చి 16న ఎన్నికలు
Congress Wins Jangaon and Thorrur: లక్కీడ్రాలోనూ బీఆర్ఎస్‌కు నిరాశే.. జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం
లక్కీడ్రాలోనూ బీఆర్ఎస్‌కు నిరాశే.. జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం

వీడియోలు

US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shiv Pratap Shukla: 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
Kolikapudi Srinivasa Rao: నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
Chandrababu in the Assembly: బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Vijay Trisha: జంటగా విజయ్ - త్రిష... ఎవ్వరికీ భయపడేది లేదని చెబుతున్నారా?
జంటగా విజయ్ - త్రిష... ఎవ్వరికీ భయపడేది లేదని చెబుతున్నారా?
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
తక్కువ డౌన్ పేమెంట్‌తో TVS Ronin కొనేయండి.. మీరు EMI ఎంత చెల్లించాలంటే
తక్కువ డౌన్ పేమెంట్‌తో TVS Ronin కొనేయండి.. మీరు EMI ఎంత చెల్లించాలంటే
Embed widget