అన్వేషించండి

Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు...పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు...ఏమన్నారంటే...

 Telangana Assembly Election 2023: డిసెంబరు 3 ఫలితాల్లో BRS విజయం సాధిస్తుందని ధీమాగా చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్. 70 సీట్లకు తగ్గకుండా గెలుస్తాం అని.. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు అన్నారు.  2018 ఎగ్జిట్‌ పోల్స్‌లో ఒక్క సంస్థ మాత్రమే సరిగా చెప్పిందన్న కేటీఆర్  ఈ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు.  మళ్లీ అధికారం బీఆర్ఎస్ పార్టీదేనని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

Also Read: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు

కేటీఆర్ మాటల్లోనే..

తెలంగాణలో ఎన్నికలు ముగియగానే పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని వచ్చింది. తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ను మంత్రి కేటీఆర్ కొట్టిపారేశారు. ఇంకా ఓటింగ్ పూర్తికాలేదు, ఓటింగ్ ఎంత శాతం జరిగిందనేది తేలలేదు. కానీ కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అని దుష్ప్రచారం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. 2018లో ఒక్క ఏజెన్సీ మాత్రమే సరైన ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణ ఎన్నికల్లో విజేత ఎవరనేది డిసెంబర్ 3వ తేదీన తేలుతుందన్నారు. గత మూడు నెలలుగా పార్టీ గెలుపు కోసం కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Also Read: ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 48 సీట్లు వస్తాయని ఒకరు, 50 సీట్లకు పరిమితమని మరో సంస్థ చెప్పిందన్నారు. కానీ 2018లో తాము 88 సీట్లతో ఘన విజయం సాధించామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో నాలుగు ఏజెన్సీలు తప్పుడు విషయాలు ప్రచారం చేస్తున్నాయి, ఒక్క ఏజెన్సీ సరైన ఫలితాలు అంచనా వేస్తుందన్నారు. కొందరు ఓటర్లు ఇంకా క్యూ లైన్లలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం తమకు అనుకూల ఎగ్జిట్ పోల్స్ వచ్చేలా చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గెలుస్తుందని వచ్చిన ఎగ్జిట్ పోల్స్ తప్పు అని డిసెంబర్ 3న నిరూపిస్తాం. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీసం 70 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను చెప్పింది నిజమో కాదో మరో మూడు రోజుల్లో తేలిపోతుందన్నారు. దాదాపు 90 సీట్లు నెగ్గుతామని మొదట్లో తాము భావించగా, కొన్ని కారణాలతో 70 సీట్లు నెగ్గుతున్నామని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎగ్జి్ట్ పోల్స్ పేరిట న్యూసెన్స్, నాన్ సెన్స్ చేసే వారికి డిసెంబర్ 3న నిజాలు తెలుస్తామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Also Read: సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్, ముగిసిన పోలింగ్ సమయం

ఏబీపీ సీఓటర్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్

తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో .. కాంగ్రెస్ కు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది కానీ.. అదే సమయంలో హంగ్ అసెంబ్లీ అంచనాలను కూడా తోసిపుచ్చలేమని ఏబీపీ సీఓటర్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో స్పష్టమయింది.  కాంగ్రెస్ పార్టీకి  49 నుంచి 65 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని తేలింది. అదే సమయంలో భారత రాష్ట్ర సమితికి 38  నుంచి 54 సీట్లు వచ్చే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ కూటమికి మూడు నుంచి 13 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇతరులు 5 నుంచి 9 స్తానాల్లో గెలుస్తారు. ఇతరుల్లో మజ్లిస్ పార్టీ కూడా ఉంది.

టాప్ హెడ్ లైన్స్

ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget