అన్వేషించండి

Telangana Polling 2023 LIVE Updates: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు

Telangana Assembly Election 2023 LIVE updates: నేడు తెలంగాణ ఎన్నికలు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 నియోజకవర్గాల్లో జరుగుతున్న పోలింగ్‌కు సంబంధించిన సమాచారం ఇక్కడ లైవ్‌లో చూడవచ్చు.

Key Events
Telangana Assembly Election 2023 Live updates: TS Polling news updates Voting percentage Telangana Polling 2023 LIVE Updates: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు
తెలంగాణలో ఏబీపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

Background

Telangana Assembly Election 2023 LIVE updates in Telugu: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నేడు (నవంబరు 30) ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఉదయం చింతమడకకు వెళ్తున్నారు. చింతమడక గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో తన సతీమణితో కలిసి సీఎం కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ గురువారం ఉదయం 7.30 గంటలకు SR నగర్‌లో నారాయణ జూనియర్ కళాశాల, పోలింగ్ స్టేషన్ నంబర్ 188లో కుటుంబ సమేతంగా ఓటు వేయనున్నారు. మంత్రి హరీష్ రావు దంపతులు సిద్దిపేట భారత్ నగర్ అంబిటస్ స్కూల్ లో ఉదయం 7-8 గంటల మధ్యలో ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు.

కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లోని zphsలోని పోలింగ్ బూత్ లో ఓటు వేయనున్నారు..
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి దంపతులు కోదాడ లోని గ్రేస్ వ్యాలీ ఐడియల్ స్కూల్ లో ఓటు వేయనున్నారు..
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధిర పట్టణంలోని సుబ్దరయ్య నగర్ మండల పరిషత్ పాఠశాలలో ఓటు వేయనున్నారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ పట్టణంలో వేయనున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో Both No - 160లో ఓటు వేయనున్నారు. 
ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి జగ్గారెడ్డి గారు సంగారెడ్డి పట్టణంలో ఓటు వేయనున్నారు.

అలాగే సెలబ్రిటీలు రేపు (నవంబర్ 30) ఏ పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తున్నారనే విషయాలు బయటికి వచ్చాయి.

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 165): మహేశ్‌బాబు, నమ్రత, మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌ ‌ 
(పోలింగ్‌ బూత్‌ 164): విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, శ్రీకాంత్‌ 
ఎఫ్‌ఎన్‌సీసీ (పోలింగ్‌ బూత్‌ 164): రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌ 
పోలింగ్‌ బూత్‌ (160):  విశ్వక్‌సేన్‌ 
పోలింగ్‌ బూత్‌ 166: దగ్గుబాటి రాణా, సురేశ్‌ బాబు
జూబ్లీహిల్స్‌ క్లబ్‌ (పోలింగ్‌ బూత్‌ 149): చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన, నితిన్‌ 
ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ (పోలింగ్‌ బూత్‌ 157): రవితేజ 
ఓబుల్‌రెడ్డి స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 150): జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి
బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ (పోలింగ్‌ బూత్‌ 153): అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌ 
వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ (పోలింగ్‌ బూత్‌ 151): నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌
మణికొండ: హైస్కూల్ ప్రభాస్, అనుష్క, వెంకటేశ్, బ్రహ్మానందం 
షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్: రాజమౌళి రామారాజమౌళి 
రోడ్‌ నెం.45, జూబ్లీహిల్స్‌ –ఆర్థిక సహకార సంస్థ: అల్లరి నరేశ్‌
యూసఫ్‌ గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల: తనికెళ్ల భరణి

ఈసీ తెలిపిన వివరాల ప్రకారం..  తెలంగాణలో మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,63,01,705 మంది మహిళా ఓటర్లు ఉండగా, 1,62,98,418 మంది పురుషులు ఉన్నారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.  ట్రాన్స్ జెండర్లు ఓటరు 2,676 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు 15,406, ప్రవాస ఓటర్లు 2,944 మంది ఉన్నారు. కొత్త వారి సంఖ్య 9,99,667. రాష్ట్రంలో మొత్తం 59,779 బ్యాలెట్ యూనిట్లను పోలింగ్ కోసం వినియోగిస్తున్నారు. ఎల్బీనగర్‌లో 4 బ్యాలెట్ యూనిట్లు వాడనున్నారు. రిజర్వ్ బ్యాలెట్ యూనిట్లు కలిపి మొత్తం 72,931 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉంటాయి. 56,592 కంట్రోల్ యూనిట్లు వినియోగిస్తున్నారు.  2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 స్థానాలను గెలుచుకుంది, 19 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా, AIMIM 7 సీట్లు, టీడీపీ 2, బీజేపీ ఒక్క సీటు నెగ్గాయి. AIFB, ఒక స్వతంత్ర అభ్యర్థి సైతం గెలుపొందారు. 

23:48 PM (IST)  •  30 Nov 2023

తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 70.60 శాతం ఓటింగ్

తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 70.60 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలవనుంది. బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితం కానుంది.

23:06 PM (IST)  •  30 Nov 2023

ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి స్పెషల్ లీవ్: వికాస్ రాజ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం నవంబర్ 29, 30 తేదీలలో పోలింగ్ విధులు నిర్వహించిన సిబ్బందికి శుక్రవారం ప్రత్యేక సెలవు ప్రకటించారు. స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ ఇవ్వాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు ప్రత్యేక సెలవు ఇవ్వాలని వికాస్ రాజ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget