అన్వేషించండి

AP Election Counting Updates 2024: కౌంటింగ్‌రోజు వేషాలు వేస్తే తాటతీస్తా- అల్లరిమూకలకు పల్నాడు ఎస్పీ మలికా మాస్ వార్నింగ్

Palnadu News: ఓట్ల లెక్కింపు రోజు లా ఆండ్‌ ఆర్డర్‌కు ఎవరు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవని పల్నాడు ఎస్పీ మల్లికాగార్గ్‌ హెచ్చరించారు. ఇప్పటికే రావాల్సిన మంచి పేరు వచ్చిందని సటైర్లు వేశారు.

Andhra Pradesh News: పల్నాడు జిల్లాలో  పోలింగ్ అనంతరం హింసపై పెద్దఎత్తున విమర్శలు చెలరేగడంతో పోలీసుశాఖ(Police)పై తీవ్ర విమర్శలు తలెత్తాయి.  రాజకీయ నేతలకు పోలీసులు తొత్తులుగా మారారని...బహిరంగంగా వార్నింగ్‌లు ఇస్తున్నా...ఊర్లపైపడిపోయి అరాచకం సృష్టిస్తున్నా పట్టించుకోకపోవడంతో రెచ్చిపోయిన అల్లరిమూకలు ఏకంగా పోలీసుల తలనే పగులగొట్టారు. అటు కేంద్ర ఎన్నికల సంఘం(CEC) సైతం తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేయడంతో డీజీపీ(DGP)....లేడీ సింగంగా పేరుగాంచిన మలికాగార్గ్‌(Mallika Garg)ను ఎస్పీగా నియమించారు. పేరుకు తగ్గట్టుగానే ఆమె అల్లరి మూకలకు మాస్‌వార్నింగ్ ఇచ్చారు. కౌంటింగ్‌ రోజు ఎవరైనా పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే తాటతీస్తామని హెచ్చరించారు..

మలికా మాస్‌ వార్నింగ్..
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎవరైనా పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తామని పల్నాడు(Palnadu) ఎస్పీ మలికాగార్గ్ హెచ్చరించారు. రాజకీయ నాయకులు లా అండ్‌ ఆర్డర్‌ను గౌరవించాలని...లేనిపక్షంలో ఏ పార్టీవారైనా చర్యలు తీసుకోవడం తప్పదని  ఆమె స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాలో ప్రశాంతత కోసం పోలీసుశాఖ కృషి చేస్తోందని...దీనికి విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించినా సహించేది లేదన్నారు. పోలీసు అధికారులు తప్పుచేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. పల్నాడు జిల్లావ్యాప్తంగా 150 సమస్యాత్మక గ్రామాలను గుర్తించడం జరిగిందని ఆమె తెలిపారు. గొడవలు, ఘర్షణలకు పాల్పడే అవకాశం ఉన్న1666 మందిని సైతం పోలీసుశాఖ గుర్తించందన్నారు. నిరంతరం ఆయా వ్యక్తులపైన నిఘా కొనసాగుతుందన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు.

ఇప్పటికే 150కి పైగా కేసులు పెట్టామని...దర్యాప్తు అనంతరం ఇందులో నిందితులుగా ఉన్న వారిపై రౌడీషీట్లు తెరుస్తామన్నారు మల్లికా. బైండోవర్ కేసుల్లో ఉన్నవారు లక్ష నుంచి రెండు లక్షల వరకు స్థానిక తహసీల్దార్ వద్ద డిపాజిట్ చేయిస్తున్నామన్నారు. అలాంటి వారు ఏదైనా గొడవకు దిగితే డిపాజిట్ చేసిన సొమ్ము వెనక్కి తిరిగి ఇవ్వబోమన్నారు. జిల్లావ్యాప్తంగా కార్డన్  సెర్చ్‌ కొనసాగుతోందని....అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నామన్నారు. వాహనాలను సీజ్‌ చేయడంతోపాటు....విడిగా పెట్రోలు కలిగి ఉంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా 700 మంది కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan:  వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
Telangana Group 1: తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్-కీలక ఆదేశాలు జారీ చేసిన  హైకోర్టు
తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్-కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
AP DSC 2025: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్‌ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్‌ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 
Preeti Reddy : తెలంగాణలో కాంగ్రెస్‌ను దేవుడు కూడా కాపాడలేడు; రేవంత్ ప్రభుత్వంపై మల్లారెడ్డి కోడలు ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్‌ను దేవుడు కూడా కాపాడలేడు; రేవంత్ ప్రభుత్వంపై మల్లారెడ్డి కోడలు ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mitchell Starc vs Yashasvi Jaiswal in IPL 2025 | స్టార్క్ వర్సెస్ జైశ్వాల్  | ABP DesamAxar Patel Kuldeep Yadav vs RR | IPL 2025 లో ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న అక్షర్, కుల్దీప్DC vs RR Super Over Failure | IPL 2025 లో తొలి సూపర్ ఓవర్..చేతులారా నాశనం చేసుకున్న RRMitchell Starc vs Yashasvi Jaiswal | IPL 2025 లో కొనసాగుతున్న స్టార్క్ వర్సెస్ జైశ్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:  వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
Telangana Group 1: తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్-కీలక ఆదేశాలు జారీ చేసిన  హైకోర్టు
తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్-కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
AP DSC 2025: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్‌ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్‌ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 
Preeti Reddy : తెలంగాణలో కాంగ్రెస్‌ను దేవుడు కూడా కాపాడలేడు; రేవంత్ ప్రభుత్వంపై మల్లారెడ్డి కోడలు ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్‌ను దేవుడు కూడా కాపాడలేడు; రేవంత్ ప్రభుత్వంపై మల్లారెడ్డి కోడలు ఆసక్తికర వ్యాఖ్యలు
AP Liquor Scam News:  లిక్కర్ స్కాంలో పోలీసులతో గేమ్ ఆడుతున్న నిందితులు - ఎన్ని నోటీసులిచ్చినా ఒక్కరూ రారే - సీఐడీ ఎం చేయబోతోంది ?
లిక్కర్ స్కాంలో పోలీసులతో గేమ్ ఆడుతున్న నిందితులు - ఎన్ని నోటీసులిచ్చినా ఒక్కరూ రారే - సీఐడీ ఎం చేయబోతోంది ?
Waqf Bill:  వక్ఫ్  చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - స్టేటస్ కో విధింపు
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - స్టేటస్ కో విధింపు
Tirumala Arjitha Seva Tickets for July 2025: శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల.. లక్కీ డిప్ రిజిస్ట్రేష‌న్‌ టైమింగ్స్ ఇవే!
శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల.. లక్కీ డిప్ రిజిస్ట్రేష‌న్‌ టైమింగ్స్ ఇవే!
AP DSC 2025: ఏపీలో టెట్‌తో కలిపి డీఎస్సీ ఉంటుందా? ఈసారి అప్లికేషన్‌లో చేస్తున్న మార్పులేంటో తెలుసా?
ఏపీలో టెట్‌తో కలిపి డీఎస్సీ ఉంటుందా? ఈసారి అప్లికేషన్‌లో చేస్తున్న మార్పులేంటో తెలుసా?
Embed widget