అన్వేషించండి

Pithapuram News: నేటి నుంచి పవన్ ప్రచారం శంఖారావం

Andhra Pradesh News: నేటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం మొదలవుతుంది. ఇవాళ్టి నుంచి 12 వ తేదీ వరకు సాగనుందీ ప్రచారం.

Pawan Kalyan Elections Campaign: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచార భేరీ నేటి నుంచి ప్రారంభమవుతుంది. మొదటి విడత ప్రచారం ఏప్రిల్‌ 12 వరకు సాగనుంది. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు ఆయన పోటీ చేస్తున్న పిఠాపురంలోనే ప్రచారం చేయనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌్లో ఈ మధ్యాహ్నం 12.30కి గొల్లప్రోలు... అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పిఠాపురం చేరుకుంటారు. 

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పిఠాపురం టికెట్ ఆశించిన ఎస్‌వీఎన్‌ఎస్ వర్మతో పవన్ కల్యాణ్‌ సమావేశం అవుతారు. ఆయనతో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి పాదగయ క్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ అష్టదశ పీఠంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత శ్రీపాద వల్లభుని ఆలయంలో కూడా పూజలు చేస్తారు. 

సాయంత్రం నాలుగున్నరకు పవన్ ప్రచారం మొదలవుతుంది. చేబ్రోలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడి ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరిస్తారు. పిఠాపురం నియోజకవర్గంలోనే ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు అంటే రెండోతేదీ వరకు పవన్ ప్రచారం సాగనుంది. ఈ ప్రచారంలో పిఠాపురంలోని ప్రజలతోపాటు స్థానికంగా ఉండే కూటమి నాయకులతో కూడా పవన్ కల్యాణ సమావేశమవుతారు. వారితోపాటు మేథావులు ఇతర సామాజిక వర్గాల వారితో మాట్లాడనున్నారు. 

ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకొని ఉగాది నాటికి మళ్లీ పిఠాపురంలో ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. ఉగాది రోజు పిఠాపురంలోనే కార్యకర్తలతో నేతలతో గడపనున్నారు. అక్కడే పంచాగశ్రవణంలో పాల్గొంటారు. 

మూడో తేదీన పిఠాపురంలో ప్రచారం ముంగించుకొని హెలికాప్టర్‌లో తెనాలి చేరుకుంటారు. అక్కడ పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్‌ తరఫున ప్రచారం చేయనున్నారు. ఆ నియోజకవర్గంలో రోడ్‌షోలతోపాటు బహిరంగ సభ కూడా ఉంటుంది. తెనాలి ప్రచారం ముగిసిన తర్వాత నాల్గో తేదీ నుంచి ఉత్తారంధ్రలో పవన్ పర్యటించనున్నారు. 

నాల్గో తేదీన నెల్లిమర్ల, ఐదో తేదీన అనకాపల్లి, ఆరున యలమంచలి, 7న పెందుర్తిలో జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. అక్కడ కూడా రోడ్‌షోలు, బహిరంగ సభల్లో ప్రసగించనున్నారు. వారి విజయానికి కూటమి నేతలు సహకరించేలా వారితో మాట్లాడనున్నారు. అన్ని పార్టీల నేతలు కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్లేలా సమన్వయం చేసుకోవాలని సూచించనున్నారు. 

ఏదో తేదీన ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకొని కాకినాడ చేరుకుంటారు పవన్. కోస్తా జిల్లాల్లో ప్రచారం 8 నుంచి ప్రారంభంకానుంది. కాకినాడలో 8న ప్రచారం చేస్తారు. 9వ తేదీన ఉగాది రోజున పిఠాపురంలో ఉంటారు. తర్వాత రోజు పదో తేదీ నుంచి  కోనసీమ జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది పవన్ వారాహి విజయభేరి యాత్ర. 11న పి గన్నవరం నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు. 12న తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో పవన్ ప్రచారంతో మొదటి విడత ప్రచారం ముగుస్తుంది. 
 

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
SIR Process In Andhra Pradesh and Telangana 2026: 24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
SIR 2026: SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!
SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Embed widget