అన్వేషించండి

Delhi Election Result 2025: కేజ్రీవాల్ ఓటమి స్వయం కృతాపరాథం - ఐదు ప్రధాన కారణాలు ఇవే !

Kejriwal: కేజ్రీవాల్ ఓటమికి ఐదు ప్రధాన కారణాలు ఏమిటంటే ?

Five main reasons for Kejriwal defeat: పంజాబ్‌లో తిరుగులేని విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ కన్నా ఓడిపోయిన కేజ్రీవాల్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. గత రెండు సార్లు 70 అసెంబ్లీ స్థానాలున్నరాష్ట్రంలో 60కిపైగా గెలిచిన రికార్డు ఆయన సొంతం. మరి ఆయన ఎందుకు పరాజయం పాలయ్యారు ?. ఆయన ఓటమికి ఐదు ప్రధాన కారణాలు చెప్పుకోవచ్చు. 

1. కాంగ్రెస్‌ను దూరం చేసుకోవడం  

ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ఆప్.. కాంగ్రెస్ ను దూరం చేసుకుంది. ఆ పార్టీపై విరుచుకుపడింది. పొత్తు వద్దే వద్దని ఒంటరి పోటీ చేసింది. కానీ అదే ఆ పార్టీకి విజయాన్ని దూరం చేసింది.  కాంగ్రెస్ పార్టీకి ఏడు శాతం వరకూ ఓట్లు వచ్చాయి ఇది కేజ్రీవాల్ ఓటమిని డిసైడ్ చేసిందని చెప్పక తప్పదు. ఢిల్లీలో పోరు హోరాహోరీగా సాగిందని ఫలితాలు చూపిస్తున్నాయి. చాలా తక్కువ తేడాతో కొన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఇలాంటి ఫలితాలను ప్రభావితం చేసింది  కాంగ్రెస్ పార్టీనే.  పార్లమెంట్ ఎన్నికల్లో కలసి పోటీ చేసిన కాంగ్రెస్, ఆప్ ఇప్పుడు విడివిడిగా పోటీ చేశాయి. కాంగ్రెస్ హర్యానా ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేదని.. ఆప్ ఢిల్లీలో కాంగ్రెస్ కు ఝులక్ ఇచ్చింది. చివరికి అది తనకు తాను ఇచ్చుకున్న ఝులక్ లాగా మారింది.  

2. రాజీనామా చేయనని హామీ ఇచ్చి రాజీనామా చేసిన కేజ్రీవాల్

 జైలు నుంచి బెయిల్ పై విడుదలైన తర్వాత కేజ్రీవాల్  పాలనపై దృష్టి పెట్టలేదు. అరెస్టు అయినప్పటికీ ఆయన తన పదవికి రాజీనామా చేయకుండా అతిశీ ద్వారా పాలన సాగించారు. కానీ విడుదలైన తర్వాత సానుభూతి రాజకీయాల కోసం తన పదవికి రాజీనామా చేశారు.  గతంలో కేజ్రీవాల్ తను మరోసారి రాజీనామా చేసి తప్పు చేయనని ప్రజలకు హామీ ఇచ్చి ఉన్నారు. మొదటి సారి అధికారం చేపట్టినప్పుడు పూర్తి మెజార్టీ లేదు. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లో రాజీనామాలు చేసి.. రాజకీయాలు చేశారు. ఆ సమయంలో రెండో సారి గెలిచే ముందు తాను ఆ తప్పు మరోసారి చేయనని ప్రజలకు హామీ ఇచ్చారు. రాజీనామాలు చేయబోనన్నారు. అయితే ఇప్పుడు ఆయన తన వాగ్దానాన్ని మర్చిపోయారు. రాజీనామా చేశారు. ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. 

3. అవినీతి వ్యతిరేకత ఉద్యమ నేతపైనే అవినీతి ఆరోపణలు

అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్  చురుగ్గా పాల్గొని దేశం దృష్టిని ఆకర్షించారు. చివరికి ఆయనకు రాజకీయ లక్ష్యాలు ఉన్నాయని ఆమ్ ఆద్మీ పార్టీని ప్రకటించడం ద్వారా స్పష్టమయింది. ప్రజలు మొదట్లో పూర్తి మెజార్టీ ఇవ్వలేదు. కానీ తర్వాత రెండు సార్లు పూర్తి స్థాయిలో మద్దతు పలికారు. రెండు సార్లు 70 అసెంబ్లీ స్థానాల్లో అరవై స్థానాలకుపైగా కట్టబెట్టారు. అలాంటి నమ్మకాన్ని కేజ్రీవాల్ నిలబెట్టుకోలేకపోయారు. రెండో సారి గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో  ఆయన అధికారాన్ని సిసోడియాకు అప్పగించి ఆయన రాజకీయాలు చేయడం ప్రారంభించారు. ఫలితంగా ప్రజలు ఆప్ పై క్రమంగా ఆసక్తి కోల్పోవడం ప్రారంభించారు. 

4. కేజ్రీవాల్ అవినీతి చేశారని ప్రజలు నమ్మడం

ఆప్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రావడం ఢిల్లీ ప్రజల్ని ఆగ్రహానికి గురి చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అసలేం లేదని చెప్పినా ప్రజలు నమ్మలేదు. ఆయనను అరెస్టు చేసినా ప్రజలు స్పందించలేదని.. సానుభూతి వ్యక్తం చేయలేదని ఫలితాల ద్వారా స్పష్టమయింది. తాను అవినీతి చేసినట్లుగా నమ్మితే తనను ఓడించాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఆ ప్రకారం ఢిల్లీ ప్రజలు ఆయన అవినీతి చేసినట్లు నమ్మారు. సిసోడియాతో పాటు పలువురు ఆప్ నేతలు అవినీతిలో మునిగి తేలినట్లుగా ప్రజలు గట్టి గా నమ్మారని ఫలితాలు నిరూపిస్తున్నాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో పుట్టిన పార్టీ ఇలా అవినీతి లో మునిగిపోవడం ప్రజల్ని ఆగ్రహానికి గురి చేసింది. 
 
5.కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్ తో గొడవలు  

రాజకీయ కారణాలతో  అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కేంద్రంతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితికి వెళ్లారు. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం. రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే అధికారాలు స్వల్పం. పోలీసు వ్యవస్థ కూడా కేంద్రం అధీనంలోనే ఉంటుంది. ప్రజల సంక్షేమం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. మొదటి విడతలో అద్భుతమైన పాలన చూపించిన కేజ్రీవాల్.. రెండో విడతకు వచ్చే సరికి కేంద్రంతో  గొడవలు పడి.. పనులు జరగకుండా చేసుకున్నారు. ఫలితంగా ఆప్ మార్క్ మిస్ అయిపోయింది. స్కూల్స్ బాగు చేయించామని.. మొహల్లా క్లీనిక్ లు పెట్టామని మొదటి విడత లో చేసిన పనులనే ఇప్పుడూ ప్రచారం చేసుకున్నారు కానీ.. గత ఐదేళ్లలో ఏం చేశారో చెప్పుకోలేకపోయారు. ఫలితంగా కేజ్రీవాల్ కు ప్రజలు ఇంటి దారి చూపించారు. 
 

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
SIR Process In Andhra Pradesh and Telangana 2026: 24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
SIR 2026: SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!
SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandamuri Balakrishna: అమ్మ క్యాన్సర్ బాధ నుంచే బసవతారకం ఆసుపత్రి ఆలోచన.. నందమూరి బాలకృష్ణ భావోద్వేగం
అమ్మ క్యాన్సర్ బాధ నుంచే బసవతారకం ఆసుపత్రి ఆలోచన.. నందమూరి బాలకృష్ణ భావోద్వేగం
Tungabhadra Dam New Gates Inauguration 2026: తుంగభద్ర సరికొత్త రికార్డు - 25న చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ చేతుల మీదుగా 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం!
తుంగభద్ర సరికొత్త రికార్డు - 25న చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ చేతుల మీదుగా 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం!
Duvvada Madhuri Kotturu Police Station: దువ్వాడ కోసం ఎందాకైనా.. పోలీస్ స్టేషన్ ఎదుట దివ్వెల మాధురీ హంగామా - అసలు కేసేమిటంటే?
దువ్వాడ కోసం ఎందాకైనా.. పోలీస్ స్టేషన్ ఎదుట దివ్వెల మాధురీ హంగామా - అసలు కేసేమిటంటే?
Revanth Reddy Delhi Tour: రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం.. సాయంత్రం ఒకే సమావేశంలో కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం
రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం.. సాయంత్రం ఒకే సమావేశంలో కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం
AP Weather Update Rains: ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక - కాకినాడ, రాజమండ్రి, తిరుపతిలో దంచికొట్టనున్న వానలు.. జాగ్రత్త పడండి!
ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక - కాకినాడ, రాజమండ్రి, తిరుపతిలో దంచికొట్టనున్న వానలు.. జాగ్రత్త పడండి!
Keir Starmer Resigns UK PM 2026: బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ రాజీనామా! 10 ఏళ్లలో ఏడో పీఎం.. ఎందుకీ రాజకీయ అస్థిరత?
బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ రాజీనామా! 10 ఏళ్లలో ఏడో పీఎం.. ఎందుకీ రాజకీయ అస్థిరత?
JD Vance: అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
Sreeleela : శ్రీలీలకు అవమానం జరిగిందా? - అసలు నిజం ఏంటో తెలుసా?
శ్రీలీలకు అవమానం జరిగిందా? - అసలు నిజం ఏంటో తెలుసా?
Embed widget