అన్వేషించండి

Exit Polls vs Opinion Polls : ఎగ్జిట్ పోల్స్‌ అంటే ఏంటీ? ఒపీనియన్ పోల్స్‌కు వీటికి ఉన్న తేడా ఏంటీ? 

Exit Polls vs Opinion Polls : భారత్‌లో ఎన్నికల ప్రక్రియలో ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇవి ఓటర్లను ప్రభావితం చేయకుండా ఈసీ కఠిన రూల్స్ పెట్టింది

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎన్నికల ముందు ఒపీనియన్ పోల్స్, పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తారు.
  • ఎగ్జిట్ పోల్స్ ఓటరు అభిప్రాయాన్ని సేకరించి అంచనాలు తెలియజేస్తాయి.
  • అన్ని దశల పోలింగ్ తర్వాతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాలి.
  • ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎల్లప్పుడూ కచ్చితంగా ఉండవని గమనించాలి.

Exit Polls vs Opinion Polls : ప్రజాస్వామ్య భారత్‌లో ఎన్నికలు అంటే కేవలం ఓట్లు వేయడం మాత్రమే కాదు. ఆ ఓటు ఫలితం ఏంటో తెలుసుకోవాలని ఉత్సుకత ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందే ప్రజల నాడిని పట్టుకోవాలని ప్రయత్నించే చర్య సర్వేలు. ప్రస్తుతం 2026లో ఐదు రాష్ట్రాల్లో జరిగిన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్‌ కూడా వచ్చాయి. అయితే ఈ సర్వేలు ఎలా చేస్తారు. వీటికి ఉండే చట్టబద్ధత ఏంటీ అనే విషయాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. 

ఒపీనియన్ పోల్ అంటే...

ఒపీనియర్ పోల్ లేదా అభిప్రాయ సేకరణ అనేది ఎన్నికలు ప్రారంభంకావడానికి ముందే నిర్వహించే సర్వే. నామినేషన్ల ప్రక్రియకు ముందు లేదా ప్రచారం జరుగుతున్న సమయంలో వీటిని చేపడతారు. ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, వారి ప్రధాన సమస్యలు ఏంటీ, ప్రచార పద్ధతులు ఓటర్లను ఎంత వరకు ప్రభావితం చేస్తున్నాయి అనేది తెలుసుకోవడానికి సర్వేలు చేస్తారు. శాంపిల్ సైజ్ నుంచి సమాచారాన్ని సేకరిస్తారు. ఎన్నికల ప్రచారం సాగుతున్న కొద్దీ ప్రజల అభిప్రాయాలు మారే ఛాన్స్ ఉంది. అందుకే ఒపీనియన్ పోల్ ఫలితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. 

ఎగ్జిట్ పోల్ అంటే ..

ఎగ్జిట్ పోల్ అనేది ఓటు వేసిన తర్వాత బయటకు వచ్చిన ఓటరు అభిప్రాయాన్ని నేరుగా సేకరించే ప్రక్రియ. ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే పోలింగ్ కేంద్రం వెలుపల ఈ సర్వే చేస్తారు. సర్వే చేసే వ్యక్తులు పోలింగ్ బూత్ బయట వేచి ఉండి, ఓటు వేసి వస్తున్న వారిని మీరు ఎవరికి ఓటు వేశారు అని అడిగి తెలుసుకుంటారు. ఓటరు తన నిర్ణయాన్ని అమలు చేసిన తర్వాత చెప్పే మాటలు కాబట్టి ఇవి ఒపీనియన్ పోల్స్ కంటే కాస్త కచ్చితత్వానికి దగ్గరగా ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఇవి కేవలం ప్రాథమిక అంచనాలు మాత్రమే. అధికారిక ఫలితాలు కావు. 

ఎన్నికల సంఘం రూల్స్ 

ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసింది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ ప్రసారంపై ఆంక్షలు విధించింది. ఎన్నికలు ఒకటి కంటే ఎక్కువ దశల్లో జరుగుతున్నప్పుడు అన్ని దశల పోలింగ్ పూర్తి అయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించకూడదు. ఇవాళ కూడా దీన్ని అమలు చేసింది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై ఆరు గంటలకు ముగిసింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆరున్న తర్వాత వెల్లడించారు. ఈ రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ ఉంటాయి. 

సర్వేలు నిర్వహించే పద్ధతులు

మీడియా సంస్థలు, పరిశోధన ఏజెన్సీలు, పోలింగ్ సంస్థలు వివిధ పద్ధతుల ద్వారా డేటాను సేకరిస్తాయి. క్షేత్రస్థాయిలో ఓటర్లతో మాట్లాడటం ద్వారా, టెలీఫోన్ ద్వారా ఓటర్ల అభిప్రాయం తెలుసుకుంటాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో టీంలను పంపించి సమాచారాన్ని సేకరిస్తారు. 

ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న సంస్థలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఓటింగ్ సరళిని అంచనా వేయడానికి ఈ పద్దతులను అనుసరించాయి. 

ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా

ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం సంకేతాలు మాత్రమే ఇవి ఎప్పుడూ కచ్చితంగా ఉంటాయని చెప్పలేం. అనేక సందర్భాల్లో ఎగ్జిట్‌పోల్ అంచనాలు లెక్క తప్పుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఒకట్రెండు మినహా మిగతా సర్వే సంస్థల లెక్కలు తెప్పాయి.  

Frequently Asked Questions

ఒపీనియన్ పోల్ అంటే ఏమిటి?

ఒపీనియన్ పోల్ అనేది ఎన్నికలు ప్రారంభం కాకముందే లేదా ప్రచారం జరుగుతున్న సమయంలో నిర్వహించే సర్వే. ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, వారి సమస్యలు ఏమిటి అని తెలుసుకోవడానికి దీనిని చేస్తారు.

ఎగ్జిట్ పోల్ అంటే ఏమిటి?

ఎగ్జిట్ పోల్ అనేది ఓటు వేసిన తర్వాత బయటకు వచ్చిన ఓటరు అభిప్రాయాన్ని నేరుగా సేకరించే ప్రక్రియ. పోలింగ్ కేంద్రం వెలుపల ఓటరు ఎవరికి ఓటు వేశారు అని అడిగి తెలుసుకుంటారు.

ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు వెల్లడించాలి?

ఎన్నికలు ఒకటి కంటే ఎక్కువ దశల్లో జరిగితే, అన్ని దశల పోలింగ్ పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించకూడదు. పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే వీటిని ప్రచురించాలి.

ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నమ్మదగినవి?

ఎగ్జిట్ పోల్స్ కేవలం సంకేతాలు మాత్రమే, అవి ఎల్లప్పుడూ కచ్చితంగా ఉండవు. అనేక సందర్భాల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పుతాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
Advertisement

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget