By: ABP Desam | Updated at : 02 Mar 2022 12:36 PM (IST)
Edited By: Murali Krishna
ప్రధాని అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్
UP Election 2022: ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. భవిష్యత్ ప్రధాని అభ్యర్థిగా భాజపా భావిస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి, భాజపా చాణక్యుడు అమిత్ షా కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యోగిని.. కాబోయే ప్రధానిగా ప్రజలు భావించడం సహజమేనన్నారు.
సహజమే
యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఉత్తర్ప్రదేశ్లో మరోసారి భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అయితే సీఎం యోగిని కాబోయే ప్రధాని అభ్యర్థిగా ప్రజలు చూస్తున్నారని, దీనిపై మీరేమంటారు అని అడిగిన ప్రశ్నకు అమిత్ షా సమాధానమిచ్చారు.
శాంతిభద్రతలు
రాష్ట్రంలో శాంతి భద్రతలను మెరుగు పరిచేందుకు యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా శ్రమించారు. అలానే రహదారుల అనుసంధానాన్ని అభివృద్ధి చేశామని.. గంగా ఎక్స్ప్రెస్వేను ప్రారంభించామన్నారు.
మళ్లీ గెలుపు ముఖ్యం
2024లో నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ఇప్పుడు యోగి ఆదిత్యానాథ్ గెలుపు భాజపాకు కీలకమని భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు అమిత్ షా.. యూపీ తమకు చాలా కీలకమన్నారు.
3 Years of YSR Congress Party Rule : మూడేళ్లలో జగన్ ఎదుర్కొన్న సవాళ్లేంటి ? ఎలా అధిగమించారు ?
Rajyasabha Election Shedule : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ - అదృష్టవంతులెవరో ?
TRS @ 21 : టీఆర్ఎస్కు 21 ఏళ్లు - మరో మిషన్ ముంగిట కేసీఆర్ !
First Telugu Bibile: వైజాగ్లో రూపుదిద్దుకున్న తొలి తెలుగు బైబిల్ బెంగళూరులో ఎందుకుందీ?
Zodiac Signs Saturn 2022: ఏప్రిల్ 29 న కుంభరాశిలోకి శని, ఈ ప్రభావం మీ రాశిపై ఎలాఉందో ఇక్కడ తెలుసుకోండి
Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ
RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్కు రాజస్తాన్!
Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం