అన్వేషించండి

UP Election 2022: ప్రధాని అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్- ఆసక్తికర సమధానమిచ్చిన అమిత్ షా

UP Election 2022: యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. యోగిని భవిష్యత్ ప్రధాని అభ్యర్థిగా చూస్తున్నారా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు.

UP Election 2022: ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. భవిష్యత్ ప్రధాని అభ్యర్థిగా భాజపా భావిస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి, భాజపా చాణక్యుడు అమిత్ షా కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యోగిని.. కాబోయే ప్రధానిగా ప్రజలు భావించడం సహజమేనన్నారు.

సహజమే 

యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అయితే సీఎం యోగిని కాబోయే ప్రధాని అభ్యర్థిగా ప్రజలు చూస్తున్నారని, దీనిపై మీరేమంటారు అని అడిగిన ప్రశ్నకు అమిత్ షా సమాధానమిచ్చారు.

" ఇది సహజమే. యోగి నాయకత్వంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నో ఏళ్లుగా లేని అభివృద్ధి జరిగింది. యూపీలో 30 వైద్య కళాశాలలు వచ్చాయి. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల వచ్చేలా చూస్తున్నాం. రాష్ట్రంలో రెండు ఎయిమ్స్ ఆసుపత్రులు ఉన్నాయి. రాష్ట్రంలో 10 కొత్త విశ్వవిద్యాలయాలు, 77 కళాశాలలు భాజపా సర్కార్ నిర్మించింది. 1.4 లక్షల కాలేజీలను అభివృద్ధి చేశాం.                                                 "
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

శాంతిభద్రతలు

రాష్ట్రంలో శాంతి భద్రతలను మెరుగు పరిచేందుకు యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా శ్రమించారు. అలానే రహదారుల అనుసంధానాన్ని అభివృద్ధి చేశామని.. గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించామన్నారు.

" యోగి ఆదిత్యానాథ్.. అందరికీ ఆదర్శంగా నిలిచారు. శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు తీవ్రంగా శ్రమించారు. దొంగతనాలు, అత్యాచారాల కేసులు 30-70 శాతం పడిపోయాయి. యూపీలో ఇంతకుముందు ఎప్పుడు ఇంత మంచి రహదారులు లేవు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను ఎక్స్‌ప్రెస్‌వేలతో అనుసంధానం చేశారు.                                                           "
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

మళ్లీ గెలుపు ముఖ్యం

2024లో నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ఇప్పుడు యోగి ఆదిత్యానాథ్ గెలుపు భాజపాకు కీలకమని భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు అమిత్ షా.. యూపీ తమకు చాలా కీలకమన్నారు.

" నేను అలా చెప్పను. దిల్లీలో అధికారం కావాలంటే లఖ్‌నవూ చాలా కీలకమంటున్నాను. ఉత్తర్‌ప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉన్నందున ఇక్కడ భాజపా అధికారంలోకి రావడం కీలకం. 2024లో కేంద్రంలో అధికారంలో ఉండాలంటే ఇది అవసరం. ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధిక స్థానాలు లేకపోతే కేంద్రంలో పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడం కష్టం.                                                               "
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Airport operations disrupt: ఢిల్లీలోనే కాదు ముంబై ఎయిర్ పోర్టులోనూ గందరగోళం - వందల విమానాల రద్దు - అసలేం జరుగుతోంది?
ఢిల్లీలోనే కాదు ముంబై ఎయిర్ పోర్టులోనూ గందరగోళం - వందల విమానాల రద్దు - అసలేం జరుగుతోంది?
Bandi Sanjay : గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Remove stray dogs: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - ఆ ప్రాంతాల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశం
వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - ఆ ప్రాంతాల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశం
Bihar Elections 2025: బిహార్‌లో 60శాతం కంటే ఎక్కువ ఓటింగ్ జరిగినప్పుడల్లా, రాజకీయాలు మారాయి! ఈసారి ఏంటి?
బిహార్‌లో 60శాతం కంటే ఎక్కువ ఓటింగ్ జరిగినప్పుడల్లా, రాజకీయాలు మారాయి! ఈసారి ఏంటి?
Advertisement

వీడియోలు

గంభీర్ భాయ్.. నీకో దండం! బ్యాటింగ్‌ పొజిషన్ ఇలా సెలక్ట్ చేస్తున్నావా?
చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి
పీఎం మోదీని కలిసినప్పుడు అలా ఎందుకు చేసానంటే..!
అల్లటప్పా ఆటగాడనుకున్నారా.. రీప్లేస్ చేయాలంటే బాబులు దిగిరావాల!
Australia vs India 4th T20I Match Highlights | నాలుగో టీ20 లో గెలిచిన టీమిండియా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airport operations disrupt: ఢిల్లీలోనే కాదు ముంబై ఎయిర్ పోర్టులోనూ గందరగోళం - వందల విమానాల రద్దు - అసలేం జరుగుతోంది?
ఢిల్లీలోనే కాదు ముంబై ఎయిర్ పోర్టులోనూ గందరగోళం - వందల విమానాల రద్దు - అసలేం జరుగుతోంది?
Bandi Sanjay : గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Remove stray dogs: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - ఆ ప్రాంతాల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశం
వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - ఆ ప్రాంతాల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశం
Bihar Elections 2025: బిహార్‌లో 60శాతం కంటే ఎక్కువ ఓటింగ్ జరిగినప్పుడల్లా, రాజకీయాలు మారాయి! ఈసారి ఏంటి?
బిహార్‌లో 60శాతం కంటే ఎక్కువ ఓటింగ్ జరిగినప్పుడల్లా, రాజకీయాలు మారాయి! ఈసారి ఏంటి?
Aaryan Telugu Review - 'ఆర్యన్' రివ్యూ: మరణించిన వ్యక్తి వరుస హత్యలు ప్లాన్ చేస్తే... తమిళ్ సీరియల్ కిల్లర్ కథ ఎలా ఉందంటే?
'ఆర్యన్' రివ్యూ: మరణించిన వ్యక్తి వరుస హత్యలు ప్లాన్ చేస్తే... తమిళ్ సీరియల్ కిల్లర్ కథ ఎలా ఉందంటే?
SSMB29 Update : 'SSMB29' విలన్ కుంభ - ఇన్‌స్పిరేషన్ ఎవరు?.. అసలు స్టోరీ ఏంటంటే?
'SSMB29' విలన్ కుంభ - ఇన్‌స్పిరేషన్ ఎవరు?.. అసలు స్టోరీ ఏంటంటే?
Ajith Kumar : స్టార్‌ హీరోతో గొడవ - ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన తమిళ స్టార్ అజిత్
స్టార్‌ హీరోతో గొడవ - ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన తమిళ స్టార్ అజిత్
Jubilee Hills by-election : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ తనిఖీల కలకలం- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ తనిఖీల కలకలం- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం
Embed widget