అన్వేషించండి

Land Tittiling Act: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రచారం - చంద్రబాబు, లోకేశ్ పై ఎఫ్ఐఆర్ నమోదు, టీడీపీ ఇంఛార్జీకి సీఐడీ నోటీసులు

Andhrapradesh News: రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈసీ ఆదేశాలతో దర్యాప్తు ముమ్మరం చేసిన సీఐడీ.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

Cid FIR on Chandrababu And Lokesh: ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (Land Titiling Act) అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అధికార వైసీపీపై టీడీపీ విమర్శలు తీవ్రం చేస్తుండగా.. సీఎం జగన్ (Cm Jagan) సహా వైసీపీ నేతలు సైతం అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. అయితే, ఆదివారం ఈ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్న వైసీపీ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో దర్యాప్తు ముమ్మరం చేసిన సీఐడీ.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh)పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ లో చంద్రబాబును ఏ1గా, లోకేశ్ ను ఏ2గా పేర్కొంది. ఈ వ్యవహారంలో మొత్తం 10 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే, ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీపైనా కేసు నమోదు చేసినట్లు సమాచారం.

టీడీపీ ఇంఛార్జీకి నోటీసులు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారంపై ఈసీ ఆదేశాలతో విచారణ వేగవంతం చేసిన సీఐడీ టీడీపీ ఇంఛార్జీ అశోక్ బాబుకు నోటీసులు జారీ చేసింది. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లి అధికారులు నోటీసులు ఇచ్చారు. సోమవారం విచారణకు రావాలని ఆదేశించారు.

ఇదీ జరిగింది

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములన్నీ వైసీపీ నేతల గుప్పిట్లోకి వెళ్లిపోతాయని.. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే, టీడీపీ నేతలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, సీఎం జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజుల నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని.. మార్కాపురం, ఒంగోలు సభల్లో సీఎం వైఎస్ జగన్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ చర్యలు చేపట్టింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న ప్రచారంపై విచారణ చేయాలని సీఐడీని ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తెచ్చిన చట్టాలపై దుష్ప్రచారం చేయడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ ఆదేశాలతో దర్యాప్తు ముమ్మరం చేసిన సీఐడీ.. చంద్రబాబు, లోకేశ్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

చంద్రబాబుపై మంత్రి ఆగ్రహం

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తోన్న ప్రచారంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. 'ఇంకా 13వేల గ్రామాలలో సర్వే చేయాల్సి ఉంది. చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారు. పేదల ఇళ్ల స్థలాల కోసం రైతులకు డబ్బులు ఇచ్చి సీఎం జగన్ భూములు తీసుకున్నారు. అమరావతి పేరుతో అసైన్డ్ భూములను, ఎస్సీల భూములను చంద్రబాబు గుంజుకున్నారు. ఇంకా అమలులోకి రాని చట్టాన్ని ఆయన రద్దు చేస్తాడట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రధానితో చెప్పించగలరా.?. చంద్రబాబు మాటల్లో స్పష్టత లేదు. టైటిలింగ్ యాక్ట్ పై జరుగుతున్న దుష్ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.' అని మంత్రి పేర్కొన్నారు.

Also Read: Amit Shah: అందుకే మేం టీడీపీ, జనసేనతో కలిశాం, స్పష్టత ఇచ్చిన అమిత్ షా - పోలవరంపై కీలక ప్రకటన

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget