అన్వేషించండి

Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య

Agriculture Families In India: వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు రైతులను ఆకర్షిస్తున్నాయి. దిగుబడులు, లాభాలు పెంచుకునే టెక్నిక్స్‌ తెలుసుకుంటున్న ప్రజలు, మళ్లీ పొలం బాట పడుతున్నారు.

NABARD Rural Financial Survey: అన్నం పెట్టి ఆకలి తీర్చే వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తున్న రోజులివి. కూరగాయలు రోడ్డు మీద, కాళ్లకు వేసుకునే చెప్పులు ఏసీ షోరూమ్‌ల్లో కనిపిస్తున్న కాలమిది. పెరిగిన పారిశ్రామికీకరణతో వ్యవసాయాదరణ తగ్గిపోతోంది. కాల్వలు, చేలు, చెరువులు నివాస స్థలాలుగా రూపాంతరం చెందుతున్నాయి. పల్లె జనం కాడిని వదిలేసి పట్నం కాడికి వలసలు పోతున్నారు. "ఇప్పుడు ఈ మాత్రమైనా తిండి దొరుకుతోంది, భవిష్యత్‌ తరాలు మాత్రలతో ఆకలి తీర్చుకోవాల్సిందే" అనే మాటలు మనం అప్పుడప్పుడు వింటుంటాం. కాలంతో పాటు వ్యవసాయం కరిగి కనుమరుగవుతోందన్న బెంగతో చెప్పే మాటలివి. అయితే, ఈ మనోవేదనను మరిపించే తీపికబురును నాబార్డ్‌ (National Bank for Agriculture and Rural Development) చెప్పింది. 

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వ్యవసాయ కుటుంబాల సంఖ్య మళ్లీ పెరుగుతోందని నాబార్డ్‌ ప్రకటించింది. 'నాబార్డ్‌ రూరల్‌ ఫైనాన్షియల్‌ సర్వే'లో (NABARD Rural Financial Survey) ఈ విషయం వెల్లడైంది. 2016–17లో నాబార్డ్‌ చేపట్టిన రూరల్‌ ఫైనాన్సియల్‌ సర్వే ప్రకారం, దేశవ్యాప్తంగా 48 శాతం వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి. 2021–22లో చేపట్టిన సర్వే ప్రకారం ఆ సంఖ్య 57 శాతానికి పెరిగింది. అంటే, కేవలం 5 సంవత్సరాల్లో, దేశంలో వ్యవసాయం చేస్తున్న కుటుంబాల సంఖ్య 9 శాతం పెరిగింది. ట్రెండ్‌ను బట్టి చూస్తే, ఈ సంఖ్య కాలక్రమేణా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

వాతావరణ మార్పుల వల్ల హఠాత్తుగా వచ్చిన పడే కరవుకాటకాలు & వరదల తాకిడిని తట్టుకోలేక, ఒకప్పుడు, కర్షకులు కాడిని వదిలేశారు. ఇప్పుడు కూడా అవే ప్రతికూలతలు ఉన్నప్పటికీ... వ్యవసాయ రంగంలో వచ్చిన ఆధునిక సాంకేతికతలతో నష్టభయం తగ్గింది. కరవు, వరదలను తట్టుకునే మేలైన విత్తనాలు, చీడలను దరి చేరనివ్వని పురుగు మందులు, దిగుబడిని పెంచే బలం మందులు, ఇతర అధునాతన పంట యాజమాన్య పద్ధతులు గ్రామస్థాయికి కూడా చేరాయి. దీంతో, వదిలేసిన కాడిని తిరిగి భుజానికి ఎత్తుకుంటున్న కర్షక కుటుంబాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గ్రామాల్లో అత్యధిక కుటుంబాలు వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాయి. 

ఏపీలో ఐదేళ్లలో 19 శాతం వృద్ధి
నాబార్డ్‌ సర్వే ప్రకారం, 2016–17లో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ కుటుంబాలు 34 శాతం ఉన్నాయి. 2021–22 గణాంకాల ప్రకారం, మొత్తం కుటుంబాల్లో సగానికి పైగా, అంటే 53 శాతం కుటుంబాలు వ్యవసాయం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో, ఈ ఐదేళ్ల కాలంలో (2016–17 నుంచి 2021–22 వరకు) వ్యవసాయ కుటుంబాలు ఏకంగా 19 శాతం పెరిగాయి. తెలంగాణలో, మొత్తం 55 శాతం కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడ్డాయి. 

తొలి 2 స్థానాల్లో లద్దాఖ్‌, జమ్ముకశ్మీర్  
దేశంలో అత్యధికంగా, లద్దాఖ్‌లో 75 శాతం కుటుంబాలు, జమ్ముకశ్మీర్ 73 శాతం కుటుంబాలు వ్యవసాయం చేస్తున్నాయి. అత్యల్పంగా.. కేరళ, గోవా రాష్ట్రాల్లో కేవలం 18 శాతం కుటుంబాలు మాత్రమే అగ్రికల్చర్‌ ఫీల్డ్‌లో ఉన్నాయి. మొత్తంగా చూస్తే, తెలుగు రాష్ట్రాలతో కలిపి, దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 శాతానికి పైగా కుటుంబాలు పొలం బాటలో ఉన్నాయని నాబార్డ్‌ సర్వేలో వెల్లడైంది.

మరో ఆసక్తికర కథనం: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌              

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Stalin On Delimitation: జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయవద్దు, దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలని స్టాలిన్ పిలుపు
Stalin On Delimitation: జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయవద్దు, దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలని స్టాలిన్ పిలుపు
Shamila on Delimitation:  సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల
సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల
KTR in Chennai: డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
Fair Delimitation Meet In Chennai: డీలిమిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరు- స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం
డీలిమిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరు- స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Stalin On Delimitation: జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయవద్దు, దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలని స్టాలిన్ పిలుపు
Stalin On Delimitation: జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయవద్దు, దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలని స్టాలిన్ పిలుపు
Shamila on Delimitation:  సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల
సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల
KTR in Chennai: డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
Fair Delimitation Meet In Chennai: డీలిమిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరు- స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం
డీలిమిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరు- స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం
IPL 2025 Opening Ceremony: నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
బాయ్‌ఫ్రెండ్‌ను 300 ముక్కలుగా నరికి చంపిన నటి... సినిమాలను మించిన ట్విస్ట్‌లతో గూస్ బంప్స్ తెప్పించే రియల్ స్టోరీ
బాయ్‌ఫ్రెండ్‌ను 300 ముక్కలుగా నరికి చంపిన నటి... సినిమాలను మించిన ట్విస్ట్‌లతో గూస్ బంప్స్ తెప్పించే రియల్ స్టోరీ
UPI Payment: ఏప్రిల్ 1 నుంచి ఈ మొబైల్ నంబర్లలో UPI పని చేయదు, చెల్లింపులన్నీ బంద్‌
ఏప్రిల్ 1 నుంచి ఈ మొబైల్ నంబర్లలో UPI పని చేయదు, చెల్లింపులన్నీ బంద్‌
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Embed widget