అన్వేషించండి

Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య

Agriculture Families In India: వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు రైతులను ఆకర్షిస్తున్నాయి. దిగుబడులు, లాభాలు పెంచుకునే టెక్నిక్స్‌ తెలుసుకుంటున్న ప్రజలు, మళ్లీ పొలం బాట పడుతున్నారు.

NABARD Rural Financial Survey: అన్నం పెట్టి ఆకలి తీర్చే వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తున్న రోజులివి. కూరగాయలు రోడ్డు మీద, కాళ్లకు వేసుకునే చెప్పులు ఏసీ షోరూమ్‌ల్లో కనిపిస్తున్న కాలమిది. పెరిగిన పారిశ్రామికీకరణతో వ్యవసాయాదరణ తగ్గిపోతోంది. కాల్వలు, చేలు, చెరువులు నివాస స్థలాలుగా రూపాంతరం చెందుతున్నాయి. పల్లె జనం కాడిని వదిలేసి పట్నం కాడికి వలసలు పోతున్నారు. "ఇప్పుడు ఈ మాత్రమైనా తిండి దొరుకుతోంది, భవిష్యత్‌ తరాలు మాత్రలతో ఆకలి తీర్చుకోవాల్సిందే" అనే మాటలు మనం అప్పుడప్పుడు వింటుంటాం. కాలంతో పాటు వ్యవసాయం కరిగి కనుమరుగవుతోందన్న బెంగతో చెప్పే మాటలివి. అయితే, ఈ మనోవేదనను మరిపించే తీపికబురును నాబార్డ్‌ (National Bank for Agriculture and Rural Development) చెప్పింది. 

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వ్యవసాయ కుటుంబాల సంఖ్య మళ్లీ పెరుగుతోందని నాబార్డ్‌ ప్రకటించింది. 'నాబార్డ్‌ రూరల్‌ ఫైనాన్షియల్‌ సర్వే'లో (NABARD Rural Financial Survey) ఈ విషయం వెల్లడైంది. 2016–17లో నాబార్డ్‌ చేపట్టిన రూరల్‌ ఫైనాన్సియల్‌ సర్వే ప్రకారం, దేశవ్యాప్తంగా 48 శాతం వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి. 2021–22లో చేపట్టిన సర్వే ప్రకారం ఆ సంఖ్య 57 శాతానికి పెరిగింది. అంటే, కేవలం 5 సంవత్సరాల్లో, దేశంలో వ్యవసాయం చేస్తున్న కుటుంబాల సంఖ్య 9 శాతం పెరిగింది. ట్రెండ్‌ను బట్టి చూస్తే, ఈ సంఖ్య కాలక్రమేణా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

వాతావరణ మార్పుల వల్ల హఠాత్తుగా వచ్చిన పడే కరవుకాటకాలు & వరదల తాకిడిని తట్టుకోలేక, ఒకప్పుడు, కర్షకులు కాడిని వదిలేశారు. ఇప్పుడు కూడా అవే ప్రతికూలతలు ఉన్నప్పటికీ... వ్యవసాయ రంగంలో వచ్చిన ఆధునిక సాంకేతికతలతో నష్టభయం తగ్గింది. కరవు, వరదలను తట్టుకునే మేలైన విత్తనాలు, చీడలను దరి చేరనివ్వని పురుగు మందులు, దిగుబడిని పెంచే బలం మందులు, ఇతర అధునాతన పంట యాజమాన్య పద్ధతులు గ్రామస్థాయికి కూడా చేరాయి. దీంతో, వదిలేసిన కాడిని తిరిగి భుజానికి ఎత్తుకుంటున్న కర్షక కుటుంబాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గ్రామాల్లో అత్యధిక కుటుంబాలు వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాయి. 

ఏపీలో ఐదేళ్లలో 19 శాతం వృద్ధి
నాబార్డ్‌ సర్వే ప్రకారం, 2016–17లో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ కుటుంబాలు 34 శాతం ఉన్నాయి. 2021–22 గణాంకాల ప్రకారం, మొత్తం కుటుంబాల్లో సగానికి పైగా, అంటే 53 శాతం కుటుంబాలు వ్యవసాయం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో, ఈ ఐదేళ్ల కాలంలో (2016–17 నుంచి 2021–22 వరకు) వ్యవసాయ కుటుంబాలు ఏకంగా 19 శాతం పెరిగాయి. తెలంగాణలో, మొత్తం 55 శాతం కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడ్డాయి. 

తొలి 2 స్థానాల్లో లద్దాఖ్‌, జమ్ముకశ్మీర్  
దేశంలో అత్యధికంగా, లద్దాఖ్‌లో 75 శాతం కుటుంబాలు, జమ్ముకశ్మీర్ 73 శాతం కుటుంబాలు వ్యవసాయం చేస్తున్నాయి. అత్యల్పంగా.. కేరళ, గోవా రాష్ట్రాల్లో కేవలం 18 శాతం కుటుంబాలు మాత్రమే అగ్రికల్చర్‌ ఫీల్డ్‌లో ఉన్నాయి. మొత్తంగా చూస్తే, తెలుగు రాష్ట్రాలతో కలిపి, దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 శాతానికి పైగా కుటుంబాలు పొలం బాటలో ఉన్నాయని నాబార్డ్‌ సర్వేలో వెల్లడైంది.

మరో ఆసక్తికర కథనం: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌              

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget