అన్వేషించండి
NDA Meeting: మరోసారి ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోదీ - మద్దతు ప్రకటించిన చంద్రబాబు, నితీష్
PM Narendra Modi Oath On Saturday: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో బుధవారం నిర్వహించిన ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు, నితీష్ కుమార్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.

ఎన్డీయే సమావేశంలో నరేంద్ర మోదీ, చంద్రబాబు
1/7

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఎన్డీఏ నేతలు ఢిల్లీకి చేరుకుని సమావేశం అయ్యారు.
2/7

ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలతో కీలకంగా భేటీ అయ్యారు. గతంలోలాగ సొంత మెజార్టీ రానందున కూటమిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీష్ కుమార్కు డిమాండ్ పెరిగింది.
3/7

ఎన్డీయే కూటమి సమావేశంలో ప్రధాని మోదీ పక్క సీట్లో చంద్రబాబు కూర్చుకున్నారు. ఆయన పక్కనే నితీష్ కుమార్ ఉన్నారు.
4/7

కూటమి నేతలు నరేంద్ర మోదీని ఎన్డీయే పక్షనేతగా నిర్ణయించారు. మోదీని తమ అధినేతగా, ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించడంతో కూటమి నేతలు అందుకు మద్దతు తెలిపారు
5/7

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ కూటమి భాగస్వాములుగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ నేత నితీష్ కుమార్ తమ లేఖలు అందజేశారు.
6/7

ప్రధాని మోదీ నివాసంలో చంద్రబాబు, నితీష్ కుమార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్
7/7

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిసిన చంద్రబాబు నాయుడు
Published at : 05 Jun 2024 07:37 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
వరంగల్
హైదరాబాద్
తిరుపతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion