అన్వేషించండి

2025లో NCERT సిలబస్ లో భారీ మార్పులు.. మీరు ఈ విషయాలు తెలుసుకోండి

‎Year Ender 2025 | NCERT 2025 లో కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులు కేవలం చదవడం మాత్రమే కాకుండా.. ఆలోచించేలా, అర్థం చేసుకునేలా నేర్చుకోవాలని ప్లాన్ చేసింది.

‎Year Ender 2025 | ఈ సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. త్వరలో కొత్త విద్యా సంవత్సరం 2026 ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు NCERT ఈ సంవత్సరం పాఠ్యపుస్తకాలు, సిలబస్‌లో చేసిన ప్రధాన మార్పులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాస్తవానికి, కొత్త విద్యా విధానం (NEP 2020) అమలులోకి వచ్చిన తర్వాత భారతదేశ విద్యా వ్యవస్థలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు చదువు కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం కాదు. పిల్లలకు ఆచరణాత్మక జ్ఞానం, అభివృద్ధి, స్థానిక సంస్కృతి, చరిత్ర,  ఉపాధికి సంబంధించిన విద్యను అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

ఈ దిశలో, NCERT 2025 సంవత్సరంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులు కేవలం బట్టి పట్టే చదువు కాకుండా ఆలోచించడం, అర్థం చేసుకోవడం, జీవితంలో ఉపయోగపడే విషయాలను నేర్చుకోవడమే NCERT ప్రధాన లక్ష్యం. ఈ కారణంగా, సిలబస్‌ను సులభతరం చేశారు. పాత అధ్యాయాలను తొలగించారు. అనేక కొత్త, ఆసక్తికరమైన,  ఉపయోగకరమైన అంశాలను చేర్చారు. కాబట్టి 2025 సంవత్సరంలో NCERT సిలబస్‌లో చేసిన ప్రధాన మార్పులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

2025లో సిలబస్‌లో NCERT చేసిన ప్రధాన మార్పులు

NCERT 2025 ప్రారంభంలో చరిత్ర పుస్తకాలలో కొన్ని మార్పులు చేసింది. ఇందులో ఢిల్లీ సుల్తానులు, మొఘలాయిలు కాలానికి సంబంధించిన అనేక అధ్యాయాలను తొలగించారు. వాటిని కుదించి కొత్త రూపాన్ని ఇచ్చారు. ఇప్పుడు చరిత్ర పుస్తకాలలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాచీన భారతదేశ చరిత్ర, గిరిజన, తెగ సమాజాల సహకారం, భారతీయ శాస్త్రవేత్తలు, వారి రచనలు, భారతీయ సంస్కృతి, నాగరికత వంటి వాటిపై దృష్టి సారించారు. చరిత్రను బాగా అర్థం చేసుకోవడానికి, చరిత్రలో చీకటి యుగం అని పిలువబడే ఒక కొత్త భాగాన్ని చేర్చారు. అలాగే విద్యా సంవత్సరం 2025-26 నుండి 4, 5, 7, 8 తరగతుల కొత్త పుస్తకాలు విడుదల చేశారు. ఈ పుస్తకాలలో భాషను మునుపటి కంటే సరళంగా, మరింత ఆసక్తికరంగా మార్చారు. పాత కంటెంట్‌ను కొత్త, ఆధునిక విషయాలతో భర్తీ చేశారు. అనేక పుస్తకాల పేర్లను కూడా మార్చడం తెలిసిందే.

నైపుణ్యం ఆధారిత విద్యపై దృష్టి

కొత్త విద్యా విధానం ప్రకారం, ఇప్పుడు 6వ తరగతి నుంచి స్కిల్స్ ఆధారిత అంటే వృత్తిపరమైన విద్యను ప్రారంభించనున్నారు. దీని అర్థం ఏమిటంటే, విద్యార్థులు కేవలం పుస్తకాలు మాత్రమే చదవడం కాదు, వారు పని చేయడం, ప్రాజెక్ట్‌లు తయారు చేయడం, నైపుణ్యాలను ఈ దశ నుంచే నేర్చుకుంటారు. చదువును ఉపాధి, జీవితానికి అనుసంధానం చేస్తారు. ఇది విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, పని చేసే అలవాటును పెంపొందించడం, భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

దీనితో పాటు వోకల్ ఫర్ లోకల్.. ఆత్మనిర్భర్ భారత్ ఆలోచనను ప్రోత్సహించడానికి, NCERT పుస్తకాలలో స్వదేశీ మాడ్యూల్‌ను చేర్చింది. NCERT 3వ తరగతి నుండి 12 తరగతుల విద్యార్థుల కోసం ఆపరేషన్ సిందూర్ పై 2 ప్రత్యేక మాడ్యూల్స్‌ను ప్రారంభించింది. కొత్త, పాత సిలబస్‌ల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడానికి, NCERT బ్రిడ్జ్ కోర్సులను సైతం ప్రారంభించింది. NCERT 4వ తరగతి, 5, 7, 8 తరగతుల పుస్తకాలను పూర్తిగా అప్‌డేట్ చేసింది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Embed widget