అన్వేషించండి

2025లో NCERT సిలబస్ లో భారీ మార్పులు.. మీరు ఈ విషయాలు తెలుసుకోండి

‎Year Ender 2025 | NCERT 2025 లో కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులు కేవలం చదవడం మాత్రమే కాకుండా.. ఆలోచించేలా, అర్థం చేసుకునేలా నేర్చుకోవాలని ప్లాన్ చేసింది.

‎Year Ender 2025 | ఈ సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. త్వరలో కొత్త విద్యా సంవత్సరం 2026 ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు NCERT ఈ సంవత్సరం పాఠ్యపుస్తకాలు, సిలబస్‌లో చేసిన ప్రధాన మార్పులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాస్తవానికి, కొత్త విద్యా విధానం (NEP 2020) అమలులోకి వచ్చిన తర్వాత భారతదేశ విద్యా వ్యవస్థలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు చదువు కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం కాదు. పిల్లలకు ఆచరణాత్మక జ్ఞానం, అభివృద్ధి, స్థానిక సంస్కృతి, చరిత్ర,  ఉపాధికి సంబంధించిన విద్యను అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

ఈ దిశలో, NCERT 2025 సంవత్సరంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులు కేవలం బట్టి పట్టే చదువు కాకుండా ఆలోచించడం, అర్థం చేసుకోవడం, జీవితంలో ఉపయోగపడే విషయాలను నేర్చుకోవడమే NCERT ప్రధాన లక్ష్యం. ఈ కారణంగా, సిలబస్‌ను సులభతరం చేశారు. పాత అధ్యాయాలను తొలగించారు. అనేక కొత్త, ఆసక్తికరమైన,  ఉపయోగకరమైన అంశాలను చేర్చారు. కాబట్టి 2025 సంవత్సరంలో NCERT సిలబస్‌లో చేసిన ప్రధాన మార్పులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

2025లో సిలబస్‌లో NCERT చేసిన ప్రధాన మార్పులు

NCERT 2025 ప్రారంభంలో చరిత్ర పుస్తకాలలో కొన్ని మార్పులు చేసింది. ఇందులో ఢిల్లీ సుల్తానులు, మొఘలాయిలు కాలానికి సంబంధించిన అనేక అధ్యాయాలను తొలగించారు. వాటిని కుదించి కొత్త రూపాన్ని ఇచ్చారు. ఇప్పుడు చరిత్ర పుస్తకాలలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాచీన భారతదేశ చరిత్ర, గిరిజన, తెగ సమాజాల సహకారం, భారతీయ శాస్త్రవేత్తలు, వారి రచనలు, భారతీయ సంస్కృతి, నాగరికత వంటి వాటిపై దృష్టి సారించారు. చరిత్రను బాగా అర్థం చేసుకోవడానికి, చరిత్రలో చీకటి యుగం అని పిలువబడే ఒక కొత్త భాగాన్ని చేర్చారు. అలాగే విద్యా సంవత్సరం 2025-26 నుండి 4, 5, 7, 8 తరగతుల కొత్త పుస్తకాలు విడుదల చేశారు. ఈ పుస్తకాలలో భాషను మునుపటి కంటే సరళంగా, మరింత ఆసక్తికరంగా మార్చారు. పాత కంటెంట్‌ను కొత్త, ఆధునిక విషయాలతో భర్తీ చేశారు. అనేక పుస్తకాల పేర్లను కూడా మార్చడం తెలిసిందే.

నైపుణ్యం ఆధారిత విద్యపై దృష్టి

కొత్త విద్యా విధానం ప్రకారం, ఇప్పుడు 6వ తరగతి నుంచి స్కిల్స్ ఆధారిత అంటే వృత్తిపరమైన విద్యను ప్రారంభించనున్నారు. దీని అర్థం ఏమిటంటే, విద్యార్థులు కేవలం పుస్తకాలు మాత్రమే చదవడం కాదు, వారు పని చేయడం, ప్రాజెక్ట్‌లు తయారు చేయడం, నైపుణ్యాలను ఈ దశ నుంచే నేర్చుకుంటారు. చదువును ఉపాధి, జీవితానికి అనుసంధానం చేస్తారు. ఇది విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, పని చేసే అలవాటును పెంపొందించడం, భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

దీనితో పాటు వోకల్ ఫర్ లోకల్.. ఆత్మనిర్భర్ భారత్ ఆలోచనను ప్రోత్సహించడానికి, NCERT పుస్తకాలలో స్వదేశీ మాడ్యూల్‌ను చేర్చింది. NCERT 3వ తరగతి నుండి 12 తరగతుల విద్యార్థుల కోసం ఆపరేషన్ సిందూర్ పై 2 ప్రత్యేక మాడ్యూల్స్‌ను ప్రారంభించింది. కొత్త, పాత సిలబస్‌ల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడానికి, NCERT బ్రిడ్జ్ కోర్సులను సైతం ప్రారంభించింది. NCERT 4వ తరగతి, 5, 7, 8 తరగతుల పుస్తకాలను పూర్తిగా అప్‌డేట్ చేసింది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget