అన్వేషించండి

CBSE Board Exam 2026: 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్! పరీక్షల విధానంలో సీబీఎస్ఈ భారీ మార్పులు

CBSE 10th Exam Pattern | సిబిఎస్ఈ 2026 పదో తరగతి పరీక్షల్లో సైన్స్, సోషల్ ప్రశ్నపత్రాలను విభజించింది. సమాధానాలు రాయడానికి విద్యార్థులకు కీలక సూచనలు చేసింది.

CBSE 10th Exams 2026 |సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026లో జరగనున్న 10వ తరగతి బోర్డు పరీక్షలకు సంబంధించి ఒక పెద్ద మార్పు చేసింది.  ఈ విషయంలో అన్ని అనుబంధ పాఠశాలలకు సీబీఎస్‌ఈ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రత్యేకంగా సైన్స్ (Science), సోషల్ (Social) పరీక్షలకు సంబంధించి మార్పు చేశారు. ఈ మార్పుల లక్ష్యం పరీక్ష ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించడం. సమాధాన పత్రాల మూల్యాంకనంలో జరిగే తప్పులను నివారించడం అని పేర్కొంది.

CBSE ప్రకారం, 10వ తరగతి సైన్స్ ప్రశ్న పత్రాన్ని ఇప్పుడు 3 స్పష్టమైన విభాగాలలో విభజిస్తారు. ఇందులో జీవశాస్త్రం, రసాయన శాస్త్రం , భౌతిక శాస్త్రాలకు వేర్వేరు విభాగాలు ఉంటాయి. అదేవిధంగా సోషల్ ప్రశ్నాపత్రం నాలుగు భాగాలుగా ఉంటుంది. ఇందులో చరిత్ర, భూగోళ శాస్త్రం, పాలిటీ, ఆర్థశాస్త్రాలను వేర్వేరు విభాగాలలో ఉంచుతారు. ఈ కొత్త విధానం 2026 బోర్డు పరీక్షల నుండి అమలులోకి వస్తుందని CBSE బోర్డు స్పష్టం చేసింది.

దాంతో ఏం జరుగుతుంది..

సమాధానాలు ఎలా రాయాలనే దానిపై విద్యార్థులకు సీబీఎస్ఈ ముఖ్యమైన సూచనలు చేసింది. విద్యార్థులు తమ సమాధాన పత్రాన్ని సైన్స్ కోసం 3 భాగాలుగా, సోషల్ సబ్జెక్ట్ కోసం నాలుగు భాగాలుగా విభజించాలి. ప్రతి విభాగంలోని సమాధానాలను ఆ విభాగం కోసం నిర్ణయించిన స్థలంలోనే రాయాలి. ఒక విద్యార్థి ఒక విభాగంలోని సమాధానాన్ని మరొక విభాగంలో రాసినా లేదా వేర్వేరు విభాగాల సమాధానాలను కలిపినా, అటువంటి సమాధానాలను మూల్యాంకనం చేయరని, వాటికి ఎటువంటి మార్కులు ఇవ్వరని CBSE తెలిపింది.

పరీక్షా ఫలితాలు ప్రకటించిన తర్వాత కూడా ధృవీకరణ లేదా పునఃమూల్యాంకనం సమయంలో కూడా ఇటువంటి తప్పులను అంగీకరించేదిలేదని CBSE సర్క్యులర్‌లో పేర్కొంది. అంటే సమాధానం తప్పు విభాగంలో రాస్తే, దానిని తర్వాత సరిదిద్దడానికి ఎలాంటి అవకాశం ఉండదని బోర్డు స్పష్టం చేసింది. ఇది విద్యార్థులలో క్రమశిక్షణను పెంచుతుందని, తనిఖీ ప్రక్రియను, మూల్యాంకనాన్ని మరింత సులభతరం చేస్తుందని బోర్డు భావిస్తోంది.

విద్యార్థులు, స్కూల్స్‌కు బోర్డు ముఖ్య సూచనలు

స్కూల్స్ ఈ కొత్త పరీక్షా విధానంతో విద్యార్థులను ముందుగానే పరిచయం చేయాలని CBSE బోర్డు సూచించింది. బోర్డు పరీక్ష సమయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, చదువుతున్నప్పుడే విద్యార్థులకు విభాగాల వారీగా సమాధానాలు రాసేలా చూడాలని పాఠశాలలను కోరారు. దీనితో పాటు, తాజా నమూనా ప్రశ్నా పత్రాలను తప్పనిసరిగా చూడాలని CBSE విద్యార్థులకు సూచించింది.

నమూనా పత్రాలు టెన్త్ ఎగ్జామ్స్ ప్రశ్నా పత్రం ఫార్మాట్, విభాగాల సంఖ్య, ప్రశ్నల రకాలు, మార్కుల విభజనను అర్థం చేసుకోవడానికి విద్యార్థులకు సహాయపడతాయని CBSE తాజా ప్రకటనలో తెలిపింది. నమూనా పత్రంతో పాటు జారీ చేసిన మార్కింగ్ స్కీమ్‌ను చూడటం ద్వారా, సమాధానాలను ఎలా రాయడం ద్వారా పూర్తి మార్కులు పొందవచ్చో కూడా విద్యార్థులు తెలుసుకోవచ్చు. సరైన సమాచారం కోసం CBSE అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని విద్యార్థులకు బోర్డు సూచించింది.

Also Read: Patanjali: ఆధునిక విద్యతో భారతదేశ జ్ఞాన సంప్రదాయాలు మిళితం - భారతీయ శిక్షాబోర్డు చైర్మన్ ఎన్‌పీ సింగ్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Arjuna Ranatunga: వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Advertisement

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Arjuna Ranatunga: వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Axar Patel Ruled Out : భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
Embed widget