అన్వేషించండి

NEET Row: UPSC పరీక్షా వ్యవస్థలో కీలక మార్పులు, ఇకపై అభ్యర్థులకు ఫేషియల్ రికగ్నిషన్‌ తప్పనిసరి!

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం వల్ల UPSC ఎగ్జామ్ సిస్టమ్‌లో కీలక మార్పులకు సిద్ధమవుతోంది.

NEET Paper Leak Case: నీట్‌ పేపర్ లీక్‌ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పరీక్ష నిర్వహణలో ఎన్నో లోపాలున్నాయని ఇటీవల సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రీఎగ్జామ్‌ అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే...పరీక్షా వ్యవస్థలో లోపాలున్నాయన్న విమర్శలు వెల్లువెత్తడం వల్ల ఎగ్జామ్ సిస్టమ్‌లో సంస్కరణలు చేసేందుకు UPSC సిద్ధమవుతోంది. ఇటీవలి కాలంలో ఎగ్జామ్‌ పేపర్‌ లీక్‌లు, మాల్‌ప్రాక్టీస్‌లు పెరుగుతుండడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తిగా డిజిటల్ టెక్నాలజీతో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించుకుంది. అభ్యర్థులకు ఆధార్ అథెంటికేషన్‌, ఫింగర్‌ప్రింట్ తీసుకోవడం, ఫేషియల్ రికగ్నిషన్‌ లాంటి చర్యలతో ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని భావిస్తోంది. సీసీ కెమెరాలో నిఘా పెంచడం, అందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ని వినియోగించడం, ఇ-అడ్మిట్ కార్డ్‌లపై QR కోడ్ స్కానింగ్ పెట్టడం లాంటి చర్యలు తీసుకోనున్నారు. ఎగ్జామ్ నిర్వహించిన సమయంలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ఈ ఏర్పాట్లు చేయనుంది.

ఏటా USPC 14 పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో  Civil Services Examination (CSE) కూడా ఉంది. వీటితో పాటు ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు, ఇంటర్వ్యూలనూ నిర్వహిస్తోంది UPSC. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టెక్నాలజీ అందించేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను (PSU) బిడ్స్‌కి ఆహ్వానించింది. ఏటా రూ.100 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలు మాత్రమే బిడ్ వేయాలని టెండర్‌లో UPSC స్పష్టం చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్, ఎగ్జామ్ సెంటర్‌తో పాటు ఎంత మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారన్న వివరాలు ఎగ్జామ్‌కి సరిగ్గా రెండు మూడు వారాల క్రితమే UPSC ఆయా సర్వీస్‌ ప్రొవైడర్‌లకు అందచేస్తుంది. ఇటీవల వెల్లడించిన తీర్పులో సుప్రీంకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. NEET ఎగ్జామ్ నిర్వహణలో తలెత్తిన అవకతవకలను ప్రస్తావిస్తూ మండి పడింది. ఈ లీక్‌ వల్ల దాదాపు 150 మంది విద్యార్థులు లబ్ధి పొందారని స్పష్టం చేసిన కోర్టు ఇంకా CBI విచారణ పూర్తవలేదన్న విషయాన్ని ప్రస్తావించింది. పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, అందుకు సంబంధించిన ఆధారాలు చూపించడంలో విఫలమవుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సర్వోన్నత న్యాయస్థానం. నిబంధనలు ఉల్లంఘించి పక్కా ప్రణాళికతో క్వశ్చన్ పేపర్‌ లీక్ చేశారనని బలపరిచేలా ఆధారాలు సమర్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఇక పుణేలో ఓ ట్రైనీ IAS పూజా ఖేడ్కర్ వైఖరి దేశవ్యాప్తంగా పెద్ద డిబేట్‌కి తెర తీసింది. పైగా ఆమె తప్పుడు ధ్రువపత్రాలు చూపించి రిక్రూట్ అయినట్టు విచారణలో తేలింది. పూజాపై క్రిమినల్ కేసు పెట్టిన యూపీఎస్‌సీ భవిష్యత్‌లో ఆమె ఎప్పుడూ ఎగ్జామ్ రాయకుండా ఆంక్షలు విధించింది. షో కాజ్‌ నోటీసులు కూడా ఇచ్చింది. ట్రైనింగ్‌లో ఉండగానే జులుం చెలాయించింది పూజా ఖేడ్కర్. ప్రైవేట్ ఆడీ కార్‌కి బ్లూ అండ్ వైట్ లైట్‌ పెట్టించింది. VIP స్టికర్‌ పెట్టి హల్‌చల్ చేసింది. ఇవన్నీ గమనించిన పై అధికారులు ఆమెపై బదిలీ వేటు వేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. 

Also Read: Viral News: రైల్వే ట్రాక్‌పైకి వచ్చిన సింహాలను ఢీకొట్టిన ట్రైన్, తీవ్ర గాయాలతో విలవిల

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget