అన్వేషించండి

NEET Row: UPSC పరీక్షా వ్యవస్థలో కీలక మార్పులు, ఇకపై అభ్యర్థులకు ఫేషియల్ రికగ్నిషన్‌ తప్పనిసరి!

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం వల్ల UPSC ఎగ్జామ్ సిస్టమ్‌లో కీలక మార్పులకు సిద్ధమవుతోంది.

NEET Paper Leak Case: నీట్‌ పేపర్ లీక్‌ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పరీక్ష నిర్వహణలో ఎన్నో లోపాలున్నాయని ఇటీవల సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రీఎగ్జామ్‌ అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే...పరీక్షా వ్యవస్థలో లోపాలున్నాయన్న విమర్శలు వెల్లువెత్తడం వల్ల ఎగ్జామ్ సిస్టమ్‌లో సంస్కరణలు చేసేందుకు UPSC సిద్ధమవుతోంది. ఇటీవలి కాలంలో ఎగ్జామ్‌ పేపర్‌ లీక్‌లు, మాల్‌ప్రాక్టీస్‌లు పెరుగుతుండడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తిగా డిజిటల్ టెక్నాలజీతో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించుకుంది. అభ్యర్థులకు ఆధార్ అథెంటికేషన్‌, ఫింగర్‌ప్రింట్ తీసుకోవడం, ఫేషియల్ రికగ్నిషన్‌ లాంటి చర్యలతో ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని భావిస్తోంది. సీసీ కెమెరాలో నిఘా పెంచడం, అందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ని వినియోగించడం, ఇ-అడ్మిట్ కార్డ్‌లపై QR కోడ్ స్కానింగ్ పెట్టడం లాంటి చర్యలు తీసుకోనున్నారు. ఎగ్జామ్ నిర్వహించిన సమయంలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ఈ ఏర్పాట్లు చేయనుంది.

ఏటా USPC 14 పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో  Civil Services Examination (CSE) కూడా ఉంది. వీటితో పాటు ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు, ఇంటర్వ్యూలనూ నిర్వహిస్తోంది UPSC. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టెక్నాలజీ అందించేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను (PSU) బిడ్స్‌కి ఆహ్వానించింది. ఏటా రూ.100 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలు మాత్రమే బిడ్ వేయాలని టెండర్‌లో UPSC స్పష్టం చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్, ఎగ్జామ్ సెంటర్‌తో పాటు ఎంత మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారన్న వివరాలు ఎగ్జామ్‌కి సరిగ్గా రెండు మూడు వారాల క్రితమే UPSC ఆయా సర్వీస్‌ ప్రొవైడర్‌లకు అందచేస్తుంది. ఇటీవల వెల్లడించిన తీర్పులో సుప్రీంకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. NEET ఎగ్జామ్ నిర్వహణలో తలెత్తిన అవకతవకలను ప్రస్తావిస్తూ మండి పడింది. ఈ లీక్‌ వల్ల దాదాపు 150 మంది విద్యార్థులు లబ్ధి పొందారని స్పష్టం చేసిన కోర్టు ఇంకా CBI విచారణ పూర్తవలేదన్న విషయాన్ని ప్రస్తావించింది. పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, అందుకు సంబంధించిన ఆధారాలు చూపించడంలో విఫలమవుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సర్వోన్నత న్యాయస్థానం. నిబంధనలు ఉల్లంఘించి పక్కా ప్రణాళికతో క్వశ్చన్ పేపర్‌ లీక్ చేశారనని బలపరిచేలా ఆధారాలు సమర్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఇక పుణేలో ఓ ట్రైనీ IAS పూజా ఖేడ్కర్ వైఖరి దేశవ్యాప్తంగా పెద్ద డిబేట్‌కి తెర తీసింది. పైగా ఆమె తప్పుడు ధ్రువపత్రాలు చూపించి రిక్రూట్ అయినట్టు విచారణలో తేలింది. పూజాపై క్రిమినల్ కేసు పెట్టిన యూపీఎస్‌సీ భవిష్యత్‌లో ఆమె ఎప్పుడూ ఎగ్జామ్ రాయకుండా ఆంక్షలు విధించింది. షో కాజ్‌ నోటీసులు కూడా ఇచ్చింది. ట్రైనింగ్‌లో ఉండగానే జులుం చెలాయించింది పూజా ఖేడ్కర్. ప్రైవేట్ ఆడీ కార్‌కి బ్లూ అండ్ వైట్ లైట్‌ పెట్టించింది. VIP స్టికర్‌ పెట్టి హల్‌చల్ చేసింది. ఇవన్నీ గమనించిన పై అధికారులు ఆమెపై బదిలీ వేటు వేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. 

Also Read: Viral News: రైల్వే ట్రాక్‌పైకి వచ్చిన సింహాలను ఢీకొట్టిన ట్రైన్, తీవ్ర గాయాలతో విలవిల

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget