అన్వేషించండి

Degree Admissions: 'దోస్త్‌' అడ్మిషన్ల వివరాలు వెల్లడి, డిగ్రీలో 52% అమ్మాయిలే - బీకామ్ కోర్సు వైపే యువత మొగ్గు!

DOST Admissions: తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'దోస్త్-2023' సీట్ల కేటాయింపు పూర్తయింది. డిగ్రీలో మొత్తం 3.88 లక్షల సీట్లకుగాను.. 2,04,674 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.

DOST Degree Admissions 2023-24: తెలంగాణలోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'దోస్త్-2023' సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లు 2 లక్షల మార్కును దాటాయి. ఇక ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 50 వేలకు పైగా అడ్మిషన్లు నమోదుకావడం విశేషం. అన్ని దశల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత డిగ్రీలో మొత్తం 3.88 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. ఇప్పటివరకు 2,04,674 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 1.84 లక్షల సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు కళాశాలలతో పోల్చితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో కనీసం 50 శాతం సీట్లు కూడా భర్తీ కాకపోవడం గమనార్హం. గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అన్ని సొసైటీల పరిధిలో మొత్తం 78 గురుకుల డిగ్రీ కళాశాలల్లో 21,254 సీట్లు ఉన్నాయి. వాటిలో సగం కూడా భర్తీ కాలేదు.

బీకామ్ వైపే మొగ్గు..
రాష్ట్రంలో డిగ్రీలో బీకాం కోర్సు చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. మొదటి విడత కౌన్సెలింగ్ నుంచే అత్యధిక విద్యార్థులు బీకామ్ వైపే మొగ్గుచూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుత విద్యాసంవత్సరం బీకామ్ కోర్సులో 85,153 మంది విద్యార్థులు దోస్త్-2023 ద్వారా ప్రవేశాలు పొందారు. అంటే మొత్తం కోర్సులతో పోల్చితే బీకాం వాటా 41.60 శాతం. బీకాం తర్వాత బీఎస్సీ లైఫ్‌సైన్సెస్ కోర్సులకు రెండవ ప్రాధాన్యం లభించింది. ఈ కోర్సుల్లో 43,180 మంది విద్యార్థులు చేరారు. ఇక కొత్తగా ప్రవేశపెట్టిన స్కిల్ సెక్టార్ కోర్సుల్లో 1,398 మంది, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆనర్స్‌లో 889 మంది విద్యార్థులు సీట్లు పొందారు. 

ప్రవేశాల్లో అమ్మాయిల జోరు..
డిగ్రీ కళాశాలల ప్రవేశాల్లో అమ్మాయిలే అగ్రస్థానంలో నిలిచారు. ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల డిగ్రీ కళాశాలల్లో కలిపి మొత్తం 2,04,674 మంది ప్రవేశాలు పొందితే ఇందులో 96,524 మంద అబ్బాయిలు ఉండగా.. 1,08,150 మంది అమ్మాయిలు ఉన్నారు. తెలంగాణకు పొరుగు రాష్టాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మొదలైన రాష్ట్రాల నలుమూలల నుండి విద్యార్థులు దోస్త్ అడ్మిషన్‌లలో వివిధ డిగ్రీ కోర్సుల్లో విద్యార్థులు చేరుతుండటాన్ని గర్విస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శుక్రవారం (నవంబరు 17) ఒక ప్రకటనలో తెలిపారు.

➥ ప్రభుత్వ కాలేజీల్లోనే అధికంగా సీట్ల భర్తీ

➥ కోర్సుల్లో బీకామ్‌లోనే ఎక్కువ ప్రవేశాలు

➥ ఇతర రాష్ట్రాల విద్యార్థులకూ ప్రవేశాలు

యాజమాన్యాల వారీగా సీట్ల భర్తీని పరిశీలిస్తే.. ప్రభుత్వ కాలేజీల్లోనే అధికంగా సీట్లు భర్తీ అయ్యాయి. ఇటీవలే డిగ్రీ ఫస్టియర్‌ అడ్మిషన్ల ప్రక్రియ ముగియగా, ఆయా వివరాలను ఉన్నత విద్యామండలి (చైర్మన్‌) ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి శుక్రవారం విడుదల చేశారు. ఆయా వివరాలిలా ఉన్నాయి.

కళాశాలలవారీగా ప్రవేశాలు ఇలా..

యాజమాన్యం కాలేజీల సంఖ్య సీట్ల సంఖ్య చేరిన విద్యార్థులు (శాతం)
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 155 87,112  53,886 (61.86)
ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 831 2,80,683 1,41,772 (50.50)
గురుకుల డిగ్రీ కళాశాలలు 78 21,254 9,016 (42.42)

కోర్సుల వారీగా ప్రవేశాల వివరాలు..

కోర్సు సీట్ల వివరాలు
బీఏ  29,752
బీబీఏ  15,160
బీబీఎం  107
బీకాం  85,153
బీఎస్సీ లైఫ్ సైన్సె స్   43,180
బీఎస్సీ ఫిజికల్ సైన్స్   25,937
బీఎస్‌డబ్ల్యు   56
బి.ఒకేషనల్   28
డిప్లొమా  595
మొత్తం   20,4674

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget