అన్వేషించండి

Dussehra Holidays: స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులు ఖరారు, ఎన్నిరోజులంటే? ఏపీలో ఇలా!

తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని బడులకు, జూనియర్ కాలేజీలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది.

తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని బడులకు, జూనియర్ కాలేజీలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అక్టోబరు 13 నుంచి 25 వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లు ఈ సెలవులను పాటించాలని సూచించింది. ఇక రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ కాలేజీలకు మాత్రం 7 రోజులపాటు సెలవులు ఇవ్వనున్నారు. అక్టోబరు 19 నుంచి 25 వరకు సెలవులివ్వాలని విద్యాశాఖ పేర్కొంది.

ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు కలిపి మొత్తం 13 రోజులు పాటు సెలవులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ 2022-23లో దసరా సెలవులకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ ముందుగానే ప్రకటించింది. తెలంగాణలో దసరా సెలవులు 2022లో 14 రోజులు ఉండగా..2023లో మాత్రం 13 రోజులే ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 25 వరకు బతుకమ్మ, దసరా సెలవులు ఉండనున్నాయి. తిరిగి అక్టోబర్ 26న పాఠశాలల తెరుచుకోనున్నాయి. తెలంగాణలో స్కూళ్లకు సంబంధించిన 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌లో ఈ సెలవుల పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ పొందిపరిచింది.

ఏపీలో 11 రోజుల దసరా సెలవులు..
ఏపీలోని పాఠశాలలకు ఈ సారి 11 రోజులపాటు దసరా సెలవులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌కు అక్టోబరు 14 నుంచి 24 వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఇక ఏపీలోని ఇంటర్ కాలేజీలకు కూడా తెలంగాణ మాదిరిగా.. అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.

ALSO READ:

ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు అవకాశం
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థుల కోసం నిర్దేశించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. డిసెంబరు 10న జరిగే పరీక్షకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అర్హులని, రెసిడెన్షియల్‌ విధానంలో చదువుతున్న వారికి అర్హత లేదని తెలిపారు. ఈసారి తొలిసారిగా ఎస్టీ రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచుతున్నామని వెల్లడించారు. దానివల్ల స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యే ఎస్టీ అభ్యర్థుల సంఖ్య పెరుగుతుందన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో మార్పులు, కొత్తగా 'స్కిల్' సబ్జెక్ట్ పరీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో సీబీఎస్‌ఈ గుర్తింపు ఉన్న వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9వ తరగతులకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు నిర్వహిస్తూ వస్తున్న ఫార్మాటివ్, సమ్మేటివ్ పరీక్షలను.. పీరియాడిక్, టర్మ్ పరీక్షలుగా మార్చింది. పీరియాడిక్ రాత పరీక్ష (పీడబ్ల్యూటీ)-2 అక్టోబరు 6 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. సీబీఎస్ఈ గుర్తింపు పొందిన ప్రభుత్వ స్కూళ్లలో ఈ కొత్త పరీక్షల విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ కొత్త విధానంలో మొత్తం నాలుగు పీడబ్ల్యూటీలు, రెండు టర్మ్ పరీక్షలు ఉంటాయి. టర్మ్-1 నవంబరులో, టర్మ్-2 పరీక్షలను మార్చిలో నిర్వహిస్తారు. టర్మ్ పరీక్షలో 80 మార్కులకు రాతపరీక్షలు, 20 మార్కులకు అంతర్గత పరీక్షలు నిర్వహిస్తారు. పీడబ్ల్యూటీలో 40 మార్కులకు రాతపరీక్షలు, 10 మార్కులకు అంతర్గత పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vantara Case: వంతారాలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదు - సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
వంతారాలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదు - సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
TTD Key Decisions: ఏపీలో 1000 ఆలయాలు నిర్మాణం సహా బ్రహ్మోత్సవాలపై టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఏపీలో 1000 ఆలయాలు నిర్మాణం సహా బ్రహ్మోత్సవాలపై టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
Telangana Group 1 Jobs: పిల్లల మీద పాలిటిక్స్ వద్దు, రూ.3 కోట్లు ఇచ్చారన్న ఆరోపణలు నిరూపించండి- గ్రూప్ 1 విజేత తండ్రి ఛాలెంజ్
పిల్లల మీద పాలిటిక్స్ వద్దు, రూ.3 కోట్లు ఇచ్చారన్న ఆరోపణలు నిరూపించండి- గ్రూప్ 1 విజేత తండ్రి ఛాలెంజ్
RGVపై మరోసారి కేసు నమోదు.. తన గౌరవాన్ని భంగం కలిగించారని విశ్రాంత మహిళా ఐపీఎస్ ఫిర్యాదు
RGVపై మరోసారి కేసు నమోదు.. తన గౌరవాన్ని భంగం కలిగించారని విశ్రాంత మహిళా ఐపీఎస్ ఫిర్యాదు
Advertisement

వీడియోలు

India Pakistan Match Asia Cup 2025 | సెప్టెంబర్ 21న మళ్లీ భారత్, పాకిస్తాన్ మ్యాచ్!
ICC Award to Mohammad Siraj | సిరాజ్‌కి ఐసీసీ అవార్డ్
IND vs PAK Asia Cup 2025 | షేక్ హ్యాండ్ కాంట్రవర్సీలో పాక్‌కి షాకిచ్చిన ఐసీసీ
SL vs HK Match Asia Cup 2025 | 11 క్యాచ్ లు వదిలి మ్యాచ్ ఓడిపోయిన హాంగ్ కాంగ్
Mizoram Lifestyle Exploring Telugu Vlog | మిజోరం లైఫ్ స్టైల్ ఒక్కరోజులో చూసేద్దాం రండి.! | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vantara Case: వంతారాలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదు - సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
వంతారాలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదు - సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
TTD Key Decisions: ఏపీలో 1000 ఆలయాలు నిర్మాణం సహా బ్రహ్మోత్సవాలపై టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఏపీలో 1000 ఆలయాలు నిర్మాణం సహా బ్రహ్మోత్సవాలపై టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
Telangana Group 1 Jobs: పిల్లల మీద పాలిటిక్స్ వద్దు, రూ.3 కోట్లు ఇచ్చారన్న ఆరోపణలు నిరూపించండి- గ్రూప్ 1 విజేత తండ్రి ఛాలెంజ్
పిల్లల మీద పాలిటిక్స్ వద్దు, రూ.3 కోట్లు ఇచ్చారన్న ఆరోపణలు నిరూపించండి- గ్రూప్ 1 విజేత తండ్రి ఛాలెంజ్
RGVపై మరోసారి కేసు నమోదు.. తన గౌరవాన్ని భంగం కలిగించారని విశ్రాంత మహిళా ఐపీఎస్ ఫిర్యాదు
RGVపై మరోసారి కేసు నమోదు.. తన గౌరవాన్ని భంగం కలిగించారని విశ్రాంత మహిళా ఐపీఎస్ ఫిర్యాదు
5 Star Safety Cars: ధర ₹10 లక్షల లోపే - అన్నీ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ గెలుచుకున్న టాప్‌ కార్లు, పూర్తి లిస్ట్
₹10 లక్షల్లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ సాధించిన కార్ల లిస్ట్‌ ఇదిగో
Chittoor Crime News: అల్లరి చేస్తోందని విద్యార్థిని తల పగలగొట్టిన టీచర్‌.. చిత్తూరులో దారుణం
అల్లరి చేస్తోందని విద్యార్థిని తల పగలగొట్టిన టీచర్‌.. చిత్తూరులో దారుణం
Actor Sandy Master: కిష్కింధపురి విలన్ ఎవరో తెలుసా? 600 కోట్ల కొల్లగొట్టిన మూవీలో నటుడు... కళ్యాణీ ప్రియదర్శన్‌ 'లోక'లోనూ!
కిష్కింధపురి విలన్ ఎవరో తెలుసా? 600 కోట్ల కొల్లగొట్టిన మూవీలో నటుడు... కళ్యాణీ ప్రియదర్శన్‌ 'లోక'లోనూ!
Cheapest Cruise Control Cars: కేవలం ₹7.40 లక్షల నుంచే క్రూజ్ కంట్రోల్ కార్లు - యూత్‌ కోసం టాప్-5 లిస్ట్
కేవలం ₹7.40 లక్షల నుంచే అందుబాటులో క్రూజ్ కంట్రోల్ కార్లు - ఫుల్‌ లిస్ట్
Embed widget