అన్వేషించండి

TS EAMCET: నేడు తెలంగాణ ఎంసెట్‌-2023 షెడ్యూలు వెల్లడి!

ఫిబ్రవరి 24న ఎంసెట్ షెడ్యూలు విడుదల కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి, జేఎన్‌టీయూ హైదరాబాద్ వీసీ నర్సింహారెడ్డి ఎంసెట్ షెడ్యూలును విడుదల చేయనున్నారు.

తెలంగాణలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాల్లో ప్రవేశాలకు నిర్దేశించిన టీఎస్‌ ఎంసెట్‌ షెడ్యూలు ఫిబ్రవరి 24న విడుదల కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి, జేఎన్‌టీయూ హైదరాబాద్ వీసీ నర్సింహారెడ్డి ఎంసెట్ షెడ్యూలును విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11 వరకు ఇంజినీరింగ్‌ విద్యార్థులకు; మే 12 నుంచి 14 వరకు అగ్రికల్చర్‌, ఫార్మసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

అయితే ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ అమలు, దరఖాస్తుకు కనీసం 45 శాతం మార్కులొచ్చి ఉండాలన్న నిబంధనలను సడలించడమా.. లేదా కొనసాగించడమా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని గత మూడేళ్ల మాదిరిగానే ఈసారి కూడా తొలగించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ జారీ నాటికి జీవో రాకుంటే తర్వాత సర్కారు జారీ చేసే జీవోను అనుసరించి వెయిటేజీపై నిర్ణయం ఉంటుందని అందులో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70 శాతం సిలబస్ నుంచే ఎంసెట్‌లో ప్రశ్నలు వస్తాయి.

ఈ సారి సెషన్‌కు 40 వేల మంది..?
ప్రస్తుతం ఎంసెట్‌లో ఒక్కో సెషన్‌కు 29 వేల మంది విద్యార్థుల వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఈ సంఖ్యను 40 వేలకు పెంచాలని భావిస్తున్నారు. ఇదే అంశంపై టీసీఎస్‌ అయాన్‌ సంస్థతో జేఎన్టీయూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎంసెట్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయడం, ప్రశ్నపత్రాల నార్మలైజేషన్‌ సమస్యను అధిగమించేందుకు ఈ ఏడాది తక్కువ సెషన్లలో పరీక్షల నిర్వహణకు యోచిస్తున్నారు. ఏటా 2.6 లక్షల మందికిపైగా విద్యార్థులు ఎంసెట్‌కు హాజరవుతున్నారు. ఒక్కో సెషన్‌కు 40 వేల మంది విద్యార్థులు హాజరైతే ఎంసెట్‌ పరీక్షలను ఐదు రోజుల్లోనే ముగించవచ్చనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.

ఎంసెట్‌ కన్వీనర్‌గా డీన్‌కుమార్‌..
ఈ ఏడాది టీఎస్ ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్ సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా ఉన్న ప్రొఫెసర్ బి. డీన్ కుమార్‌ను నియమించారు. గత మూడేళ్లుగా ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్, రెక్టార్ గోవర్ధన్ కొనసాగగా.. ఈసారి డీన్ కుమార్‌ను నియమించారు. ఈయన గతంలో పరీక్షల నియంత్రణ విభాగం కంట్రోలర్‌గా, చీఫ్ ఇంజినీర్‌గా పనిచేశారు.

Also Read:

JNTUH Courses: జేఎన్టీయూలో కొత్త కోర్సులు వస్తున్నాయ్‌! ఈ ఏడాది నుంచే ప్రవేశాలు!
రానున్న విద్యాసంవత్సరంలో సరికొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు జేఎన్‌టీయూహెచ్ కసరత్తు చేస్తుంది. యూనివర్సిటీ పరిధిలో కొత్తగా అగ్రికల్చర్‌ టెక్నాలజీ, రేడియేషన్‌ ఫిజిక్స్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. వ్యవసాయ యాంత్రీకరణకు పరిశ్రమలను ప్రోత్సహించడమేగాక ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అగ్రికల్చర్‌ టెక్నాలజీ కోర్సుకు రూపకల్పన చేసింది. దీంతోపాటు రేడియేషన్‌ ఫిజిక్స్‌ కోర్సును ప్రవేశపెట్టాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు, వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు!
తెలంగాణలో డిగ్రీ విద్య స్వరూపం పూర్తిగా మారనుంది. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలకు అనుగుణంగా డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొపెసర్ లింబాద్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ బేగంపేట్ లోని సెస్‌లో “అత్యుత్తమ పాఠ్యప్రణాళిక అభివృద్ధి” కోసం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసిన రెండురోజుల సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Alert for Hyderabad: ఎండలు మండుతున్నాయి కానీ సాయంత్రానికి ఉరుముల వర్షాలు - భారీగానే -ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఎండలు మండుతున్నాయి కానీ సాయంత్రానికి ఉరుముల వర్షాలు - భారీగానే -ఈ జాగ్రత్తలు తీసుకోండి
Nepal PM step down: కొంప ముంచిన సోషల్ మీడియా బ్యాన్ - నేపాల్ కకావికలం - ప్రధానితో రాజీనామా చేయించిన ఆర్మీ
కొంప ముంచిన సోషల్ మీడియా బ్యాన్ - నేపాల్ కకావికలం - ప్రధానితో రాజీనామా చేయించిన ఆర్మీ
Fact Check: నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోదీ - ఈ ప్రచారంలో నిజం ఎంత?
నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోదీ - ఈ ప్రచారంలో నిజం ఎంత?
Nepal Protests: నెపాల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు! క్షేమ సమాచారం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయండి!
నెపాల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు! క్షేమ సమాచారం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయండి!
Advertisement

వీడియోలు

Nandamuri Balakrishna Rings The Bell At NSE | నేషనల్ స్టాంక్ ఎక్స్ఛేంజ్ గంట కొట్టిన బాలయ్య | ABP Desam
Space Time and Space Fabric Explained | ఐన్ స్టైన్ ఎంత జీనియస్సో ప్రూవ్ అయిన సందర్భం | ABP Desam
Rohit Virat in Australia ODI Series | ఆస్ట్రేలియా సిరీస్ లో రో-కో ?
South Africa vs England ODI | సౌతాఫ్రికా ఘోర పరాజయం
India Won Hockey Asia Cup 2025 | హాకీ ఆసియా కప్ విజేతగా భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Alert for Hyderabad: ఎండలు మండుతున్నాయి కానీ సాయంత్రానికి ఉరుముల వర్షాలు - భారీగానే -ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఎండలు మండుతున్నాయి కానీ సాయంత్రానికి ఉరుముల వర్షాలు - భారీగానే -ఈ జాగ్రత్తలు తీసుకోండి
Nepal PM step down: కొంప ముంచిన సోషల్ మీడియా బ్యాన్ - నేపాల్ కకావికలం - ప్రధానితో రాజీనామా చేయించిన ఆర్మీ
కొంప ముంచిన సోషల్ మీడియా బ్యాన్ - నేపాల్ కకావికలం - ప్రధానితో రాజీనామా చేయించిన ఆర్మీ
Fact Check: నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోదీ - ఈ ప్రచారంలో నిజం ఎంత?
నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోదీ - ఈ ప్రచారంలో నిజం ఎంత?
Nepal Protests: నెపాల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు! క్షేమ సమాచారం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయండి!
నెపాల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు! క్షేమ సమాచారం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయండి!
Rashmika Mandanna Engagement: సీక్రెట్‌గా విజయ్ దేవరకొండతో రష్మిక ఎంగేజ్‌మెంట్? - నేషనల్ క్రష్ వేలికి ఆ రింగ్ చూశారా?
సీక్రెట్‌గా విజయ్ దేవరకొండతో రష్మిక ఎంగేజ్‌మెంట్? - నేషనల్ క్రష్ వేలికి ఆ రింగ్ చూశారా?
India Neighboring Countries: భారత పొరుగు దేశాల్లో  కూలిపోతున్న ప్రభుత్వాలు, పారిపోతున్న ప్రధానులు -  ఏదైనా కుట్ర ఉందా ?
భారత పొరుగు దేశాల్లో కూలిపోతున్న ప్రభుత్వాలు, పారిపోతున్న ప్రధానులు - ఏదైనా కుట్ర ఉందా ?
Mandvi Hidma is new DKZC secretary: మావోయిస్టు పార్టీలో నూతన బాధ్యతలు స్వీకరించిన తిరుపతి, హిడ్మా.. లొంగిపోయిన మావోయిస్టు సంచలన విషయాలు
మావోయిస్టు పార్టీలో నూతన బాధ్యతలు స్వీకరించిన తిరుపతి, హిడ్మా..
Vice President Election Special Pen: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ పెన్నుతోనే ఓటు వేయాలి – లేకపోతే ఓటు చెల్లదు..
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ పెన్నుతోనే ఓటు వేయాలి – లేకపోతే ఓటు చెల్లదు..
Embed widget