అన్వేషించండి

TS Half Day Schools: విద్యార్థులకు గుడ్ న్యూస్, 15 నుంచి ఒంటిపూట బడులు - ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. విద్యాశాఖ(Educational Department) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి15 నుంచి ఒంటిపూట బడులు(Half Day Schools) నిర్వహించాలని నిర్ణయించింది.

Half Day Schools in Telangana: తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. విద్యాశాఖ(Educational Department) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి15 నుంచి ఒంటిపూట బడులు(Half Day Schools) నిర్వహించాలని నిర్ణయించింది. ఉద‌యం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వ‌ర‌కు బ‌డులు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాలలకు ఒంటిపూట బ‌డుల‌పై విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను మార్చి 7న ప్రభుత్వం విడుదల చేసింది.

ఏప్రిల్ మూడోవారం వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మధ్యా హ్నం 12.30 గంటలకు అందజేస్తారు. ఈ స్కూళ్లలో ముందుగా మధ్యాహ్నం భోజనం అందజేసి.. ఆ తర్వాత తరగతులు కొనసాగించనున్నారు. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత..యథావిథిగా ఉదయంపూట తరగతులు నిర్వహించనున్నారని రాష్ట్ర విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థుల పరీక్షల అనంతరం వేసవి సెలవులపై ప్రకటన చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

అలాగే.. తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదోతరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో.. విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు. పరీక్షలు ప్రారంభమైన తర్వాత పరీక్ష జరిగే కేంద్రాల్లో మధ్యాహ్నం తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు.

రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా విద్యాశాఖ హాఫ్ డేస్ ప్రకటించింది. మార్చి  15 నుంచి  ఈ విద్యా సంవత్సవంలో చివరి పని దినం ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలలు అంటే ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలు పనిచేస్తాయని పేర్కొంది.

మార్చి 18 నుంచి పదోతరగతి పరీక్షలు..
తెలంగాణలో పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు (TS SSC Exams) నిర్వహించనున్నారు. మార్చి 30తో ప్రధాన పరీక్షలు, ఏప్రిల్ 2తో ఒకేషనల్ పరీక్షలు (Telangana 10th Class Exams) ముగియనున్నాయి. మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21న థర్డ్ లాంగ్వేజ్, మార్చి 23న మ్యాథమెటిక్స్, మార్చి 26న ఫిజికల్ సైన్స్, మార్చి 28న బయలాజికల్ సైన్స్,  మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 1న  ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులకు, ఏప్రిల్ 2న ఓరియంటెల్ పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.

ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.

పరీక్ష తేదీ పేపరు
మార్చి 18 ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 19 సెకండ్ లాంగ్వేజ్
మార్చి 21 థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్)
మార్చి 23 మ్యాథమెటిక్స్
మార్చి 26 ఫిజికల్ సైన్స్ 
మార్చి 28 బయాలజికల్ సైన్స్
మార్చి 30 సోషల్ స్టడీస్
ఏప్రిల్ 1 ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు
ఏప్రిల్ 2 ఓరియంటెల్ పేపర్-2

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ISRO Gaganayan Vyomitra: గగనయాన్‌కు తొలిమెట్టు.. మానవరోబో వ్యోమిత్రను అంతరిక్షంలోకి పంపుతున్న ఇస్రో
గగనయాన్‌కు తొలిమెట్టు.. మానవరోబో వ్యోమిత్రను అంతరిక్షంలోకి పంపుతున్న ఇస్రో
Telangana Fee Reimbursement: ఫీజు రీఇంబర్స్‌మెంట్ స్కీమ్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం  సంస్కరణలకు కమిటీ - బెదిరిస్తున్న కాలేజీలకు షాకే !
ఫీజు రీఇంబర్స్‌మెంట్ స్కీమ్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం సంస్కరణలకు కమిటీ - బెదిరిస్తున్న కాలేజీలకు షాకే !
Hyderabad Crime News: మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
Vizag Glass Bridge: వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
Advertisement

వీడియోలు

3i Atlas interstellar object | 9 ఏళ్లలో 3 సార్లు.. భూమి కోసమా? సూర్యుడి కోసమా? | ABP Desam
New Champions in 2025 | కొత్త ఛాంపియన్స్‌‌ ఇయర్‌గా 2025
Kuldeep Yadav in India vs Australia T20 Series | టీ20 సిరీస్ నుంచి కుల్దీప్ అవుట్
Shree Charani in Women's ODI World Cup 2025 | విజృంభించిన ఆంధ్రా అమ్మాయి
South Africa Losing 4 World Cups in 2 Years | 4 ఐసీసీ ఫైనల్స్‌లో ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ISRO Gaganayan Vyomitra: గగనయాన్‌కు తొలిమెట్టు.. మానవరోబో వ్యోమిత్రను అంతరిక్షంలోకి పంపుతున్న ఇస్రో
గగనయాన్‌కు తొలిమెట్టు.. మానవరోబో వ్యోమిత్రను అంతరిక్షంలోకి పంపుతున్న ఇస్రో
Telangana Fee Reimbursement: ఫీజు రీఇంబర్స్‌మెంట్ స్కీమ్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం  సంస్కరణలకు కమిటీ - బెదిరిస్తున్న కాలేజీలకు షాకే !
ఫీజు రీఇంబర్స్‌మెంట్ స్కీమ్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం సంస్కరణలకు కమిటీ - బెదిరిస్తున్న కాలేజీలకు షాకే !
Hyderabad Crime News: మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
Vizag Glass Bridge: వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
Karnataka doctor Murder case: డాక్టర్ భార్యను చంపిన డాక్టర్ కేసులో సంచలనం - నీకోసమే మర్డర్ చేశానంటూ లవర్స్‌కు భర్త మెసెజులు
డాక్టర్ భార్యను చంపిన డాక్టర్ కేసులో సంచలనం - నీకోసమే మర్డర్ చేశానంటూ లవర్స్‌కు భర్త మెసెజులు
Gopichand P Hinduja: హిందుజా గ్రూప్ ఛైర్మన్‌ గోపీచంద్‌ పీ హిందుజా కన్నుమూత!
హిందుజా గ్రూప్ ఛైర్మన్‌ గోపీచంద్‌ పీ హిందుజా కన్నుమూత!
How Does a Cricketer Play In Periods: మహిళా క్రికెటర్లు పీరియడ్స్ టైంలో ఎలా క్రికెట్ ఆడతారు? టైటిల్ మ్యాచ్‌లను ఎలా నిర్వహిస్తారు?
మహిళా క్రికెటర్లు పీరియడ్స్ టైంలో ఎలా క్రికెట్ ఆడతారు? టైటిల్ మ్యాచ్‌లను ఎలా నిర్వహిస్తారు?
BRS MLAs Disqualification Case: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ విడుదల, ఈ 6 నుంచి విచారణ
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ విడుదల, ఈ 6 నుంచి విచారణ
Embed widget