అన్వేషించండి

MBBS Results: ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదల, 77 శాతం ఉత్తీర్ణత నమోదు!

ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం ఏప్రిల్ 6న ప్రకటించింది. ఫలితాల వివరాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌‌లో అందుబాటులో ఉంచారు.

ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం ఏప్రిల్ 6న ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం రెగ్యులర్‌ పరీక్షల్లో మొత్తం 77శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 127 మంది డిస్టింక్షన్‌ రాగా.. 2,240 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో నిలిచారు. మిగిలిన 1767 మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. మొత్తం 5,369 మంది విద్యార్థులు హాజరుకాగా, 4,134 మందిఉత్తీర్ణత సాధించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌‌లో చూసుకోవచ్చు.

KNRUHS - EXAMINATION - RESULTS OF I MBBS (OLD REGULATION) EXAMINATION

KNRUHS - EXAMINATIONS - RESULTS OF I MBBS (2019 REGULATIONS) EXAMINATION

KNRUHS - EXAMINATIONS -RESULTS OF I MBBS (2019 REGULATIONS) EXAMINATION BACKLOG CANDIDATES

తెలంగాణలో మరో మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు..
తెలంగాణకు మరో మూడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. ఈ మేరకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. జనగామ, కామారెడ్డి, వికారాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సరం నుంచి తరగతుల ప్రారంభానికి అనుమతి ఇచ్చింది. ఒక్కో కళాశాలలో వంద చొప్పున ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఈ ఏడాది కొత్తగా నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్‌లలో మొత్తం తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనుంది. వీటిలో మూడు కాలేజీల ప్రారంభానికి అనుమతి ఇస్తూ ఎన్‌ఎంసీ మెడికల్ అసెస్‌మెంట్ రేటింగ్ బోర్డు(ఎంఏఆర్‌బీ) ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన వాటి అనుమతి ప్రక్రియ వివిధ దశల్లో ఉందని.. వాటికి కూడా అనుమతి వస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అనుమతి వచ్చిన మూడు వైద్య కళాశాలల్లో ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు బోధన సిబ్బందిని నియమించడంతో పాటు మౌలిక వసతులను కల్పించాలని స్పష్టం చేశాయి.

ఇటీవల సీఎం కేసీఆర్‌ ఎనిమిది కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తర్వాతి దశలో రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, జనగామ, నిర్మల్‌ జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరు చేసి, బడ్జెట్‌లో నిధులనూ కేటాయించింది. తాజాగా ఆయా కాలేజీలకు మరో 313 పోస్టులను మంజూరు చేసింది. ఇక కొత్తగా మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 100 చొప్పున మొత్తం 300 సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

Also Read:

కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!
తెలంగాణలో కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీల్లో జులై నాటికి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తిచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు ఆదేశించారు. రాష్ట్రంలో 9 కొత్త వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలన్నారు. నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో స్థానికంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుని పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లకు సూచించారు. కొత్త వైద్య కళాశాలల్లో పనుల పురోగతిపై మంత్రి మార్చి 28న జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు వేగంగా జరిగేందుకు సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, చొరవ చూపాలన్నారు. కళాశాలకు అవసరమైన ఫర్నిచర్, పరికరాలను సమకూర్చుకోవాలని, అన్ని సదుపాయాలతో కూడిన వసతిగృహాలు సిద్ధం చేయాలని సూచించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Voter Card: ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
Harish Rao News: ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Return to Earth | భగవద్గీత గణేశుడి విగ్రహం..సునీతా విలియమ్స్ ధైర్యం వెనుక కొండంత అండCase Filed Against Influencers in Betting App Case | ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ?MS Dhoni Add With Sandeep Reddy Vanga | ధోనితో యానిమల్ రీ క్రియేట్ చేసిన VanGOD | ABP DesamSunita Williams Return to Earth Un Docking Success | స్పేస్ స్టేషన్ నుంచి బయల్దేరిన సునీత | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Voter Card: ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
Harish Rao News: ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Seema Haider:  ఆడపిల్లకు జన్మనచ్చిన సీమా హైదర్- శుభాకాంక్షలు చెబుతున్న నెటిజన్లు
ఆడపిల్లకు జన్మనచ్చిన సీమా హైదర్- శుభాకాంక్షలు చెబుతున్న నెటిజన్లు
Nani - Vijay Deverakonda: నాని వర్సెస్ విజయ్ దేవరకొండ... ఫ్యాన్ వార్ మీద దర్శకుడు నాగ్ అశ్విన్
నాని వర్సెస్ విజయ్ దేవరకొండ... ఫ్యాన్ వార్ మీద దర్శకుడు నాగ్ అశ్విన్
Grok: గ్రోక్‌ను ఓ ఆటాడుకుంటున్న తెలుగు నెటిజన్లు - కఠిన ప్రశ్నలకు ఫటాఫట్ ఆన్సర్లు ఇచ్చేస్తోందిగా !
గ్రోక్‌ను ఓ ఆటాడుకుంటున్న తెలుగు నెటిజన్లు - కఠిన ప్రశ్నలకు ఫటాఫట్ ఆన్సర్లు ఇచ్చేస్తోందిగా !
Andhra Pradesh Assembly:  ఎమ్మెల్సీల గ్రూప్ ఫోటో సెషన్లో సరదా ముచ్చట్లు -  వారితో ఫోటో దిగడం తన అదృష్టమన్న చంద్రబాబు
ఎమ్మెల్సీల గ్రూప్ ఫోటో సెషన్లో సరదా ముచ్చట్లు - వారితో ఫోటో దిగడం తన అదృష్టమన్న చంద్రబాబు
Embed widget