అన్వేషించండి

కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!

కొత్త వైద్య కళాశాలల్లో పనుల పురోగతిపై మంత్రి మార్చి 28న జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు వేగంగా జరిగేందుకు సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, చొరవ చూపాలన్నారు.

తెలంగాణలో కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీల్లో జులై నాటికి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తిచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు ఆదేశించారు. రాష్ట్రంలో 9 కొత్త వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలన్నారు. నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో స్థానికంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుని పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లకు సూచించారు.

కొత్త వైద్య కళాశాలల్లో పనుల పురోగతిపై మంత్రి మార్చి 28న జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు వేగంగా జరిగేందుకు సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, చొరవ చూపాలన్నారు. కళాశాలకు అవసరమైన ఫర్నిచర్, పరికరాలను సమకూర్చుకోవాలని, అన్ని సదుపాయాలతో కూడిన వసతిగృహాలు సిద్ధం చేయాలని సూచించారు.

తెలంగాణ వైద్యవిద్య విప్లవం దిశగా అడుగులు వేస్తోందని, వైద్యవిద్యకు హబ్‌గా మారుతోందని హరీశ్‌రావు అన్నారు. మారుమూల జిల్లాల్లో సైతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తున్న ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని ఆయన అన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఒక నర్సింగ్ కాలేజీ విధానం ప్రకటించి దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. 

బోధన సిబ్బంది అంశం కొలిక్కి..

రాష్ట్రంలో తొమ్మిది కొత్త వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన అత్యంత కీలకంగా మారనుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు వీలుగా కళాశాలలను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలనే ప్రభుత్వ ఆలోచనలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా తొమ్మిది వైద్య కళాశాలను ప్రారంభించడం ద్వారా 900 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరీంనగర్, ఖమ్మం, వికారాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, జనగాం, సిరిసిల్ల, నిర్మల్, ఆసిఫాబాద్‌లలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పించాలంటే జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) అనుమతించాల్సి ఉంది. ఇప్పటికే రెండుసార్లు తనిఖీ చేసిన ఎన్‌ఎంసీ బృందాలు బోధన సిబ్బంది నియామకం, వసతులపై అసంతృప్తి వ్యక్తంచేశాయి. మొదటిసారి పరిశీలించినప్పటి పరిస్థితులే తాజాగా వచ్చినప్పుడూ ఉన్నాయని రెండోసారి తనిఖీల సందర్భంగా గుర్తుచేశాయి. దాంతో ఈ అంశంపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2815 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కొత్త కళాశాలలు ప్రారంభమైతే మరో 900 సీట్లు అందుబాటులోకి వస్తాయి. మొత్తం సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఎంసీ మూడోసారి కొత్త వైద్య కళాశాలల తనిఖీకి వచ్చేలోపు బోధనా సిబ్బంది నియామకం, వసతుల కల్పన సహా కీలక అంశాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 24 ప్రైవేటు వైద్య కళాశాలలు ఉండగా వాటిలో 3,800 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి.

తొమ్మిది వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ మార్గదర్శకాల మేరకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బందిని నియమించనున్నారు. ఇందులో భాగంగా 87 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి ఇచ్చారు. అలాగే 210 మందికి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించే అంశంపైనా దృష్టి సారించారు. 1,442 మంది అసోసియేట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియనూ కొలిక్కి తెచ్చారు. అయితే... మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరుగుతుండటంతో మంత్రి సూచనతో స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపుతున్నారు. ఇప్పటికే నీట్ ఎంబీబీఎస్ ప్రకటన వెలువడింది. అడ్మిషన్ల ప్రక్రియ దశకు రావడానికి ఇంకా నాలుగైదు నెలల సమయం ఉండటంతో అంతలోపు కొత్త వైద్య కళాశాల ప్రారంభానికి అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు అవకాశముందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Task Force for Exam Reforms: పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
Paper Leak New Bill: పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
Embed widget