నీట్ యూజీ రీఎగ్జామ్ జూన్ 21న ఎన్టీఏ (NTA) నిర్వహిస్తుంది. గత నెలలో జరిగిన పరీక్ష పేపర్ లీక్ కావడంతో పాత పరీక్షను రద్దు చేసి ఈ రీఎగ్జామ్ నిర్వహిస్తున్నారు.
Telegram Ban: టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధం.. నీట్ రీఎగ్జామ్ వేళ కేంద్రం కీలక నిర్ణయం
NEET UG 2026 | నీట్ యూజీ రీఎగ్జామ్ దగ్గరపడటంతో కేంద్రం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. జూన్ 21 వరకు టెలిగ్రామ్ యాప్ మీద నిషేధం విధించగా.. ఎన్టీఏ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది.

న్యూఢిల్లీ: నీట్ యూజీ రీ-ఎగ్జామ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్పై జూన్ 22 వరకు ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. పరీక్షను సురక్షితమైన పద్ధతిలో నిర్వహించడానికి, కాపీయింగ్ ముఠాలను అడ్డుకోవడానికి ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 21న నీట్ యూజీ రీఎగ్జామ్ నిర్వహించనున్నారు. దీంతో పాటు, జూన్ 30 వరకు టెలిగ్రామ్లో మెసేజ్ ఎడిట్ చేసే ఫీచర్ కూడా తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. నీట్ రీఎగ్జామ్ నిర్వహణలో అవకతవకలు జరగకుండా చూడటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎన్టీఏ (NTA) స్వాగతించింది.
జూన్ 21న నీట్ యూజీ రీ-ఎగ్జామ్
నీట్ యూజీ 2026 పరీక్ష జూన్ 21న ఎన్టీఏ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ విద్యార్థులకు ఊరట కలిగిస్తూ పలు మార్పులను ప్రకటించింది. అన్నింటికంటే ముఖ్యమైన మార్పు పరీక్షా సమయానికి సంబంధించి చేశారు. ఈసారి ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు నిర్వహించనున్నారు. మొత్తం 195 నిమిషాల ఈ వ్యవధిని పరీక్షకు కేటాయించారు.
విద్యార్థుల అభిప్రాయం ప్రకారం, ఈ ఫార్మాలిటీల వల్ల పరీక్షకు సంబంధించిన అసలు సమయం ప్రభావితమవుతుంది. కొత్త విధానం ప్రకారం, విద్యార్థులకు పరీక్ష రాయడానికి తగినంత సమయం దొరికేలా ఎన్టీఏ చర్యలు చేపట్టింది. అదే సమయంలో, రఫ్ వర్క్ కోసం కూడా ఈసారి కొత్త సదుపాయం కల్పించారు. ప్రశ్నాపత్రంలో రఫ్ వర్క్ కోసం పేజీల సంఖ్యను పెంచారు. . ఇంతకుముందు విద్యార్థులకు కేవలం 2 పేజీలు లభించేవి, కానీ ఇప్పుడు 4 పేజీలు ఇస్తున్నారు. దాంతో లెక్కలు, రేఖాచిత్రాలు, లాజికల్ ప్రశ్నలను పరిష్కరించడంలో విద్యార్థులకు మరింత సౌకర్యంగా ఉంటుంది.
గత నెలలో జరిగిన నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీక్ కావడంతో కేంద్ర ప్రభుత్వం పాత పరీక్షను రద్దు చేసింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, జూన్ 21న రీఎగ్జామ్ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఈసారి పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా అత్యున్నత భద్రతా ప్రమాణాలను, స్ట్రిక్ట్ మానిటరింగ్ను ఎన్టీఏ (NTA) అమలు చేస్తోంది. పటిష్టమైన లాజిస్టిక్స్ ద్వారా పరీక్ష పారదర్శకతను కాపాడాలని అధికారులు నిర్ణయించారు.
ఈ మార్పులు విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించి, వారు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు దోహదపడతాయని ఎన్టీఏ భావిస్తోంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులపై ఉన్న సూచనలను క్షుణ్ణంగా చదివి, సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. పరీక్షా కేంద్రాల్లో సిబ్బందికి సహకరించాలని కోరింది. ఈ కొత్త నిబంధనల వల్ల విద్యార్థులు అడ్మినిస్ట్రేటివ్ ఫార్మాలిటీస్ గురించి ఆందోళన చెందకుండా పూర్తిగా పరీక్షపైనే దృష్టి పెట్టవచ్చని నిపుణులు సూచించారు.
కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలు
ప్రస్తుతం కాక్రోచ్ జనలా పార్టీ దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. నీట్ యూజీ పేపర్ లీక్, సీబీఎస్ఈ పేపర్ లీకులకు బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ గాలికొదిలేసిన మంత్రిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతున్నారు. పేపర్ లీకులపై కేంద్రానికి బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లోనూ కాక్రోచ్ జనతా పార్టీ ఇందిరా పార్క్ లో నిరసన చేపట్టడం తెలిసిందే.
Before You Go
MLC Kavitha on Dress Sense : హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ మహిళాకళాశాలలో కవిత
Frequently Asked Questions
నీట్ యూజీ రీఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారు?
నీట్ రీఎగ్జామ్ సమయంలో టెలిగ్రామ్ యాప్పై ప్రభుత్వం ఎందుకు నిషేధం విధించింది?
పరీక్షను సురక్షితంగా నిర్వహించడానికి, కాపీయింగ్ ముఠాలను అడ్డుకోవడానికి జూన్ 22 వరకు టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం విధించారు. మెసేజ్ ఎడిట్ చేసే ఫీచర్ను కూడా జూన్ 30 వరకు నిలిపివేయనున్నారు.
నీట్ యూజీ రీఎగ్జామ్లో పరీక్ష సమయం లేదా ఇతర విధానాలలో ఏమైనా మార్పులు ఉన్నాయా?
అవును, పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు (మొత్తం 195 నిమిషాలు) జరుగుతుంది. అలాగే, రఫ్ వర్క్ కోసం కేటాయించిన పేజీల సంఖ్యను 2 నుండి 4కి పెంచారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























