అన్వేషించండి

Janasena Leaders : బెయిల్ పై విడుదలైన జనసేన నేతలు, జైల్ వద్ద పలువురు అరెస్ట్!

Janasena Leaders : మంత్రులపై దాడి కేసులో జనసేన నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. శనివారం సాయంత్రం 9 మంది నేతలు జైలు నుంచి విడుదల అయ్యారు.

Janasena Leaders : విశాఖ ఎయిర్ పోర్టు ఘటనలో అరెస్టైన తొమ్మిది మంది జనసేన నాయకులు శనివారం సాయంత్రం విడుదలయ్యారు. రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో కండీషన్ బెయిల్ కోసం హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో విశాఖ సెంట్రల్ జైలు నుంచి తొమ్మిది మంది జనసేన నేతలు విడుదలయ్యారు. సెంట్రల్ జైల్ నుంచి విడుదలైన తొమ్మిది మంది నేతలు ప్రతిరోజు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముందు హాజరుకావాలని జనసేన లీగల్ సెల్ న్యాయవాదులు రేవతి, కళావతిలు తెలిపారు. సెంట్రల్ జైల్లో వేధింపులకు గురిచేస్తున్నారనడంలో వాస్తవంలేదన్నారు. హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశామని, అందుకు హై కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. ఈ సందర్భంగా  హైకోర్టుకు అభినందనలు తెలియజేశారు. 

పలువురు అరెస్ట్ 

విశాఖ సెంట్రల్ జైల్ వద్ద జనసేన నాయకులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన టి.ఎన్.ఎస్.ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, ఆరేటి మహేష్ లు పోలీసులు అరెస్టు చేసి ఆరిలోవ పీఎస్ కు తరలించారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు ఎవ్వరూ రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.  సెక్షన్ 30 అమలులో ఉన్న కారణంగా వారిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

 అన్ని అనుమతులు తీసుకున్నాం : జనసేన నేతలు

పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనకు అన్ని  అనుమతులు తీసుకున్నామన్నారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ.  ఎయిర్ పోర్టులో రోజా కన్వాయ్ పై దాడి చేశామని కేసులు పెట్టారని, ఆవిడ వేలు చూపెట్టి కుర్రాళ్లను రెచ్చగొట్టి జనసేన నేతలను ఇబ్బంది పెట్టారన్నారు. జనసేన అధికార ప్రతినిధి శివ శంకర్ మాట్లాడుతూ రాజకీయ ప్రక్షాళన జరగాలనే ఉద్దేశంతో తమ అధినాయకుడు జనసేన పార్టీ పెట్టారన్నారు. సిద్ధాంత భావజాలంతో ఏర్పాటు చేశారన్నారు. విశాఖ పర్యటనలో ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి 3 రోజులు పర్యటనకు అన్ని అనుమతులు తీసుకుని వచ్చినప్పటికీ అధికార పార్టీ ఆయనపై కక్ష్య పూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ వచ్చే సమయానికి తాము ఎయిర్ పోర్టు వీఐపీ లాంజ్ లో ఉన్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామని ప్రజల గురించి మాట్లాడితే వారిపై చర్యలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తమను అరెస్ట్ చేసి పిరికి పంద చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. ఏపీలో  పులివెందుల రాజ్యాంగం నడుస్తుందని భారత రాజ్యాంగం ఈ ప్రభుత్వానికి తెలియదని ఎద్దేవా చేశారు.

అసలేం జరిగింది?

విశాఖ జనసేన జనవాణి కార్యక్రమం నిర్వహించేందుకు పవన్ కల్యాణ్ 15వ తేదీ సాయంత్రం నగరానికి వచ్చారు. పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికేందుకు ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి. అయితే అదే రోజు మూడు రాజధానుల కోసం నిర్వహించిన విశాఖ గర్జనలో వైసీపీ నేతలు, మంత్రులు పాల్గొన్నారు. గర్జన ర్యాలీ అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణంలో ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆ సమయంలో మంత్రులపై కొందరు దాడికి పాల్పడ్డారు. విశాఖపట్నం విమానాశ్రయంలో మంత్రులపై దాడి చేసిన ఘటనలో 92 మందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల విశాఖలోని ఏడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు 71 మందిని పోలీసులు హాజరు పర్చారు. వీరిలో 62 మందికి 10 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఏ - 1, ఏ - 9 నిందితులపై ఉన్న హత్యాయత్నం సెక్షన్‌ను తీవ్రగాయం కేసుగా మార్చారు. అంటే సెక్షన్ 307 ను తొలగించి సెక్షన్ 326 గా మార్చారు. వీరికి మాత్రం కోర్టు రిమాండ్ విధించారు. మొత్తం తొమ్మిది మంది జనసేన నాయకులకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది కోర్టు. జనసేన నేతలు కోన తాతారావు, సుందరపు విజయ్ కుమార్, మూర్తి యాదవ్, సందీప్, శ్రీనివాస పట్నాయక్, కృష్ణ, రూప, శ్రీను సెంట్రల్ జైల్ లో ఉన్నారు. వీరంతా బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు 9 మంది జనసేన నేతలకు బెయిల్ మంజూరు చేసింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Tirumala Darshan Ticket For January 2025: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Tirumala Darshan Ticket For January 2025: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
Yahya Sinwar: చావు కోసం ఎదురు చూస్తూ కసితో కత్తి దూసిన సిన్వార్‌ - సినిమా సీన్‌ను తలపిస్తున్న వీడియో
చావు కోసం ఎదురు చూస్తూ కసితో కత్తి దూసిన సిన్వార్‌ - సినిమా సీన్‌ను తలపిస్తున్న వీడియో
Emergency Movie: కంగనా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్... మరీ అన్ని కట్స్ అంటే అసలు మ్యాటర్ ఉంటుందా?
కంగనా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్... మరీ అన్ని కట్స్ అంటే అసలు మ్యాటర్ ఉంటుందా?
Mrunal Thakur’s Pilgrimage Tour: ఆధ్యాత్మిక పర్యటనలో 'హాయ్ నాన్న' బ్యూటీ - జగేశ్వర్ ధామ్‌లో మృణాల్ ఠాకూర్ పూజలు!
ఆధ్యాత్మిక పర్యటనలో 'హాయ్ నాన్న' బ్యూటీ - జగేశ్వర్ ధామ్‌లో మృణాల్ ఠాకూర్ పూజలు!
Atal Pension Yojana: ఈ స్కీమ్‌లో 7 కోట్ల మంది చేరారు - బెనిఫిట్స్‌ తెలిస్తే మీరూ ఇప్పుడే చేరతారు
ఈ స్కీమ్‌లో 7 కోట్ల మంది చేరారు - బెనిఫిట్స్‌ తెలిస్తే మీరూ ఇప్పుడే చేరతారు
Embed widget