అన్వేషించండి

Visakha News: అనుమానంతో ప్రేయసిన చంపేసి పోలీసులకు లొంగిపోయాడు - విశాఖలో యువకుడి దుశ్చర్య

Visakha News: తనను ప్రేమిస్తున్న అమ్మాయి మరో యువకుడితో చనువుగా ఉంటోందనే కోపంతో.. ప్రియురాలిని గొంతు నులిమి చంపాడో ప్రియుడు. అనంతరం నేరుగా పోలీసుల ఎదుటకు వెళ్లి లొంగిపోయాడు. 

Visakha News: విశాఖపట్నం బీచ్ లో దారుణం జరిగింది. తాను ప్రేమిస్తున్న అమ్మాయి మరో యువకుడితో చనువుగా ఉంటోందని ఆమెను చంపానుకున్నాడు. బీచ్ కు రమ్మని చెప్పి.. అర్ధరాత్రి పూట గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పోలీసులు ఎదుటకు వెళ్లి లొంగిపోయాడు. 

విశాఖపట్నానికి చెందిన శ్రావణి, గోపాల్ అనే ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరూ చెట్టాపెట్టాలేసుకొని తరిగేవారు. ఈ క్రమంలోనే శ్రావణి మరో అబ్బాయితో మాట్లాడుతోంది. అతనితో శ్రావణి చనువుగా ఉండడాన్ని గోపాల్ జీర్ణించుకోలేక పోయాడు. తనను ప్రేమిస్తున్నట్లు చెప్పి మరో యువకుడితో తిరుగుతూ తనను మోసం చేస్తుందని భావించాడు.

అలాంటి అమ్మాయిని ఎలాగైనా సరే మట్టుపెట్టాలనుకున్నాడు. ఈక్రమంలోనే ఆమె హత్యకు ప్లాన్ వేశాడు. శుక్రవారం రోజు అర్థరాత్రి గోకుల్ పార్క్ బీచ్ వద్దకు రమ్మని చెప్పాడు. కాసేపు ఆమెతో మాట్లాడిన అతడు... ఒక్కసారిగా ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత గోపాల్ నేరుగా గాజువాక పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వారం రోజుల క్రితం ప్రియుడి పీక కోసిన ప్రియురాలు

గోకవరం గ్రామానికి చెందిన ఒమ్మి నాగశేషు(25) తాపీ పని చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. ఇతనికి ఏడాది క్రితం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన అరుణతో వివాహం అయ్యింది. ఈ క్రమంలోనే తాపీ పని చేసుకునే క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంకు చెందిన కుర్లు డిబేరా అనే యువతితో పరిచయం ఏర్పడిరది. హతుడు నాగశేషు, డిబేరాల మధ్య మధ్య గత ఏడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అదికాస్త వివాహేతర సంబధానికి దారితీయగా డిబేరా నాగశేషుకు రూ.2 లక్షల నగదు, బంగారు గొలుసు ఇచ్చింది. అది ఇవ్వాలని గత కొంతకాలంగా ఆమె నాగశేషును అడుగుతున్నా ఇవ్వడం లేదని, అంతేకాకుండా వీరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలోనే తన డబ్బు, గొలుసు వెంటనే ఇవ్వాలని డిబేరా డిమాండ్‌ చేసినా అతని నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో చంపాలని నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

కర్ర, కత్తిపీట వెంట తెచ్చుకుని మరీ హత్య

హతుడు నాగశేషుపై విపరీతంగా ఆవేశంతో రగిలిపోయిన డిబేరా రాజవొమ్మంగి ప్రాంతానికి చెందిన శివన్నారాయణ అనే యువకుడితో కలిసి బుధవారం అర్ధరాత్రి తాపీమేస్త్రి అయిన ఒమ్మి నాగశేషు నిద్రిస్తున్న ఇంటి వద్దకు వచ్చిందని పోలీసులు చెప్పారు. నాగశేషు ఇంటి మేడపై నిద్రిస్తున్నాడని అప్పటికే డిబేరాకు తెలియడంతో నేరుగా పైకి ఎక్కి నిద్రిస్తున్న నాగశేషుపై డిబేరా, ఆమె వెంట వచ్చిన శివన్నారాయణ దాడి చేశారు. ఆపై వెంట తెచ్చుకున్న కత్తిపీటతో తీవ్రంగా గాయపరిచి, నాగశేషు గొంతుకోసే ప్రయత్నం చేశారు.

తీవ్రగాయాలపాలైన హతుడు పెద్దపెద్ద కేకలు వేయడంతో అక్కడి నుంచి డిబేరా, శివన్నారాయణ పారిపోయారు. దీంతో హతుని తల్లి గంగతోపాటు స్థానికులు డాబాపైకి వచ్చి చూసేసరికి తీవ్ర రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న నాగశేషును 108లో గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి మరింత విషమించడంతో రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై నాగశివబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నార్త్‌ జోన్‌ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అర్ధరాత్రి మృతుడి హాహాకారాలు విన్న స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యామని తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Danam Nagender Face to Face | కొత్త నాయకత్వంకాదు..ముందు కేటీఆర్ మారాలంటున్న దానం | ABP DesamMadhavi Latha Sensational Interview | లక్ష ఓట్ల తేడాతో ఒవైసీని ఓడిస్తానంటున్న మాధవీలత | ABP DesamParipoornananda Swami on Hindupuram Seat | హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద | ABPWhy did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Embed widget