అన్వేషించండి

Road Accidents : తెలంగాణలో నెత్తురోడిన రోడ్డు, రెండు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి!

Road Accidents : తెలంగాణలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు.


Road Accidents : తెలంగాణ వికారాబాద్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ధరూర్ మండలం కేరెల్లి బాచారం వంతెన వద్ద ప్రయాణికులతో వస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని వికారాబాద్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరొకందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ జమీల్‌, రవి, కిషన్‌, సోనీబాయి చనిపోయారని పోలీసులు తెలిపారు. బాధితులు పెద్దేముల్‌ మండలం మదనంతాపూర్‌ కు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. వీరంతా కూలీ పనుల కోసం వికారాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.  

మరో ప్రమాదంలో నలుగురు మృతి 

సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం కన్సాన్‌ పల్లి వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.  

ప్రమాదంపై మంత్రి సబితా దిగ్భ్రాంతి

వికారాబాద్ జిల్లాలోని ధారూర్ మండలంలోని కేరెళ్లి-బాచారం వద్ద ఆటోను లారీ ఢీ కొన్న ప్రమాదంలో నలుగురి మృతి చెందడంపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ నిఖిల, ఎస్పీ కోటిరెడ్డితో మంత్రి మాట్లాడారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పెద్దేముల్ మండలం మదనంతాపూర్ తండాకు చెందిన వ్యక్తులు ఆటోలో వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. సంఘటనా స్థంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. 

వైసీపీ నేత దుర్మరణం 

తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత దుర్మరణం పాలయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన కోలా వెంకటేశ్వర్లు వైసీపీ తరపున జడ్పీటీసీగా ఉన్నారు. ఆయన వెంకటగిరిలో నివాసం ఉంటారు. వెంకటగిరి నుంచి తిరుపతి వెళ్లి, తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి కారులో వెంకటగిరికి వస్తుండగా మార్గ మధ్యంలో రేణిగుంట మండలంలోని మర్రిగుంట వద్ద ప్రమాదం జరిగింది. ఇనుప లోడుతో వస్తున్న లారీని ఆయన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో జడ్పీటీసీ కోలా వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. అదే కార్లో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారి చొరవతో.. గాజుల మండ్యం పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతికి తరలించారు. గాజులమండ్యం పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పట్ల ఆనం రామనారాయణ రెడ్డి తన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షత గాత్రులకు తక్షణ వైద్యం అందేలా జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
Aravalli Mountains:అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!

వీడియోలు

Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు
ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
Aravalli Mountains:అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
Embed widget