అన్వేషించండి

Telangana Students: తీవ్ర విషాదం - అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

Telangana News: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి చెందడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. వారి మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Two Telangana Students Died in Accident In Us: అమెరికాలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. కరీంనగర్ (Karimnagar), జనగామ (Janagam) జిల్లాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు అక్కడి పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ (Huzurabad) పట్టణానికి చెందిన డాక్టర్ స్వాతి, డాక్టర్ నవీన్ దంపతుల కుమారుడు నివేశ్ (20), జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన స్వర్ణకారుడు పార్శి కమల్ కుమార్, పద్మ దంపతుల పెద్ద కుమారుడు గౌతమ్ కుమార్ (19) అమెరికాలోని అరిజోనా స్టేట్ విశ్వ విద్యాలయంలో బీటెక్ రెండో ఏడాది చదువుతున్నారు. శనివారం రాత్రి వీరు తమ స్నేహితులతో కలిసి వర్శిటీ నుంచి కారులో ఇంటికి వస్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం వెనుక సీట్లో కూర్చున్న నివేశ్, గౌతమ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గౌతమ్ కుమార్ మృతదేహం స్వగ్రామం చేరుకోవడానికి రెండు, మూడు రోజుల సమయం పడుతుందని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. నివేశ్ మృతదేహాన్ని హుజూరాబాద్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇటీవలే స్కాట్లాండ్ లోనూ

ఉన్నత చదువుల కోసం స్కాట్లాండ్ వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు సైతం ఇటీవలే ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన జితేంద్రనాథ్ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22) స్కాట్లాండ్ లోని డూండీ యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నారు. ఈ నెల 17న బుధవారం సాయంత్రం ఇద్దరు స్నేహితులతో కలిసి పెర్త్ షైర్ లోని 'లిన్ ఆఫ్ తమ్మెల్'కు వెళ్లారు. రెండు నదులు కలిసే ఈ ప్రాంతంలో వీరు ట్రెక్కింగ్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నీటిలో జారి పడి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న అక్కడి పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టారు. అనంతరం కొద్ది దూరంలో వీరి మృతదేహాలను గుర్తించారు. వీరి మృతి విషయంలో ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరు హైదరాబాద్ కు చెందిన వారు ఉండగా.. మరో విద్యార్థి ఏపీకి చెందిన వారు. అటు, ఈ ప్రమాదంపై లండన్ లోని భారత హైకమిషన్ అధికారి బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు, ఈ దుర్ఘటనపై స్పందించిన యూనివర్శిటీ ఆఫ్ డూండీ ప్రతినిధి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఇది మనందరికీ దిగ్భ్రాంతిని గురి చేసిన ఓ విషాద ప్రమాదం. అత్యంత క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలకు మేము అండగా ఉంటాం.' అని పేర్కొన్నారు. కాగా, జితేంద్రనాథ్ గతంలో అమెరికాలోని కనెక్టికట్ వర్శిటీలో చదివినట్లు తెలుస్తోంది. చాణక్య 2022లోనే హైదరాబాద్ జేఎన్టీయూలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు సమాచారం.

Also Read: Crop Losses: తెలంగాణలో పంట నష్టంపై వ్యవసాయ శాఖ ఫోకస్ - అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Female cop kills father: పేరుకే పోలీసు - కానీ తండ్రినే చంపిన హంతకురాలు - ఈమెకు ఏ శిక్ష కరెక్ట్ ?
పేరుకే పోలీసు - కానీ తండ్రినే చంపిన హంతకురాలు - ఈమెకు ఏ శిక్ష కరెక్ట్ ?
GST scam busted: ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
Allahabad High Court: వివాహితుడు మరో మహిళతో సహజీవనం చేయడం నేరంకాదు! అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!
వివాహితుడు మరో మహిళతో సహజీవనం చేయడం నేరంకాదు! అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!
Instagram Love Tragedy: ఇన్‌స్టా లవ్ విషాదాంతం.. భర్తను వదిలి ప్రియుడితో పెళ్లి! కాలువలో దూకి ఇద్దరూ ఆత్మహత్య
ఇన్‌స్టా లవ్ విషాదాంతం.. భర్తను వదిలి ప్రియుడితో పెళ్లి! కాలువలో దూకి ఇద్దరూ ఆత్మహత్య

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
RCB VS SRH Highlights: ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో అనికేత్ వర్మ మెరుపులు.. RCBకి SRH బిగ్ టార్గెట్
ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో అనికేత్ వర్మ మెరుపులు.. RCBకి SRH బిగ్ టార్గెట్
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Embed widget