అన్వేషించండి

Old City Murder: కారం చల్లి కత్తులతో నరికి, స్నేహితుల మధ్య గొడవే హత్యకు కారణమా?

Old City Murder: హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు హత్యచేశారు. కళ్లల్లో కారం చల్లి కత్తులతో నరికి హత్య చేశారు.  

Old City Murder: ఓ వ్యక్తిని ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి చంపారు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్నేహితుల మధ్య జరిగిన గొడవ వల్లే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి పేర షాకీర్ గా పోలీసులు గుర్తించారు. అతడు భవాని నగర్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు వెల్లడించారు. 

వ్యక్తి హత్య కేసులో స్నేహితులపై అనుమానం

భవాని నగర్ ప్రాంతంలో నివాసం ఉండే 30 ఏళ్ల షాకీర్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతడికి స్నేహితుల మధ్య కొన్ని రోజుల క్రితం గొడవ జరిగింది. ఇది మనసులో పెట్టుకున్న షాకీర్ స్నేహితులు అతడిపై కక్ష పెట్టుకున్నారు. ఈ క్రమంలో షాకీర్ టాటా ఏస్ వాహనంలో బ్యాటరీల లోడ్ తో సంతోష్ నగర్ నుండి బండ్ల గూడ వైపు వెళ్తుండగా అతడిని ముగ్గురు వ్యక్తులు వెంబడించారు. చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఆర్ డీఎల్ రోడ్డు వరకు రాగానే అతడిని వారు అడ్డగించారు. షాకీర్ కళ్లలో కారం చల్లారు. అనంతరం వారి వెంట తెచ్చుకున్న కత్తులో షాకీర్ పై విచక్షణా రహితంగా దాడి చేశారు. ముగ్గురు వ్యక్తుల దాడిలో షాకీర్ గాయాలపాలై తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయాడు. షాకీర్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హత్య జరిగిన ప్రాంతంలో ఏవైనా సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయా అనే ఆధారాలను పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం షాకీర్ తో గొడవ పడ్డ స్నేహితులే షాకీర్ ను అడ్డగించి హతమార్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం ఇలాంటి ఘటనే కొత్తగూడెంలో జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ యువకుడు తన స్నేహితుడిని సిమెంట్ ఇటుక, రాడ్డుతో తీవ్రంగా కొట్టి చంపాడు. గాజులరాజం బస్తీకి చెందిన బడికెల సందీప్ అదే ప్రాంతానికి చెందిన పల్లం సాయికుమార్ మంచి మిత్రులు. ఇద్దరూ కలిసి బడ్డీ కొట్టు వద్దకు వెళ్లి అక్కడ సిగరెట్ తాగారు. తర్వాత అక్కడి సందీప్ వెళ్లిపోతుండగా.. డబ్బులు ఇవ్వు అంటూ బడ్డీ కొట్టు రాకేశ్ అడిగాడు. తర్వాత ఇస్తాలే అంటూ సందీప్ సమాధానం ఇచ్చాడు. ఇప్పటికే చాలా డబ్బులు ఇవ్వాల్సి ఉందని రాకేశ్ అడగడంతో పక్కనే ఉన్న సాయి కుమార్ ఎందుకు రా డబ్బులు ఇచ్చేసేయ్ అన్నాడు. ఈ విషయంలో వారి మధ్య వాదన జరిగింది. నువ్వేంట్రా నాకు చెప్పేది అంటూ సందీప్ అతడి స్నేహితుడు సాయి కూమార్ ను కొట్టాడు. తర్వాత సాయి కుమార్ కూడా చేయి చేసుకున్నాడు. అలా వారిద్దరూ తీవ్రంగా కొట్టుకున్నారు. అదే క్రమంలో సాయి కుమార్ సందీప్ పై తీవ్రంగా దాడి చేశాడు. దీంతో సందీప్ కింద పడిపోగా.. అక్కడ పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకతో సందీప్ తలపై సాయికుమార్ బలంగా కొట్టాడు. మంచి చెబితే తననే కొట్టాడన్న ఆవేశంలో సందీప్ రక్తపు మడుగులో ఉన్నా కనికరం లేకుండా మరోసారి ఇటుకతో బలంగా కొట్టాడు. సాయికుమార్ దాడిలో సందీప్ చెవి, ముక్కుల్లోంచి తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయాడు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ

వీడియోలు

Trump on Greenland | గ్రీన్‌ లాండ్ కోసం ట్రంప్ ఎందుకు పట్టుబుతున్నాడు | ABP Desam
Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Bangladesh Cricket: భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో - ఇక టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ !
భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో - ఇక టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ !
Adilabad Latest News:ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
FIR at home: బాధితుల వద్దకే పోలీసులు - స్పాట్‌లోనే ఎఫ్ఐఆర్ - దుండిగల్ పోలీసుల కొత్త ప్రయత్నం వైరల్
బాధితుల వద్దకే పోలీసులు - స్పాట్‌లోనే ఎఫ్ఐఆర్ - దుండిగల్ పోలీసుల కొత్త ప్రయత్నం వైరల్
SIT notice to KTR: ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
Embed widget