అన్వేషించండి

Accident: గంజాయి కేసు నిందితుడి కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు!

Accident: వారంతా పోలీసులు. గంజాయి కేసులో విచారణ కోసం బెంగళూరు నుండి ఆంధ్రప్రదేశ్ కు రాగా.. మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 

Accident: విధి ఎంతో విచిత్రమైనది. అది ఎవరికి ఎలా రాసి పెట్టి ఉంటుందో తెలియదు. మనం ఒకటి అనుకుంటే అది ఇంకోటి తలుస్తుంది. సాఫీగా సాగుతున్న జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. ఎటు వైపు నుండి ఎప్పుడు ఎలా ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందో మనిషి గ్రహించలేడు. అప్పటికప్పుడు జరిగిన ఘటనలు జీవితంపై పెను ప్రభావాన్నే చూపుతాయి. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ ప్రమాదం విధి ఆడిన వింత నాటకానికి పెను ఉదాహరణగా నిలుస్తోంది. అసలు ఏం జరిగిందో ఇది చదివి తెలుసుకోండి.

వాళ్లు పోలీసులు.. దోషులకు శిక్ష వేయడంలో, అమాయకులకు సాయం అందించడంలో ముందు ఉంటారు. నేరాలు జరిగితే వాటిని ఛేదించి న్యాయస్థానం ముంగిట నిలుచోబెడతారు. రాత్రనక, పగలనక పనిలో నిమగ్నమవుతారు. మనం పండుగలు, పబ్బాలు అంటూ కుటుంబంతో కలిసి హాయిగా, సంతోషంగా ఉంటే వారు మాత్రం వీధుల్లో విధి నిర్వర్తిస్తుంటారు. న్యాయస్థానంలో న్యాయం అందుతుంది.. కానీ ప్రతి ఒక్కరూ న్యాయం కోసం మొదట పరిగెత్తేది  పోలీసు స్టేషన్ కే. 

విచారణ కోసం వెళ్లి విగతజీవులయ్యారు..!

అది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి.కొత్తకోట. అక్కడికి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర దుర్ఘటనలో అవినాష్, అనిల్ మల్లిక్, మ్యాక్స్ వెల్ అనే ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. కారులో ప్రయాణిస్తున్న మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే వాళ్లంతా పోలీసులు. బెంగళూరుకు చెందిన ఈ పోలీసులు గంజాయి కేసులో నిందితుడిని అరెస్టు చేసేందుకు అక్కడి నుండి తిరుపతికి బయలు దేరారు. పూతలపట్టు మండలం పి. కొత్తకోట వద్ద రైల్వే బ్రిడ్జి ఎత్తు తెలపడానికి రోడ్డు పక్కన ఇనుప స్తంభాన్ని ఏర్పాటు చేశారు రైల్వే సిబ్బంది. ఆ ఇనుప స్తంభమే పోలీసుల పట్ల మృత్యు పాశంగా మారింది. ఆ ఇనుప స్తంభాన్ని తప్పించబోయి.. అక్కడే ఉన్న మరో బ్రిడ్జిని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. బెంగళూరు శివాజీనగర్ ఎస్సై అవినాష్(29), కానిస్టేబుల్ అనిల్ మల్లిక్(26), డ్రైవర్ మ్యాక్స్ వెల్(32) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో ప్రొబేషనరీ ఎస్సై దీక్షిత్, మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. 

నుజ్జునుజ్జయిన కారు..

ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను దగ్గర్లోని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుండి వేలూరు సీఎంసీకి తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు కాగా.. అందులోనే పోలీసులు మృతదేహాలు ఇరుక్కున్నాయి. జేసీబీ సాయంతో వాటిని బయటకు తీశారు. ప్రమాదంలో చని పోయిన ఎస్సై అవినాష్.. బీదర్ జిల్లా బసవ కల్యాణ తాలూకా దాసరవాడి నివాసి అని గుర్తించారు. ఇటీవలె అవినాష్ కు పెళ్లి నిశ్చయమైంది. కానిస్టేబుల్ అనిల్ మల్లిక్ బాగలకోట్ జిల్లా జమఖండి తాలూకా చిక్కళకెరే వాసి. మ్యాక్స్ వెల్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు. మొత్తం 8 మంది పోలీసులు రెండు కార్లలో బెంగళూరు నుండి తిరుపతికి బయల్దేరారు. ఆ రెండు కార్లలో ఒకదానికి ప్రమాదం జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవ రాజ బొమ్మై దుర్ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
Hyderabad Crime News: పెళ్లిబట్టలతో హోటల్ రూంలో యువకుడు ఆత్మహత్య.. లవర్ వచ్చేలోపే విషాదం- కేపీహెచ్‌బీలో ఘటన
పెళ్లిబట్టలతో హోటల్ రూంలో యువకుడు ఆత్మహత్య.. లవర్ వచ్చేలోపే విషాదం- కేపీహెచ్‌బీలో ఘటన
Hyderabad Drugs Party: హైదరాబాద్ రిసార్ట్‌లో పార్టీ.. డ్రగ్స్ టెస్టులో బాలీవుడ్ నటుడు, ఓ జంటకు పాజిటివ్
హైదరాబాద్ రిసార్ట్‌లో పార్టీ.. డ్రగ్స్ టెస్టులో బాలీవుడ్ నటుడు, ఓ జంటకు పాజిటివ్
Hyderabad Crime News: ఫేస్‌బుక్‌లో పరిచయంతో హైదరాబాద్ టెకీ నుంచి రూ.2.36 కోట్లు కొట్టేసిన కిలేడీ!
ఫేస్‌బుక్‌లో పరిచయంతో హైదరాబాద్ టెకీ నుంచి రూ.2.36 కోట్లు కొట్టేసిన కిలేడీ!

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Car Maintenance Guide: తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
Organ Transplant Green Channel: ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
Car SafetyTips in Summer : ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
Embed widget