అన్వేషించండి

Accident: గంజాయి కేసు నిందితుడి కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు!

Accident: వారంతా పోలీసులు. గంజాయి కేసులో విచారణ కోసం బెంగళూరు నుండి ఆంధ్రప్రదేశ్ కు రాగా.. మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 

Accident: విధి ఎంతో విచిత్రమైనది. అది ఎవరికి ఎలా రాసి పెట్టి ఉంటుందో తెలియదు. మనం ఒకటి అనుకుంటే అది ఇంకోటి తలుస్తుంది. సాఫీగా సాగుతున్న జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. ఎటు వైపు నుండి ఎప్పుడు ఎలా ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందో మనిషి గ్రహించలేడు. అప్పటికప్పుడు జరిగిన ఘటనలు జీవితంపై పెను ప్రభావాన్నే చూపుతాయి. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ ప్రమాదం విధి ఆడిన వింత నాటకానికి పెను ఉదాహరణగా నిలుస్తోంది. అసలు ఏం జరిగిందో ఇది చదివి తెలుసుకోండి.

వాళ్లు పోలీసులు.. దోషులకు శిక్ష వేయడంలో, అమాయకులకు సాయం అందించడంలో ముందు ఉంటారు. నేరాలు జరిగితే వాటిని ఛేదించి న్యాయస్థానం ముంగిట నిలుచోబెడతారు. రాత్రనక, పగలనక పనిలో నిమగ్నమవుతారు. మనం పండుగలు, పబ్బాలు అంటూ కుటుంబంతో కలిసి హాయిగా, సంతోషంగా ఉంటే వారు మాత్రం వీధుల్లో విధి నిర్వర్తిస్తుంటారు. న్యాయస్థానంలో న్యాయం అందుతుంది.. కానీ ప్రతి ఒక్కరూ న్యాయం కోసం మొదట పరిగెత్తేది  పోలీసు స్టేషన్ కే. 

విచారణ కోసం వెళ్లి విగతజీవులయ్యారు..!

అది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి.కొత్తకోట. అక్కడికి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర దుర్ఘటనలో అవినాష్, అనిల్ మల్లిక్, మ్యాక్స్ వెల్ అనే ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. కారులో ప్రయాణిస్తున్న మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే వాళ్లంతా పోలీసులు. బెంగళూరుకు చెందిన ఈ పోలీసులు గంజాయి కేసులో నిందితుడిని అరెస్టు చేసేందుకు అక్కడి నుండి తిరుపతికి బయలు దేరారు. పూతలపట్టు మండలం పి. కొత్తకోట వద్ద రైల్వే బ్రిడ్జి ఎత్తు తెలపడానికి రోడ్డు పక్కన ఇనుప స్తంభాన్ని ఏర్పాటు చేశారు రైల్వే సిబ్బంది. ఆ ఇనుప స్తంభమే పోలీసుల పట్ల మృత్యు పాశంగా మారింది. ఆ ఇనుప స్తంభాన్ని తప్పించబోయి.. అక్కడే ఉన్న మరో బ్రిడ్జిని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. బెంగళూరు శివాజీనగర్ ఎస్సై అవినాష్(29), కానిస్టేబుల్ అనిల్ మల్లిక్(26), డ్రైవర్ మ్యాక్స్ వెల్(32) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో ప్రొబేషనరీ ఎస్సై దీక్షిత్, మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. 

నుజ్జునుజ్జయిన కారు..

ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను దగ్గర్లోని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుండి వేలూరు సీఎంసీకి తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు కాగా.. అందులోనే పోలీసులు మృతదేహాలు ఇరుక్కున్నాయి. జేసీబీ సాయంతో వాటిని బయటకు తీశారు. ప్రమాదంలో చని పోయిన ఎస్సై అవినాష్.. బీదర్ జిల్లా బసవ కల్యాణ తాలూకా దాసరవాడి నివాసి అని గుర్తించారు. ఇటీవలె అవినాష్ కు పెళ్లి నిశ్చయమైంది. కానిస్టేబుల్ అనిల్ మల్లిక్ బాగలకోట్ జిల్లా జమఖండి తాలూకా చిక్కళకెరే వాసి. మ్యాక్స్ వెల్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు. మొత్తం 8 మంది పోలీసులు రెండు కార్లలో బెంగళూరు నుండి తిరుపతికి బయల్దేరారు. ఆ రెండు కార్లలో ఒకదానికి ప్రమాదం జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవ రాజ బొమ్మై దుర్ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget