అన్వేషించండి

Andhra News: విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపాల్ - నడవలేని స్థితిలో బాలికలు, అల్లూరి జిల్లాలో అమానవీయ ఘటన

Alluri District: అల్లూరి జిల్లా రంపచోడవరంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. క్రమశిక్షణ పేరుతో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థినులతో 3 రోజుల నుంచి 200 గుంజీలు తీయించగా వారు అస్వస్థతకు గురయ్యారు.

Students Falling Ill With Principal Punishment In Rampachodavaram: క్రమశిక్షణ పేరుతో ఓ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. తన మాట వినడం లేదని ఏకంగా 3 రోజుల పాటు వారితో ప్రతిరోజూ 100 నుంచి 200 గుంజీలు తీయించారు. వరుసగా నాలుగో రోజు కూడా అదే శిక్ష విధించడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ అమానవీయ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri District) రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసూన, పీడీ కృష్ణకుమారి తమ పట్ల దారుణంగా ప్రవర్తించారని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చెప్పిన మాట వినడం లేదని.. క్రమశిక్షణ పేరుతో శుక్రవారం నుంచి ప్రతి రోజూ 100 నుంచి 200 వరకూ గుంజీలు తీయించారు. సోమవారం కూడా ఇలాగే చేయడంతో దాదాపు 50 మంది విద్యార్థినుల వరకూ కాళ్ల నొప్పులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు. సాయంత్రానికి కొంతమంది కోలుకోగా వారిని డిశ్చార్జి చేశారు. మరికొంత మంది విద్యార్థినులు ఇంకా చికిత్స పొందుతున్నారు.

ఎమ్మెల్యే ఆగ్రహం

ఈ ఘటనపై ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ పేరుతో విద్యార్థినులను గుంజీలు తీయించడం దారుణమని అన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీవో కట్టా సింహాచలానికి సూచించారు. స్థానిక ఏరియా ఆస్పత్రికి వెళ్లి విద్యార్థినులను పరామర్శించి వారితో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదని.. తన సొంత డబ్బులతో తమకు భోజనం పెడుతున్నానని ప్రిన్సిపాల్ తమతో అంటున్నట్లు బాలికలు ఎమ్మెల్యే ఎదుట కంటతడి పెట్టారు. దీంతో వారిని ఓదార్చిన ఎమ్మెల్యే.. ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాలని భరోసా ఇచ్చారు.

మరోవైపు, తమ పిల్లలతో గుంజీలు తీయించడం పట్ల వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్, పీడీలపై చర్యలు తీసుకోవాలని.. వారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యా శాఖ మంత్రి లోకేశ్ ఈ ఘటనపై స్పందించాలని కోరుతున్నారు.

Also Read: Anna Canteens: ఈనెల 18న అనంతపురంలో మరికొన్ని అన్న క్యాంటీన్లు ప్రారంభం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Indian Tourists Boat Capsize: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 15 మంది మృతి!
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 15 మంది మృతి!
Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget