అన్వేషించండి

Andhra News: విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపాల్ - నడవలేని స్థితిలో బాలికలు, అల్లూరి జిల్లాలో అమానవీయ ఘటన

Alluri District: అల్లూరి జిల్లా రంపచోడవరంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. క్రమశిక్షణ పేరుతో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థినులతో 3 రోజుల నుంచి 200 గుంజీలు తీయించగా వారు అస్వస్థతకు గురయ్యారు.

Students Falling Ill With Principal Punishment In Rampachodavaram: క్రమశిక్షణ పేరుతో ఓ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. తన మాట వినడం లేదని ఏకంగా 3 రోజుల పాటు వారితో ప్రతిరోజూ 100 నుంచి 200 గుంజీలు తీయించారు. వరుసగా నాలుగో రోజు కూడా అదే శిక్ష విధించడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ అమానవీయ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri District) రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసూన, పీడీ కృష్ణకుమారి తమ పట్ల దారుణంగా ప్రవర్తించారని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చెప్పిన మాట వినడం లేదని.. క్రమశిక్షణ పేరుతో శుక్రవారం నుంచి ప్రతి రోజూ 100 నుంచి 200 వరకూ గుంజీలు తీయించారు. సోమవారం కూడా ఇలాగే చేయడంతో దాదాపు 50 మంది విద్యార్థినుల వరకూ కాళ్ల నొప్పులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు. సాయంత్రానికి కొంతమంది కోలుకోగా వారిని డిశ్చార్జి చేశారు. మరికొంత మంది విద్యార్థినులు ఇంకా చికిత్స పొందుతున్నారు.

ఎమ్మెల్యే ఆగ్రహం

ఈ ఘటనపై ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ పేరుతో విద్యార్థినులను గుంజీలు తీయించడం దారుణమని అన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీవో కట్టా సింహాచలానికి సూచించారు. స్థానిక ఏరియా ఆస్పత్రికి వెళ్లి విద్యార్థినులను పరామర్శించి వారితో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదని.. తన సొంత డబ్బులతో తమకు భోజనం పెడుతున్నానని ప్రిన్సిపాల్ తమతో అంటున్నట్లు బాలికలు ఎమ్మెల్యే ఎదుట కంటతడి పెట్టారు. దీంతో వారిని ఓదార్చిన ఎమ్మెల్యే.. ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాలని భరోసా ఇచ్చారు.

మరోవైపు, తమ పిల్లలతో గుంజీలు తీయించడం పట్ల వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్, పీడీలపై చర్యలు తీసుకోవాలని.. వారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యా శాఖ మంత్రి లోకేశ్ ఈ ఘటనపై స్పందించాలని కోరుతున్నారు.

Also Read: Anna Canteens: ఈనెల 18న అనంతపురంలో మరికొన్ని అన్న క్యాంటీన్లు ప్రారంభం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget