అన్వేషించండి

Andhra News: విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపాల్ - నడవలేని స్థితిలో బాలికలు, అల్లూరి జిల్లాలో అమానవీయ ఘటన

Alluri District: అల్లూరి జిల్లా రంపచోడవరంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. క్రమశిక్షణ పేరుతో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థినులతో 3 రోజుల నుంచి 200 గుంజీలు తీయించగా వారు అస్వస్థతకు గురయ్యారు.

Students Falling Ill With Principal Punishment In Rampachodavaram: క్రమశిక్షణ పేరుతో ఓ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. తన మాట వినడం లేదని ఏకంగా 3 రోజుల పాటు వారితో ప్రతిరోజూ 100 నుంచి 200 గుంజీలు తీయించారు. వరుసగా నాలుగో రోజు కూడా అదే శిక్ష విధించడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ అమానవీయ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri District) రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసూన, పీడీ కృష్ణకుమారి తమ పట్ల దారుణంగా ప్రవర్తించారని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చెప్పిన మాట వినడం లేదని.. క్రమశిక్షణ పేరుతో శుక్రవారం నుంచి ప్రతి రోజూ 100 నుంచి 200 వరకూ గుంజీలు తీయించారు. సోమవారం కూడా ఇలాగే చేయడంతో దాదాపు 50 మంది విద్యార్థినుల వరకూ కాళ్ల నొప్పులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు. సాయంత్రానికి కొంతమంది కోలుకోగా వారిని డిశ్చార్జి చేశారు. మరికొంత మంది విద్యార్థినులు ఇంకా చికిత్స పొందుతున్నారు.

ఎమ్మెల్యే ఆగ్రహం

ఈ ఘటనపై ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ పేరుతో విద్యార్థినులను గుంజీలు తీయించడం దారుణమని అన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీవో కట్టా సింహాచలానికి సూచించారు. స్థానిక ఏరియా ఆస్పత్రికి వెళ్లి విద్యార్థినులను పరామర్శించి వారితో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదని.. తన సొంత డబ్బులతో తమకు భోజనం పెడుతున్నానని ప్రిన్సిపాల్ తమతో అంటున్నట్లు బాలికలు ఎమ్మెల్యే ఎదుట కంటతడి పెట్టారు. దీంతో వారిని ఓదార్చిన ఎమ్మెల్యే.. ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాలని భరోసా ఇచ్చారు.

మరోవైపు, తమ పిల్లలతో గుంజీలు తీయించడం పట్ల వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్, పీడీలపై చర్యలు తీసుకోవాలని.. వారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యా శాఖ మంత్రి లోకేశ్ ఈ ఘటనపై స్పందించాలని కోరుతున్నారు.

Also Read: Anna Canteens: ఈనెల 18న అనంతపురంలో మరికొన్ని అన్న క్యాంటీన్లు ప్రారంభం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aadhaar Forgery: ఇంట్లో ఇల్లాలు, ఫైవ్ స్టార్ హోటల్లో ప్రియురాలు..కానీ ఆధార్ మాత్రం ఇల్లాలిదే - ఆ భర్త అలా దొరికిపోయాడు!
ఇంట్లో ఇల్లాలు, ఫైవ్ స్టార్ హోటల్లో ప్రియురాలు..కానీ ఆధార్ మాత్రం ఇల్లాలిదే - ఆ భర్త అలా దొరికిపోయాడు!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
Extramarital Affair: పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget