అన్వేషించండి

బతికున్న దంపతులను చంపేశారు, నకిలీ కుమారుడితో ఇంటిని అమ్మేశారు!

Sri Sathya Sai District: బతికున్న దంపతులను చంపేశారు. వారి కుమారుడికి బదులుగా నకిలీ కొడుకును తీసుకొచ్చి వారి పేరిట ఉన్న కోటిన్నర రూపాయల విలువ చేసే ఇంటిని వేరే వాళ్లకు అమ్మేశారు. 

Sri Sathya Sai District: రోజురోజుకూ స్థిరాస్తులను కాజేసే అక్రమార్కులు పెరిగిపోతున్నారు. డబ్బులు, ఆస్తుల కోసం కొందరు కన్నవాళ్లని, అయిన వాళ్లని కూడా చంపేస్తున్నారు. మరికొందరేమో యజమానులకు తెలియకుండానే వారి ఆస్తులను వేరే వాళ్లకు అమ్ముకుంటున్నారు. వాళ్లు బతికుండగానే చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి వారసులుగా వేరే వాళ్లను చూపిస్తూ కోట్లు విలువ చేసే ఆస్తులను కాజేస్తున్నారు. ఇలాంటి ఓ ఘటనే శ్రీ సత్య సాయి జిల్లాలో చోటు చేసుకుంది. 

అసలేం జరిగిందంటే..?

శ్రీసత్య సాయి జిల్లా ఓబులదేవరచెరువుకు చెందిన శ్రీరామ్ నాయక్, కాంతమ్మ భార్యాభర్తలు. ఉపాధి నిమిత్తం చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్ వలస వచ్చారు. వంట పని చేసుకుంటూ వచ్చిన రూపాయి, రూపాయి కూడబెట్టుకున్నారు. అయితే సొంత ఊళ్లో తమకంటూ ఓ ఇల్లు ఉండాలని భావించిన దంపతులు.. అలా పోగేసిన డబ్బుతో అనంతపురంలోని ఆదర్శ నగర్ లో 5 సెంట్ల స్థలం కన్నారు. ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2014లో.. హైదరాబాద్ లోనే హౌస్ లోన్ తీసుకొని మరీ ఇల్లు కట్టుకున్నారు. హైదరాబాద్ లో రుణం తీసుకున్నందున వారు భాగ్యనగరంలోనే ఉండాలని నిశ్చయించుకున్నారు. అప్పటి వరకు అనంతపురంలోని ఇంటిని అద్దెకు ఇవ్వలాని నిర్ణయించుకొని కిరాయికిచ్చారు. 

అప్పులు పెరిగాయని..

రోజురోజుకూ వడ్డీ భారం పెరగడంతో అప్పులు ఎక్కువయ్యాయి. అప్పుల బాధ పడలేక ఆ ఇంటిని అమ్మేసి అప్పు తీర్చేయాలని భావించారు. దాదాపు 10 మంది ఏజెంట్లకు ఇంటి పత్రాల జిరాక్సులు ఇచ్చారు. అయితే వారి ద్వారా శ్రీరామ్ నాయక్, కాంతమ్మ దంపతులకు ఓ విస్తుపోయే వాస్తవం తెలిసింది. శ్రీరామ్, కాంతమ్మ చనిపోయినట్లు కొందరు అక్రమార్కులు ధ్రువ పత్రాలు సృష్టించి, వారికి ఓ వారసుడిని సృష్టించి ఆ ఇంటి వేరే వాళ్లకు అమ్మారని తెలిసి షాక్ కు గురయ్యారు. 

శ్రీరామ్, కాంతమ్మ చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్లు..

ఓబులదేవరచెరువు మండలానికి చెందిన శ్రీరామ్ నాయక్ కుటుంబం కదిరిలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు నకిలీ పత్రాల్లో పేర్కొన్నారు. 2017 ఏప్రిల్ లో శ్రీరామ్, ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంతమ్మ మృతి చెందారంటూ పత్రాలు సృష్టించారు. ఈ నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు కదిరి మున్సిపల్ కమిషనర్ పేరిట మంజూరు అయ్యాయి. శ్రీరామ్ నాయక్ దంపతులకు కార్తిక్, పవన్ అనే ఇద్దరు కొడుకులు ఉండగా... ధర్మవరంలో అనిల్ అనే 20 ఏళ్ల యువకుడిని వారసుడిగా చూపిస్తూ మరో పత్రం సిద్ధం చేశారు. అనిల్ వారి కుమారుడేనని ధ్రువీకరిస్తూ తహసీల్దార్ తో సంబంధం లేకుండా ధర్మవరం వీఆర్వోనే వంశవృక్షం పత్రాన్ని జారీ చేశారు. 

నకిలీ కుమారుడితో ఆస్తి అమ్మకం..

ఈ నకిలీ పత్రాలను పరిగణలోకి తీసుకొని  అనంతపురంలోని ఆస్తిని ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశారు. కోటిన్నర విలువ చేసే ఇంటిని కప్పల ముత్యాలమ్మ అనే మహిళకు నకిలీ కుమారుడు అనిల్ విక్రయించినట్లు గత నెల 23వ తేదీన ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్ ఇచ్చేశారు. కదిరి మున్సిపాలిటీ, ధర్మవరం రెవెన్యూస రిజిస్ట్రేషన్ శాఖల అవినీతితో తాము రోడ్డున పడాల్సి వచ్చిందని అసలు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: హైదరాబాద్ లో మరోసారి భారీగా హవాలా డబ్బు పట్టివేత, రూ. 3.5 కోట్లు స్వాధీనం!

Also Read: ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ కు యువకుడు బలి, స్నేహితులే మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Exit trafficking case: ఆస్ట్రేలియాలో భారతీయుడిపై ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు - భార్యపై చేసిన కుట్రతోనే - ఇలాంటి పనులు కూడా చేస్తారా?
ఆస్ట్రేలియాలో భారతీయుడిపై ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు - భార్యపై చేసిన కుట్రతోనే - ఇలాంటి పనులు కూడా చేస్తారా?
Cyberabad Gandipet land scam 2026: గండిపేట భూ కుంభకోణం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు.. రూ. 1500 కోట్ల దందా బట్టబయలు!
గండిపేట భూ కుంభకోణం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు.. రూ. 1500 కోట్ల దందా బట్టబయలు!
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget