అన్వేషించండి

Crime News: సెల్ ఫోన్ కొనివ్వట్లేదని.. తండ్రిని దారుణంగా చంపేసిన తనయుడు

తూర్పుగోదావరి జిల్లా లో దారుణం జరిగింది. సెల్ ఫోన్ కొనుక్కోడానికి డబ్బులు ఇవ్వడం లేదని కన్న తండ్రినే అతి కిరాతకంగా నరికి చంపాడు ఓ తనయుడు. 

సెల్ ఫోన్ వచ్చాక చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఫోన్ ఎక్కువగా వాడటం వలన కలిగే నష్టాలను కూడా చూస్తున్నాం. అయితే సెల్ ఫోన్ కోసం స్నేహితుడిని హత్య..లాంటి వార్తలు చూశాం. ఓ వ్యక్తి సెల్ ఫోన్ కోసం తన తండ్రినే చంపేశాడు. తనకు ఎన్నిసార్లు అడిగినా.. సెల్ ఫోన్ కొనివ్వట్లేదని.. తండ్రిని దారుణంగా చంపేశాడు ఓ తనయుడు.. వివరాల్లోకి వెళ్తే.. 

తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం వానపల్లి పాలెంకు  చెందిన బొంతు రవి ఖాళీగా తిరిగుతాడు. ఎలాంటి పని చేయకుండా ఉంటాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. తన తండ్రి దగ్గర డబ్బులు తీసుకుని.. మద్యం తాగేవాడు.  తండ్రితో గొడవ పడుతూ ఉండేవాడు. అయితే ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో తండ్రి బొంతు జయరావు(50) తో వాగ్వాదానికి దిగాడు. తనకు అర్జెంట్ గా సెల్ ఫోన్ కొని ఇవ్వాలని.. అందుకు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. 

Also Read: RMP Doctor: ఒక్క ముద్దుకు రూ.25 వేలు, ఆస్పత్రి రెంట్ కూడా.. ఆర్ఎంపీ డాక్టర్‌కు ఆఫర్.. చివరికి..

సుమారు గంట సేపు తండ్రీ కొడుకుల మధ్య ఇదే వాగ్వాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే తండ్రి జయరావు నా దగ్గర డబ్బులు లేవు అని.. ఉన్నా ఇచ్చేది లేదని  చెప్పడంతో కోపోద్రిక్తుడైన రవి కత్తితో విచక్షణారహితంగా తండ్రిపై దాడి చేశాడు. రక్తపుమడుగులో పడి ఉన్న జయ రావును అమలాపురంలోని ఏరియా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు స్థానికులు. తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలో జయరావు మృతి చెందాడు.  

Also Read: Crime News: స్టూడెంట్ బుగ్గ కొరికిన హెడ్ మాస్టర్…స్కూల్లోనే ఉతికి ఆరేసిన తల్లిదండ్రులు

వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించే బొంతు  జయరాజు కుటుంబాన్ని పోషిస్తుండగా మద్యానికి బానిసై కొడుకు రవి గాలి తిరుగుళ్ళు తిరుగుతుంటాడని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని అమలాపురం సీఐ సురేష్ బాబు ఎస్సై వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

Also Read: Crime News: గర్భం దాల్చిన మహిళ.. విషయం తెలిసి ఇద్దరు ప్రియుల ఫైటింగ్.. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే..

Also Read: AP Fiber Net Case: ఏపీ ఫైబర్ నెట్ కేసులో తొలి అరెస్టు... సాంబశివరావును అరెస్టు చేసిన సీఐడీ... హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు

Also Read: Rajasthna Crime News: రాజస్థాన్ లో దారుణ ఘటన... నలుగురు కుమార్తెలను హత్యచేసిన తండ్రి...

టాప్ హెడ్ లైన్స్

Sridhar Babu Morphed Videos: మంత్రి శ్రీధర్ బాబు దంపతులను సైతం వదలని సైబర్ నేరగాళ్లు! ఏఐ మార్ఫింగ్ వీడియోలపై ఫిర్యాదు
మంత్రి శ్రీధర్ బాబు దంపతులను సైతం వదలని సైబర్ నేరగాళ్లు! ఏఐ మార్ఫింగ్ వీడియోలపై ఫిర్యాదు
Alluri Crime News: 8 ఏళ్ల చిన్నారిపై పాస్టర్ అమానుషం.. వేడి అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్ లో రికార్డ్
8 ఏళ్ల బాలికపై పాస్టర్ అమానుషం.. అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్లో రికార్డ్- అల్లూరి జిల్లాలో ఘటన
Pune Realtor Ketan Agarwal Murder: పాపం కేతన్ - ప్రాణాలే కాదు ముందుగా కోటి కూడా పోగొట్టుకున్నాడు - సియా ప్లాన్ నెక్ట్స్ లెవల్ !
పాపం కేతన్ - ప్రాణాలే కాదు ముందుగా కోటి కూడా పోగొట్టుకున్నాడు - సియా ప్లాన్ నెక్ట్స్ లెవల్ !
Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Kajal Aggarwal: కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
Embed widget