అన్వేషించండి

Telangana News: తెలంగాణలో పండుగ పూట తీవ్ర విషాదాలు - పిడుగు పడి ఇద్దరు, రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం

Tragedy Incidents: తెలంగాణలో పండుగ పూట తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. ఖమ్మం జిల్లాలో రైలు ఢీకొని తండ్రీకుమార్తెలు మృతి చెందగా.. మెదక్ జిల్లాలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు.

Severe Tragedy Incidents In Telangana: తెలంగాణలో దీపావళి పండుగ రోజున తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. ఓ చోట రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొని తండ్రీ కుమార్తె ప్రాణాలు కోల్పోగా.. మరోచోట, పిడుగు పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అటు, జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు బంగారం కోసం సొంత అమ్మమ్మనే కడతేర్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రైలు పట్టాలు దాటుతోన్న క్రమంలో తండ్రీ కుమార్తెలు రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన ఖమ్మం జిల్లా (Khammam District) మధిరలో (Madhira) చోటు చేసుకుంది. మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన కొంగర కేశవరావు (52), అతని కూతురు ఖమ్మంపాడు గ్రామానికి చెందిన నూకారపు సరిత (28)తో కలిసి విజయవాడలో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుని తిరిగి మధిర చేరుకున్నారు. వీరు విజయవాడ నుంచి ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మధిరకు వచ్చినట్లు తెలుస్తోంది. 

ట్రైన్ దిగి వెళ్తుండగా..

వీరు ట్రైన్ దిగి రైల్వే ట్రాక్ దాటి వెళ్తుండగా.. విజయవాడ నుంచి అహ్మదాబాద్ వెళ్తోన్న నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీ కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సరిత పదేళ్ల కుమారుడు పట్టాలు దాటి ప్రాణాలు దక్కించుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పీ.భాస్కరరావు తెలిపారు. మృతులు స్థానికులుగా గుర్తించడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. మరోవైపు, దెందుకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించారు. మృతుడు బాజాసాయిగా గుర్తించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పిడుగు పడి..

అటు, గొర్రెలు మేపడానికి వెళ్లి ఇద్దరు పిడుగు పడి మృతి చెందిన విషాద ఘటన మెదక్ జిల్లాలో (Medak District) జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్మాల్ మండలం ధనూర గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన డాకూరు శ్రీశైలం దంపతులకు ఇద్దరు కుమారులు భరత్, చరణ్. శ్రీశైలం తనకున్న గొర్రెలను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలానే బుధవారం శ్రీశైలం గొర్రెలను మేపడానికి వెళ్లాడు. మధ్యాహ్నం వరకూ అక్కడే ఉండి.. ఆ తర్వాత కుమారుడు భరత్‌ను గొర్రెల వద్ద ఉంచి తాను ఇంటికి వెళ్లాడు. ఇంతలోనే పిడుగు రూపంలో వచ్చిన మృత్యువు భరత్‌ను బలి తీసుకుంది. కొడుకు మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

అదే గ్రామానికి చెందిన బేతయ్య (42) గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురికి వివాహం చేయగా.. కుమారుడు హైదరాబాద్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బేతయ్య గొర్రెలు మేపుతుండగా పిడుగుపాటుకు గురై దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న భార్య విలపించింది. ఇద్దరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

బంగారం కోసం అమ్మమ్మను..

అటు, చెడు వ్యసనాలకు బానిసైన యువకుడు బంగారం కోసం అమ్మమ్మను హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట మండలం ఖానాపూర్ (బీ) గ్రామంలో దారుణం జరిగింది. జల్సాలకు అలవాటు పడి వ్యసనాలకు బానిసైన మహేష్ అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో డబ్బులు, ఆమె మెడలోని బంగారం కోసం అమ్మమ్మ దుర్గమ్మ (60)తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో అమ్మమ్మ ప్రతిఘటించడంతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం బంగారం తీసుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Diwali Celebrations: అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget