అన్వేషించండి

Telangana News: తెలంగాణలో పండుగ పూట తీవ్ర విషాదాలు - పిడుగు పడి ఇద్దరు, రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం

Tragedy Incidents: తెలంగాణలో పండుగ పూట తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. ఖమ్మం జిల్లాలో రైలు ఢీకొని తండ్రీకుమార్తెలు మృతి చెందగా.. మెదక్ జిల్లాలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు.

Severe Tragedy Incidents In Telangana: తెలంగాణలో దీపావళి పండుగ రోజున తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. ఓ చోట రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొని తండ్రీ కుమార్తె ప్రాణాలు కోల్పోగా.. మరోచోట, పిడుగు పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అటు, జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు బంగారం కోసం సొంత అమ్మమ్మనే కడతేర్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రైలు పట్టాలు దాటుతోన్న క్రమంలో తండ్రీ కుమార్తెలు రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన ఖమ్మం జిల్లా (Khammam District) మధిరలో (Madhira) చోటు చేసుకుంది. మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన కొంగర కేశవరావు (52), అతని కూతురు ఖమ్మంపాడు గ్రామానికి చెందిన నూకారపు సరిత (28)తో కలిసి విజయవాడలో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుని తిరిగి మధిర చేరుకున్నారు. వీరు విజయవాడ నుంచి ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మధిరకు వచ్చినట్లు తెలుస్తోంది. 

ట్రైన్ దిగి వెళ్తుండగా..

వీరు ట్రైన్ దిగి రైల్వే ట్రాక్ దాటి వెళ్తుండగా.. విజయవాడ నుంచి అహ్మదాబాద్ వెళ్తోన్న నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీ కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సరిత పదేళ్ల కుమారుడు పట్టాలు దాటి ప్రాణాలు దక్కించుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పీ.భాస్కరరావు తెలిపారు. మృతులు స్థానికులుగా గుర్తించడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. మరోవైపు, దెందుకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించారు. మృతుడు బాజాసాయిగా గుర్తించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పిడుగు పడి..

అటు, గొర్రెలు మేపడానికి వెళ్లి ఇద్దరు పిడుగు పడి మృతి చెందిన విషాద ఘటన మెదక్ జిల్లాలో (Medak District) జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్మాల్ మండలం ధనూర గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన డాకూరు శ్రీశైలం దంపతులకు ఇద్దరు కుమారులు భరత్, చరణ్. శ్రీశైలం తనకున్న గొర్రెలను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలానే బుధవారం శ్రీశైలం గొర్రెలను మేపడానికి వెళ్లాడు. మధ్యాహ్నం వరకూ అక్కడే ఉండి.. ఆ తర్వాత కుమారుడు భరత్‌ను గొర్రెల వద్ద ఉంచి తాను ఇంటికి వెళ్లాడు. ఇంతలోనే పిడుగు రూపంలో వచ్చిన మృత్యువు భరత్‌ను బలి తీసుకుంది. కొడుకు మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

అదే గ్రామానికి చెందిన బేతయ్య (42) గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురికి వివాహం చేయగా.. కుమారుడు హైదరాబాద్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బేతయ్య గొర్రెలు మేపుతుండగా పిడుగుపాటుకు గురై దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న భార్య విలపించింది. ఇద్దరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

బంగారం కోసం అమ్మమ్మను..

అటు, చెడు వ్యసనాలకు బానిసైన యువకుడు బంగారం కోసం అమ్మమ్మను హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట మండలం ఖానాపూర్ (బీ) గ్రామంలో దారుణం జరిగింది. జల్సాలకు అలవాటు పడి వ్యసనాలకు బానిసైన మహేష్ అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో డబ్బులు, ఆమె మెడలోని బంగారం కోసం అమ్మమ్మ దుర్గమ్మ (60)తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో అమ్మమ్మ ప్రతిఘటించడంతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం బంగారం తీసుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Diwali Celebrations: అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget