అన్వేషించండి

Telangana News: తెలంగాణలో పండుగ పూట తీవ్ర విషాదాలు - పిడుగు పడి ఇద్దరు, రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం

Tragedy Incidents: తెలంగాణలో పండుగ పూట తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. ఖమ్మం జిల్లాలో రైలు ఢీకొని తండ్రీకుమార్తెలు మృతి చెందగా.. మెదక్ జిల్లాలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు.

Severe Tragedy Incidents In Telangana: తెలంగాణలో దీపావళి పండుగ రోజున తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. ఓ చోట రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొని తండ్రీ కుమార్తె ప్రాణాలు కోల్పోగా.. మరోచోట, పిడుగు పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అటు, జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు బంగారం కోసం సొంత అమ్మమ్మనే కడతేర్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రైలు పట్టాలు దాటుతోన్న క్రమంలో తండ్రీ కుమార్తెలు రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన ఖమ్మం జిల్లా (Khammam District) మధిరలో (Madhira) చోటు చేసుకుంది. మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన కొంగర కేశవరావు (52), అతని కూతురు ఖమ్మంపాడు గ్రామానికి చెందిన నూకారపు సరిత (28)తో కలిసి విజయవాడలో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుని తిరిగి మధిర చేరుకున్నారు. వీరు విజయవాడ నుంచి ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మధిరకు వచ్చినట్లు తెలుస్తోంది. 

ట్రైన్ దిగి వెళ్తుండగా..

వీరు ట్రైన్ దిగి రైల్వే ట్రాక్ దాటి వెళ్తుండగా.. విజయవాడ నుంచి అహ్మదాబాద్ వెళ్తోన్న నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీ కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సరిత పదేళ్ల కుమారుడు పట్టాలు దాటి ప్రాణాలు దక్కించుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పీ.భాస్కరరావు తెలిపారు. మృతులు స్థానికులుగా గుర్తించడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. మరోవైపు, దెందుకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించారు. మృతుడు బాజాసాయిగా గుర్తించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పిడుగు పడి..

అటు, గొర్రెలు మేపడానికి వెళ్లి ఇద్దరు పిడుగు పడి మృతి చెందిన విషాద ఘటన మెదక్ జిల్లాలో (Medak District) జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్మాల్ మండలం ధనూర గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన డాకూరు శ్రీశైలం దంపతులకు ఇద్దరు కుమారులు భరత్, చరణ్. శ్రీశైలం తనకున్న గొర్రెలను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలానే బుధవారం శ్రీశైలం గొర్రెలను మేపడానికి వెళ్లాడు. మధ్యాహ్నం వరకూ అక్కడే ఉండి.. ఆ తర్వాత కుమారుడు భరత్‌ను గొర్రెల వద్ద ఉంచి తాను ఇంటికి వెళ్లాడు. ఇంతలోనే పిడుగు రూపంలో వచ్చిన మృత్యువు భరత్‌ను బలి తీసుకుంది. కొడుకు మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

అదే గ్రామానికి చెందిన బేతయ్య (42) గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురికి వివాహం చేయగా.. కుమారుడు హైదరాబాద్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బేతయ్య గొర్రెలు మేపుతుండగా పిడుగుపాటుకు గురై దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న భార్య విలపించింది. ఇద్దరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

బంగారం కోసం అమ్మమ్మను..

అటు, చెడు వ్యసనాలకు బానిసైన యువకుడు బంగారం కోసం అమ్మమ్మను హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట మండలం ఖానాపూర్ (బీ) గ్రామంలో దారుణం జరిగింది. జల్సాలకు అలవాటు పడి వ్యసనాలకు బానిసైన మహేష్ అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో డబ్బులు, ఆమె మెడలోని బంగారం కోసం అమ్మమ్మ దుర్గమ్మ (60)తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో అమ్మమ్మ ప్రతిఘటించడంతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం బంగారం తీసుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Diwali Celebrations: అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Instagram Reel: రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!
రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!
IIIT Student Commits Suicide: ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం
ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Monsoon Foods To Avoid : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
టైర్‌పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు
మీ కారు టైర్‌పై ఉన్న లోడ్ రేటింగ్‌ను ఎప్పుడైనా గమనించారా? దీని అర్థం తెలిస్తే షాక్ అవుతారు!
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Embed widget