అన్వేషించండి

Rajasthan News : రాజస్థాన్‌లో కిరాతకం - వెండి కడియాల కోసం వృద్ధురాలి కాళ్లు నరికేసిన దుండగులు

Rajasthan Crime: చిన్న చిన్న వస్తువుల కోసం మహిళలపై అత్యంత దారుణాలకు పాల్పడుతున్నారు దుండగులు. రాజస్థాన్‌లో మహిళ పెట్టుకున్న కడియాల కోసం కాళ్లు నరికేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.

Rajasthan 65 year old mutilated for silver anklets రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా గంగాపూర్ సిటీలో దొంగలు అత్యంత దారుణానికి ఒడిగట్టారు. 65 ఏళ్ల మహిళ కమలా దేవి  వెండి కడియా కోసం  దుండగులు ఆమె పాదాలను కట్ చేశారు. ఈ ఘటనకు ముందు ఆమెకు రొట్టెలు పెట్టారు వాటిని తిన్న తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దాంతో వారు కాళ్లు నరికేసి కడియాలు తీసుకుని వెళ్లిపోయారు. 
 
బాధితురాలు ప్రస్తుతం జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ (SMS) హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. పోలీసులు అనుమానిత దొంగల్ని పట్టుకున్నారు. వారు భార్యభర్తలుగా గుర్తించారు. రామోతర్ అలియాస్ కాడు బైర్వా (32), అతని భార్య తాను అలియాస్ సోనియా (భైసా నివాసి) ఈ ఘోరానికి పాల్పడినట్లుగా గుర్తించారు. వీరు గతంలోనూ ఇలాంటి ఘోరాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. 

కమలా దేవి తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు  గంగాపూర్ సిటీలో వచ్చారు. అక్కడ  రామోతర్‌ వారితో మాట్లాడారు.  కుమార్తె ఇంటి వద్ద దిగబెడతానని నమ్మించి వృద్ధురాలితో పాటు మరో ముగ్గురిని తన వాహనంలో ఎక్కించుకుని గంగాపూర్ సిటీ బైపాస్‌కు తీసుకెళ్లాడు.   మొదట మరో ముగ్గురిని డ్రాప్ చేసి, తర్వాత కమలా దేవిని తన భార్యతో కలిపి బైపాస్‌లో కూర్చోబెట్టాడు.

సాయంత్రం 8 గంటలకు  నిందితుడు వృద్ధురాలిని తన  ఇంటికి తీసుకెళ్లాడు. "పెద్దమ్మ, ఈ రోజు  కుమార్తె ఇంటికి తీసుకెళ్లలేను.. రేపు  తీసుకెళ్తా" అని చెప్పి  పరాటా, రొట్టెలు తినమని ఇచ్చాడు. తర్వాత ఆమెకు మగత ఆవహించింది. అక్కడ్నుంచి వృద్ధురాలిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె స్పృహ కోల్పోయింది.  తర్వాత వారు ఆమె  కాళ్లను నరికేసి.. వెండి కడియాలు దోచుకుని ఆమెను అక్కడ పడేసిపోయారు. తెల్లవారిన తర్వాత కాళ్లు నరికేసిన వృద్ధురాలిని కొంత మంది గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు.  ఆమెను గంగాపూర్ హాస్పిటల్‌కు తరలించారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @pro_writerx

 

హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మీడియాతో మాట్లాడిన కమలా దేవి తన కాళ్లు నరికిన వైనాన్ని వివరించి కన్నీరు పెట్టుకున్నారు.  గంగాపూర్ సిటీ పోలీసులు వారి మొబైల్ లొకేషన్ ట్రాక్ చేసి, నిందితులు గుర్తించారు. నిందితులు ఒంటరిగా ఉన్న మహిళల్ని నమ్మించి ఒంటరి ప్రదేశాలకు తీసుకెళ్లి కాళ్లు కట్ చేసి వెండి కడియాలు దోచుకుంటారని పోలీసులు గుర్తించారు.           

ఈ ఘటన రాజస్థాన్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిన్న చిన్న  ఆభరణాల కోసం ఆమె కాళ్లను అత్యంత కిరాతకంగా నరికేసిన ఆ దారుణమైన దంపతుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.         

 

                            

టాప్ హెడ్ లైన్స్

Hanamkonda Crime News: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
Investment Fraud: తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
AE Nookaraju Family Suicide Case: సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
Chennai Suitcase Murder Case: చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NH 365 BB Development: తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
AE Nookaraju Grandson: సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
Polavaram Left Canal: గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
Junior Doctors Strike: సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
Pant Injury Update: పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
YS Jagan:
"స్థానిక సంస్థలన్నీ మనవే! ఏకగ్రీవాలు కానివ్వొద్దు, ఎలక్షన్స్‌ను లైట్ తీసుకొవద్దు" వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
Rules for Foreign Travel Clearances: విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
Embed widget