అన్వేషించండి

Rachakonda: రాచకొండ పరిధిలో 60 శాతం పెరిగిన సైబర్ నేరాలు... 55 శాతం కేసుల్లో నేరస్తులకు శిక్షలు... నేరాల జాబితాను ప్రకటించిన సీపీ మహేష్ భగవత్

హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 21685 నమోదు అయ్యాయని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ కేసుల్లో 55 శాతం నేరస్తులు శిక్షలు పడ్డాయని పేర్కొన్నారు.

హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జరిగిన నేరాల జాబితాను సీపీ మహేష్ భగవత్ ప్రకటించారు. ఈ ఏడాదిలో 5779 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 
NDPS Act కింద 33 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. 122 బాల్య వివాహాలను రాచకొండ పోలీసులు అడ్డుకున్నారని సీపీ మహేష్ భగవత్ అన్నారు. ఈ ఏడాది 55 శాతం నేరస్తులకు శిక్షలు ఖరారయ్యాయని తెలిపారు.  2021లో మొత్తం 21685 కేసులు నమోదు అయ్యాయన్నారు. ఈ ఏడాదిలో 1360 సైబర్ క్రైమ్ కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. రాచకొండ పరిధిలో  రూ.14 కోట్లకు పైగా కేటుగాళ్లు కొల్లుకొట్టారని, వీటిల్లో రూ.8 కోట్లు రికవరీ చేశామన్నారు. ఈ ఏడాది 75 హత్యలు, 285 కిడ్నాప్ లు, 375 అత్యాచారం కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 2446 అని ప్రకటించారు. 

గృహ హింస కేసులు

17 కేసుల్లో వరకట్న వేధింపులతో మరణాలు, వరకట్న కోసం హత్యలు 3 జరిగాయని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. మహిళ హత్యలు 11, పోక్సో కేసులు 394 నమోదు అయ్యాయన్నారు. గృహ హింస కేసులు 1403 నమోదు అయ్యాయని ప్రకటించారు.  2021లో 93 డ్రగ్స్ కేసులు నమోదు అయ్యాయని, ఈ కేసుల్లో 175 మంది అరెస్ట్ చేశామని, మరో 33 మందిపై పీడీ యాక్ట్ పెట్టామని పేర్కొన్నారు.  
మానవ అక్రమ రవాణా సంబంధించి 106 కేసులు నమోదు అవ్వగా, 354 మంది నిందితులను అరెస్ట్ చేశామని, 55 మందిపై పీడీ యాక్ట్ పెట్టామని సీపీ తెలిపారు.  గేమింగ్ యాక్ట్ కింద రూ.కోటి యాభై లక్షలు స్వాధీనం చేశామని, ఈ కేసుల్లో 1079 మందిని అరెస్ట్ చేశామని సీపీ వెల్లడించారు.  

Also Read: జగన్ బెయిల్ రద్దుపై తీర్పు రిజర్వ్ - తెలంగాణ హైకోర్టులో పూర్తయిన వాదనలు !

డ్రంకన్ డ్రైమ్ కేసుల్లో రూ.2.02 కోట్లు జరిమానా

2020లో షీ టీమ్స్ 187 ఎఫ్ఐఆర్లు  నమోదు చేయగా, ఈ ఏడాది 140 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని సీపీ మహేష్ భగవత్ ప్రకటించారు.  ఆఫరేషన్ స్మైల్ అండ్ ఆఫరేషన్ ముస్కాన్ ద్వారా 459 మంది చిన్నారులను పోలీసులు రెస్క్యూ చేశారని ప్రకటించారు. రాచకొండ పరిధిలో ఈ ఏడాది 2615 రోడ్డు ప్రమాదాలు జరిగాయాని సీపీ తెలిపారు. ఈ ప్రమాదాల్లో 642 మంది మృతి చెందారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడిన 580 మందికి జైలు శిక్ష పడింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రూ.2.02 కోట్ల జరిమానాలు విధించారు.  15 మంది మందుబాబుల లైసెన్సన్ లు రద్దు చేశారు. హెల్మెట్ ధరించని వారిపై 15.33 లక్షలు కేసులు నమోదు చేశారు. కోడి పందేలకు పాల్పడిన 16 మందిని అరెస్ట్ చేశారు.  

Also Read:  గ్రే హౌండ్స్, మావోయిస్టులకు మధ్య కాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి, కొనసాగుతున్న ఆపరేషన్

సైబర్ క్రైమ్స్

రాచకొండ పోలీసు కమిషనరేట్ లో గత ఏడాదితో పోలిస్తే 60 శాతం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి. సైబర్ క్రైమ్ 1360 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో 116 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. రూ.2.02 కోట్లు రికవరీ చేయగా, రూ.3.8 కోట్లు బ్యాంక్ అకౌంట్ ల నుంచి ఫ్రీజ్ చేశారు. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా 3291 ఫిర్యాదులు అందుకున్న రాచకొండ పోలీసులు.. 257 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.  రాచకొండలో ఈ ఏడాది 171 మంది పై పీడీ యాక్ట్ పెట్టారు. సోషల్ మీడియా ద్వారా 5630 ఫిర్యాదులు అందాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా 655, వాట్సాప్ ద్వారా 4665 ఫిర్యాదులు అందాయని సీపీ తెలిపారు. రాచకొండలో అలజడి సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ కు న్యాయస్థానం ఐదేళ్లు శిక్ష విధించిందని సీపీ ప్రకటించారు.  

Also Read: ఆ కేసులో ఇరికిస్తారనే భయంతో యువనటి ఆత్మహత్య.. అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో దారుణం.. చివర్లో ట్విస్ట్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget